ETV Bharat / bharat

'నన్నే జైలుకు పంపుతానని దీదీ బెదిరింపు'

బంగాల్​ మధురాపుర్​లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మమతా బెనర్జీపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. విద్యాసాగర్​ విగ్రహాన్ని ధ్వంసం చేసి... ఇప్పుడు పోలీసుల చేత సాక్ష్యాలు మాయం చేయిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల అనంతరం తనను జైలుకు పంపుతానని దీదీ బెదిరిస్తున్నట్లు వ్యాఖ్యానించారు మోదీ.

author img

By

Published : May 16, 2019, 6:47 PM IST

Updated : May 16, 2019, 9:43 PM IST

'నన్నే జైలుకు పంపుతానని దీదీ బెదిరింపు'

ఎన్నికల చివరి అంకంలో భాజపా, తృణమూల్​ కాంగ్రెస్​ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. బంగాల్​ మధురాపుర్​లో జరిగిన ఎన్నికల ర్యాలీలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓటమి భయంతో దీదీ బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు.

'నన్నే జైలుకు పంపుతానని దీదీ బెదిరింపు'

"దీదీ.. బంగాల్​ను తన జాగీరుగా భావిస్తున్నారు. టీఎంసీ గూండాలు బీభత్సం సృష్టించారు. రాత్రివేళ గొప్ప సామాజికవేత్త ఈశ్వర్‌ చంద్‌ విద్యాసాగర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆ కళాశాలలో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఏ విధంగానైతే శారద, నారద కుంభకోణాల్లో సాక్ష్యాలు మాయం చేశారో.... ఇప్పుడూ అదే ప్రయత్నం చేస్తున్నారు. ఓటమి భయంతో దీదీ వణికిపోతున్నారు. బెదిరింపులకు దిగుతున్నారు. ఈ రోజు ఉదయం... నన్ను జైలుకు పంపిస్తానని బెదిరించారు. నిన్న మీడియాలో చూశా భాజపా కార్యాలయాన్నే కబ్జా చేస్తానని దీదీ బెదిరిస్తున్నారు."
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ఇదీ చూడండి 'బంగాల్​లో 324 ఈసీ మోదీకిచ్చిన బహుమతి'

ఎన్నికల చివరి అంకంలో భాజపా, తృణమూల్​ కాంగ్రెస్​ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. బంగాల్​ మధురాపుర్​లో జరిగిన ఎన్నికల ర్యాలీలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓటమి భయంతో దీదీ బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు.

'నన్నే జైలుకు పంపుతానని దీదీ బెదిరింపు'

"దీదీ.. బంగాల్​ను తన జాగీరుగా భావిస్తున్నారు. టీఎంసీ గూండాలు బీభత్సం సృష్టించారు. రాత్రివేళ గొప్ప సామాజికవేత్త ఈశ్వర్‌ చంద్‌ విద్యాసాగర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆ కళాశాలలో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఏ విధంగానైతే శారద, నారద కుంభకోణాల్లో సాక్ష్యాలు మాయం చేశారో.... ఇప్పుడూ అదే ప్రయత్నం చేస్తున్నారు. ఓటమి భయంతో దీదీ వణికిపోతున్నారు. బెదిరింపులకు దిగుతున్నారు. ఈ రోజు ఉదయం... నన్ను జైలుకు పంపిస్తానని బెదిరించారు. నిన్న మీడియాలో చూశా భాజపా కార్యాలయాన్నే కబ్జా చేస్తానని దీదీ బెదిరిస్తున్నారు."
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ఇదీ చూడండి 'బంగాల్​లో 324 ఈసీ మోదీకిచ్చిన బహుమతి'

Mathurapur (WB), May 16 (ANI): While speaking to mediapersons, West Bengal CM came down heavily on Election Commission and said, "Only PM Modi will conduct and address the rallies and not us? What do they think that whatever the election commission says we will do that only, isn't there anything called democracy and democratic rights? Only Prime Minister Security is required and no other person's security is required?"

Last Updated : May 16, 2019, 9:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.