ETV Bharat / bharat

ప్రతిభా పాటిల్​కు మెక్సికో అత్యున్నత పురస్కారం

మెక్సికో దేశ అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్​ ది అగ్విలా అజ్​టెకా​'ను అందుకున్నారు మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్​. పుణెలోని మెక్సికో రాయబార కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రతిభా పాటిల్​కు ఈ అవార్డును అందజేశారు ఆ దేశ రాయబారి మెల్బా ప్రియా.

author img

By

Published : Jun 2, 2019, 7:20 AM IST

ప్రతిభా పాటిల్​కు మెక్సికో అత్యున్నత పురస్కారం

భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్​కు అరుదైన గౌరవం దక్కింది. మెక్సికో అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్​ ది అగ్విలా అజ్​టెకా' అవార్డును అందుకున్నారు ప్రతిభ. మెక్సికో అంబాసిడర్ మెల్బా ప్రియా పుణెలోని రాయబార కార్యాలయంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ప్రతిభా పాటిల్ 2007-2012మధ్యకాలంలో భారత రాష్ట్రపతిగా వ్యవహరించారు. ఈ పదవిని చేపట్టిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు.

రెండో వ్యక్తి...

మెక్సికో అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న వారిలో ప్రతిభా పాటిల్ రెండోవారు. ఇంతకుముందు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్​కు ఈ గౌరవం దక్కింది.
తాను రాష్ట్రపతిగా ఉన్నప్పుడు భారత్, మెక్సికో మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని పురస్కారం అందుకున్న అనంతరం వెల్లడించారు ప్రతిభా పాటిల్. 2007లో మెక్సికో అధ్యక్షుడు ఫిలిప్ డి జాజస్ హినోజోసా భారత్​లో పర్యటించారన్నారు. తాను 2008లో మెక్సికోలో పర్యటించానని ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మైత్రి బలపడిందని తెలిపారు.

మెక్సికోతో మానవ సంబంధాల బలోపేతానికి కృషి చేసిన విదేశీయులకు ఈ పురస్కారాన్ని అందజేస్తుంటామని ఈ దేశ రాయబారి మెల్బా ప్రియా వెల్లడించారు.

ఇదీ చూడండి: ఆర్థిక వృద్ధికి నూతన సంస్కరణలు: నీతి ఆయోగ్

భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్​కు అరుదైన గౌరవం దక్కింది. మెక్సికో అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్​ ది అగ్విలా అజ్​టెకా' అవార్డును అందుకున్నారు ప్రతిభ. మెక్సికో అంబాసిడర్ మెల్బా ప్రియా పుణెలోని రాయబార కార్యాలయంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ప్రతిభా పాటిల్ 2007-2012మధ్యకాలంలో భారత రాష్ట్రపతిగా వ్యవహరించారు. ఈ పదవిని చేపట్టిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు.

రెండో వ్యక్తి...

మెక్సికో అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న వారిలో ప్రతిభా పాటిల్ రెండోవారు. ఇంతకుముందు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్​కు ఈ గౌరవం దక్కింది.
తాను రాష్ట్రపతిగా ఉన్నప్పుడు భారత్, మెక్సికో మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని పురస్కారం అందుకున్న అనంతరం వెల్లడించారు ప్రతిభా పాటిల్. 2007లో మెక్సికో అధ్యక్షుడు ఫిలిప్ డి జాజస్ హినోజోసా భారత్​లో పర్యటించారన్నారు. తాను 2008లో మెక్సికోలో పర్యటించానని ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మైత్రి బలపడిందని తెలిపారు.

మెక్సికోతో మానవ సంబంధాల బలోపేతానికి కృషి చేసిన విదేశీయులకు ఈ పురస్కారాన్ని అందజేస్తుంటామని ఈ దేశ రాయబారి మెల్బా ప్రియా వెల్లడించారు.

ఇదీ చూడండి: ఆర్థిక వృద్ధికి నూతన సంస్కరణలు: నీతి ఆయోగ్

AP Video Delivery Log - 2100 GMT News
Saturday, 1 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2001: Bosnia Migrants Fire 4 Part must credit content creator Malik Abbasi 4213746
Fire rips through Bosnia migrant centre; witnesses
AP-APTN-1945: UK Airshow AP Clients Only 4213744
Red Arrows among highlights at Torbay airshow
AP-APTN-1926: Libya Fighting AP Clients Only 4213735
Libya govt forces battle Hifter forces near capital
AP-APTN-1907: Hungary Danube Timelapse AP Clients Only 4213734
Timelapse of scene of Danube boat collision
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.