ETV Bharat / bharat

వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం

author img

By

Published : Sep 27, 2020, 6:39 PM IST

Updated : Sep 27, 2020, 7:25 PM IST

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన మూడు వ్యవసాయ బిల్లులకు ఆమోదం తెలిపారు రాష్ట్రపతి. ఫలితంగా ఈ బిల్లులు చట్టరూపం దాల్చాయి. జమ్ముకశ్మీర్​ అధికారిక భాషలు బిల్లు-2020కి కూడా రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు గెజిట్​ నోటిఫికేషన్​ విడుదలైంది.

President Ram Nath Kovind gives assent to three farm bills
వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం

వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఆమోద ముద్ర వేశారు.

ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ (ప్రమోషన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌) బిల్‌ 2020, ద ఫార్మర్స్‌ (ఎంపవర్‌మెంట్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) అగ్రిమెంట్‌ ఆఫ్‌ ప్రైస్‌ అస్యూరెన్స్‌ అండ్‌ ఫార్మ్‌ సర్వీసెస్‌ బిల్‌ 2020, నిత్యావసరాల చట్టం (సవరణ) బిల్లు 2020కు రాష్ట్రపతి సమ్మతి తెలిపినట్లు అధికారికంగా నోటిఫికేషన్​ విడుదల చేశారు.

ఇటీవలి పార్లమెంటు వర్షాకాల సమావేశా‌లలో వ్యవసాయ బిల్లులకు పార్లమెంటు ఆమోదం లభించింది. ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదంతో బిల్లులు చట్టరూపం దాల్చాయి. రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా, ఎవరికైనా విక్రయించుకునే అవకాశాన్ని ఈ చట్టాలు కల్పిస్తాయి.

ఇదీ చూడండి: గందరగోళం మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం

వీటితోపాటు కశ్మీరీ, డోంగ్రీ, హిందీని జమ్ముకశ్మీర్ అధికారిక భాషల జాబితాలో చేర్చుతూ రూపొందించిన బిల్లుకూ రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. సెప్టెంబర్​ 26నే ఈ జమ్ముకశ్మీర్​ అధికారిక భాషల బిల్లు-2020కి రాష్ట్రపతి సమ్మతి లభించినట్లు గెజిట్​ నోటిఫికేషన్​ విడుదలైంది.

ఆందోళనల నడుమ..

రైతుల ఆందోళనలు, బిల్లులను వెనక్కి పంపాలన్న విపక్షాల అభ్యర్థనల నడుమ రాష్ట్రపతి వ్యవసాయ బిల్లులను ఆమోదించారు. ఈ బిల్లులకు సంబంధించి అభిప్రాయభేదాలతో ఎన్డీఏ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్​ ఆ కూటమి నుంచి విడిపోయింది. అంతకుముందు ఆ పార్టీ నేత హర్​సిమ్రత్​కౌర్​ బాదల్​ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు.

ఇంకా ఈ బిల్లులకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో రైతు సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా పంజాబ్​, హరియాణాలో నిరసనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే వ్యవసాయ బిల్లులపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారాలు నిర్వహించాలని భాజపా నిర్ణయించింది. 7 రాష్ట్రాల్లో 15 రోజుల పాటు వీడియో కాన్ఫరెన్స్​లు, మీడియా సమావేశాలు, వెబినార్లు నిర్వహించాలని పార్టీ సభ్యులకు, కార్యకర్తలకు ఆదేశాలిచ్చింది.

ఇదీ చూడండి: వ్యవసాయ బిల్లులపై అవగాహనకు భాజపా ప్రచారాలు

బిల్లులు ఏం చెబుతున్నాయి...?

1. రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు-2020

రైతులకు తమ ఉత్పత్తులను ప్రభుత్వామోదిత ఏపీఎంసీ మార్కెట్​ వెలుపల విక్రయించుకోవడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. రైతులకు సులభమైన ప్రత్యామ్నాయ మార్కెటింగ్​ మార్గాలను కల్పించడం దీని ఉద్దేశం. ఈ చట్టం ప్రకారం రైతులు తమ ఉత్పత్తులను విక్రయించడం వల్ల వారి నుంచి ఎలాంటి సెస్​ను గానీ పన్నులనూ వసూలు చేయరు.

2. రైతుల సాధికారత, రక్షణ, వ్యవసాయ సేవల బిల్లు- 2020

రైతులు నేరుగా అగ్రికల్చర్​ బిజినెస్​ సంస్థలు, టోకు వ్యాపారులు, ఎగుమతిదారులు, పెద్ద రిటైలర్లతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది.

