ETV Bharat / bharat

క్షమాపణలు చెప్పిన సాధ్వి- నివేదిక కోరిన ఈసీ

'నాథూరామ్​ గాడ్సే గొప్ప దేశభక్తుడు' అనేది తన వ్యక్తిగత అభిప్రాయమని, ఈ వ్యాఖ్యలతో ఎవరినైనా బాధించి ఉంటే అందుకు క్షమాపణలు చెబుతున్నానని భాజపా నేత సాధ్వి ప్రజ్ఞాసింగ్​ ఠాకూర్​ అన్నారు. ఆమె మధ్యప్రదేశ్​ భోపాల్​లో భాజపా తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. అయితే ప్రజ్ఞాసింగ్​ వ్యాఖ్యలపై నివేదిక అందించాలని మధ్యప్రదేశ్​ ఎన్నికల అధికారిని ఈసీ ఆదేశించింది.

author img

By

Published : May 16, 2019, 11:44 PM IST

Updated : May 17, 2019, 12:00 AM IST

క్షమాపణలు చెప్పిన సాధ్వి- నివేదిక కోరిన ఈసీ
క్షమాపణలు చెప్పిన సాధ్వి- నివేదిక కోరిన ఈసీ

మధ్యప్రదేశ్​ భోపాల్​లో భాజపా ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తోన్న సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్​, 'నాథూరాం గాడ్సే' గురించి చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది. ప్రజ్ఞాసింగ్​ వ్యాఖ్యలపై 'వాస్తవ నివేదిక' అందించాలని మధ్యప్రదేశ్​ ప్రధాన ఎన్నికల అధికారిని ఈసీ శుక్రవారం ఆదేశించింది.

మాలేగావ్​ పేలుళ్ల కేసులో నిందితురాలుగా ఉన్న సాధ్వి ప్రజ్ఞాసింగ్... మహాత్మా గాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సేను.. గొప్ప దేశభక్తుడు అంటూ అభివర్ణించారు. రాజకీయ దుమారం రేగడం వల్ల తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని.. క్షమాపణలూ చెప్పారు.

"ఇతరుల మనోభావాలను దెబ్బతీయాలని, వారి మనసును నొప్పించాలనేది నా ఉద్దేశం కాదు. ఒక వేళ ఎవరినైనా నొప్పించి ఉంటే అందుకు క్షమాపణలు చెబుతాను. ఈ దేశానికి గాంధీజీ చేసిన సేవలను మరిచిపోలేము. ఆయనంటే నాకు చాలా గౌరవం ఉంది. నా మాటలను మీడియా వక్రీకరించింది."-సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్​, భాజపా నేత

'నాథూరామ్​ గాడ్సే గొప్ప దేశభక్తుడు'

'స్వతంత్ర భారతదేశంలో తొలి ఉగ్రవాది హిందువే (నాథూరామ్​ గాడ్సే)' అని, మక్కల్​ నీది మయ్యమ్ వ్యవస్థాపకుడు కమల్​ హాసన్​ చేసిన వ్యాఖ్యలపై సాధ్వి ప్రజ్ఞాసింగ్ మండిపడ్డారు. బదులుగా నాథూరామ్​ గొప్ప దేశభక్తుడని అభివర్ణించారు.

"నాథూరామ్​ గాడ్సే దేశభక్తుడు. అతను ఎప్పటికీ దేశభక్తుడుగానే ఉంటారు. అతనిని తీవ్రవాదిగా పిలుస్తున్నవారు, బదులుగా తమను తాము చూసుకోవాలి. ఆయనపై విమర్శలు చేసిన వారికి ఈ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారు."- ప్రజ్ఞాసింగ్ ఠాకూర్​, భాజపా నేత

ఈనెల మొదట్లో మతపర ఉద్రిక్తతలు ప్రోత్సహించేలా ప్రసంగించి, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ప్రజ్ఞాసింగ్​పై ఈసీ మూడు రోజులపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా నిషేధించింది.

ఇదీ చూడండి: బోఫోర్స్ దర్యాప్తు కొనసాగుతుంది: సీబీఐ

క్షమాపణలు చెప్పిన సాధ్వి- నివేదిక కోరిన ఈసీ

మధ్యప్రదేశ్​ భోపాల్​లో భాజపా ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తోన్న సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్​, 'నాథూరాం గాడ్సే' గురించి చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది. ప్రజ్ఞాసింగ్​ వ్యాఖ్యలపై 'వాస్తవ నివేదిక' అందించాలని మధ్యప్రదేశ్​ ప్రధాన ఎన్నికల అధికారిని ఈసీ శుక్రవారం ఆదేశించింది.

మాలేగావ్​ పేలుళ్ల కేసులో నిందితురాలుగా ఉన్న సాధ్వి ప్రజ్ఞాసింగ్... మహాత్మా గాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సేను.. గొప్ప దేశభక్తుడు అంటూ అభివర్ణించారు. రాజకీయ దుమారం రేగడం వల్ల తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని.. క్షమాపణలూ చెప్పారు.

"ఇతరుల మనోభావాలను దెబ్బతీయాలని, వారి మనసును నొప్పించాలనేది నా ఉద్దేశం కాదు. ఒక వేళ ఎవరినైనా నొప్పించి ఉంటే అందుకు క్షమాపణలు చెబుతాను. ఈ దేశానికి గాంధీజీ చేసిన సేవలను మరిచిపోలేము. ఆయనంటే నాకు చాలా గౌరవం ఉంది. నా మాటలను మీడియా వక్రీకరించింది."-సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్​, భాజపా నేత

'నాథూరామ్​ గాడ్సే గొప్ప దేశభక్తుడు'

'స్వతంత్ర భారతదేశంలో తొలి ఉగ్రవాది హిందువే (నాథూరామ్​ గాడ్సే)' అని, మక్కల్​ నీది మయ్యమ్ వ్యవస్థాపకుడు కమల్​ హాసన్​ చేసిన వ్యాఖ్యలపై సాధ్వి ప్రజ్ఞాసింగ్ మండిపడ్డారు. బదులుగా నాథూరామ్​ గొప్ప దేశభక్తుడని అభివర్ణించారు.

"నాథూరామ్​ గాడ్సే దేశభక్తుడు. అతను ఎప్పటికీ దేశభక్తుడుగానే ఉంటారు. అతనిని తీవ్రవాదిగా పిలుస్తున్నవారు, బదులుగా తమను తాము చూసుకోవాలి. ఆయనపై విమర్శలు చేసిన వారికి ఈ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారు."- ప్రజ్ఞాసింగ్ ఠాకూర్​, భాజపా నేత

ఈనెల మొదట్లో మతపర ఉద్రిక్తతలు ప్రోత్సహించేలా ప్రసంగించి, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ప్రజ్ఞాసింగ్​పై ఈసీ మూడు రోజులపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా నిషేధించింది.

ఇదీ చూడండి: బోఫోర్స్ దర్యాప్తు కొనసాగుతుంది: సీబీఐ

Hailakandi (Assam), May 16 (ANI): In a humane and courageous gesture, a Muslim auto driver helped a Hindu woman and her newly born baby to reach home safely during curfew in Assam's Hailakandi. The incident took place on May 12 when the curfew was imposed in Hailakandi following communal clashes. During curfew, a child was born and no vehicles were available to take the child home. Father of the newborn, Ruben Das, called his friend Maqbool, who is an auto driver for help. Unfazed by religious differences during the curfew, Maqbool stood by his friend and took the risk of facing police during curfew and dropped family home. The child has been named 'Shanti'. The incident is an apt example of communal harmony in the country.
Last Updated : May 17, 2019, 12:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.