ETV Bharat / bharat

విషమంగా ప్రణబ్​ ఆరోగ్యం- వెంటిలేటర్​పై చికిత్స

author img

By

Published : Aug 11, 2020, 4:45 PM IST

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని దిల్లీలోని ఆర్​ఆర్​ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్​పై చికిత్స అందిస్తున్నట్లు హెల్త్​ బులెటిన్​లో పేర్కొన్నారు.

Pranab Mukherjee remains critical, on ventilator support post surgery: Hospital
విషమంగా ప్రణబ్​ ఆరోగ్యం.. వెంటిలేటర్​పై చికిత్స

మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. వెంటిలేటర్​పై చికిత్స అందిస్తున్నామని దిల్లీలోని ఆర్మీ రీసెర్చ్​ అండ్​ రిఫరల్​ ఆసుపత్రి(ఆర్​ఆర్)​ వైద్యులు తెలిపారు. ప్రణబ్​ ఆరోగ్యాన్ని నిపుణులతో కూడిన బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని చెప్పారు.

84 ఏళ్ల ప్రణబ్​ ముఖర్జీ.. ఈ నెల 10న మధ్యాహ్నం ఆర్​ఆర్​ ఆస్పత్రిలో చేరారు. మెదడులో ఏర్పడిన గడ్డలను తొలిగించేందుకు సోమవారం అయనకు ఆపరేషన్​ చేశారు. శస్త్రచికిత్సకు ముందు చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్​గా తేలింది.

త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ..

మాజీ రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు పలువురు ప్రముఖులు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్.. ప్రణబ్​ కుమార్తె షర్మిష్టా ముఖర్జీతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ఆర్​ఆర్​ ఆసుపత్రికి వెళ్లి.. ప్రణబ్​ ముఖర్జీ ఆరోగ్యం గురించి ఆరాతీశారు. సుమారు 20 నిమిషాల పాటు అక్కడే ఉన్నారు రాజ్​నాథ్​.

మాజీ రాష్ట్రపతి త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: తండ్రి ఆఖరి చూపు ఖరీదు రూ. 51,000/-..!

మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. వెంటిలేటర్​పై చికిత్స అందిస్తున్నామని దిల్లీలోని ఆర్మీ రీసెర్చ్​ అండ్​ రిఫరల్​ ఆసుపత్రి(ఆర్​ఆర్)​ వైద్యులు తెలిపారు. ప్రణబ్​ ఆరోగ్యాన్ని నిపుణులతో కూడిన బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని చెప్పారు.

84 ఏళ్ల ప్రణబ్​ ముఖర్జీ.. ఈ నెల 10న మధ్యాహ్నం ఆర్​ఆర్​ ఆస్పత్రిలో చేరారు. మెదడులో ఏర్పడిన గడ్డలను తొలిగించేందుకు సోమవారం అయనకు ఆపరేషన్​ చేశారు. శస్త్రచికిత్సకు ముందు చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్​గా తేలింది.

త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ..

మాజీ రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు పలువురు ప్రముఖులు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్.. ప్రణబ్​ కుమార్తె షర్మిష్టా ముఖర్జీతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ఆర్​ఆర్​ ఆసుపత్రికి వెళ్లి.. ప్రణబ్​ ముఖర్జీ ఆరోగ్యం గురించి ఆరాతీశారు. సుమారు 20 నిమిషాల పాటు అక్కడే ఉన్నారు రాజ్​నాథ్​.

మాజీ రాష్ట్రపతి త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: తండ్రి ఆఖరి చూపు ఖరీదు రూ. 51,000/-..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.