3. నిత్యావసరాల సవరణ బిల్లు

తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెలు వంటి ఉత్పత్తులను నిత్యావసర వస్తువల జాబితా నుంచి తొలగించాలని ఈ బిల్లు చెబుతోంది.

వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఆమోద ముద్ర వేశారు.

ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ (ప్రమోషన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌) బిల్‌ 2020, ద ఫార్మర్స్‌ (ఎంపవర్‌మెంట్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) అగ్రిమెంట్‌ ఆఫ్‌ ప్రైస్‌ అస్యూరెన్స్‌ అండ్‌ ఫార్మ్‌ సర్వీసెస్‌ బిల్‌ 2020, నిత్యావసరాల చట్టం (సవరణ) బిల్లు 2020కు రాష్ట్రపతి సమ్మతి తెలిపినట్లు అధికారికంగా నోటిఫికేషన్​ విడుదల చేశారు.

ఇటీవలి పార్లమెంటు వర్షాకాల సమావేశా‌లలో వ్యవసాయ బిల్లులకు పార్లమెంటు ఆమోదం లభించింది. ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదంతో బిల్లులు చట్టరూపం దాల్చాయి. రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా, ఎవరికైనా విక్రయించుకునే అవకాశాన్ని ఈ చట్టాలు కల్పిస్తాయి.

ఇదీ చూడండి: గందరగోళం మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం

వీటితోపాటు కశ్మీరీ, డోంగ్రీ, హిందీని జమ్ముకశ్మీర్ అధికారిక భాషల జాబితాలో చేర్చుతూ రూపొందించిన బిల్లుకూ రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. సెప్టెంబర్​ 26నే ఈ జమ్ముకశ్మీర్​ అధికారిక భాషల బిల్లు-2020కి రాష్ట్రపతి సమ్మతి లభించినట్లు గెజిట్​ నోటిఫికేషన్​ విడుదలైంది.

ఆందోళనల నడుమ..

రైతుల ఆందోళనలు, బిల్లులను వెనక్కి పంపాలన్న విపక్షాల అభ్యర్థనల నడుమ రాష్ట్రపతి వ్యవసాయ బిల్లులను ఆమోదించారు. ఈ బిల్లులకు సంబంధించి అభిప్రాయభేదాలతో ఎన్డీఏ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్​ ఆ కూటమి నుంచి విడిపోయింది. అంతకుముందు ఆ పార్టీ నేత హర్​సిమ్రత్​కౌర్​ బాదల్​ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు.

ఇంకా ఈ బిల్లులకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో రైతు సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా పంజాబ్​, హరియాణాలో నిరసనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే వ్యవసాయ బిల్లులపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారాలు నిర్వహించాలని భాజపా నిర్ణయించింది. 7 రాష్ట్రాల్లో 15 రోజుల పాటు వీడియో కాన్ఫరెన్స్​లు, మీడియా సమావేశాలు, వెబినార్లు నిర్వహించాలని పార్టీ సభ్యులకు, కార్యకర్తలకు ఆదేశాలిచ్చింది.

ఇదీ చూడండి: వ్యవసాయ బిల్లులపై అవగాహనకు భాజపా ప్రచారాలు

బిల్లులు ఏం చెబుతున్నాయి...?

1. రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు-2020

రైతులకు తమ ఉత్పత్తులను ప్రభుత్వామోదిత ఏపీఎంసీ మార్కెట్​ వెలుపల విక్రయించుకోవడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. రైతులకు సులభమైన ప్రత్యామ్నాయ మార్కెటింగ్​ మార్గాలను కల్పించడం దీని ఉద్దేశం. ఈ చట్టం ప్రకారం రైతులు తమ ఉత్పత్తులను విక్రయించడం వల్ల వారి నుంచి ఎలాంటి సెస్​ను గానీ పన్నులనూ వసూలు చేయరు.

2. రైతుల సాధికారత, రక్షణ, వ్యవసాయ సేవల బిల్లు- 2020

రైతులు నేరుగా అగ్రికల్చర్​ బిజినెస్​ సంస్థలు, టోకు వ్యాపారులు, ఎగుమతిదారులు, పెద్ద రిటైలర్లతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది.

3. నిత్యావసరాల సవరణ బిల్లు

తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెలు వంటి ఉత్పత్తులను నిత్యావసర వస్తువల జాబితా నుంచి తొలగించాలని ఈ బిల్లు చెబుతోంది.

Last Updated : Sep 27, 2020, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.