ETV Bharat / bharat

నేడు 'ఆత్మ నిర్భర్ యూపీ రోజ్​గార్ యోజన' ప్రారంభం

ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రూపొందించిన 'ఆత్మ నిర్భర్​ ఉత్తర్​ప్రదేశ్ రోజ్​గార్​ యోజన'ను ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించనున్నారు. స్థానికంగా ఎంట్రప్రెన్యూర్​షిప్​ను ప్రోత్సహించడం... వలసకూలీలకు ఉపాధి కల్పించడమే ఈ పథకం లక్ష్యం.

author img

By

Published : Jun 26, 2020, 4:45 AM IST

PM to launch 'Atma Nirbhar UP Rozgar Abhiyan' on Friday
నేడు 'ఆత్మ నిర్భర్ యూపీ రోజ్​గార్ యోజన' ప్రారంభం

ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం 'ఆత్మ నిర్భర్ ఉత్తర్​ప్రదేశ్​ రోజ్​గార్ అభియాన్'​ ప్రారంభించనున్నారు. స్థానిక వ్యవస్థాపకత (ఎంట్రప్రెన్యూర్​షిప్​)ను ప్రోత్సహించడం, పారిశ్రామిక సంఘాల భాగస్వామ్యంతో ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ పథకం లక్ష్యం.

కరోనా సంక్షోభం కారణంగా వలసకార్మికులు, శ్రామికులు ఉపాధి కోల్పోయి.. చాలా అవస్థలు పడుతున్నారు. అందువల్ల వారికి ప్రాథమిక సౌకర్యాలు, జీవనోపాధి కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం... 'యూపీ ఉపాధి స్వావలంబన ప్రచారం' ప్రారంభించింది. స్థానిక ఎంట్రప్రెన్యూర్స్​ని ప్రోత్సహించడం; పరిశ్రమలు, ఇతర సంస్థలతో భాగస్వామ్యాన్ని ఏర్పరచి, ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తోంది.

ఉపాధి కల్పన

కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి.. సుమారు 30 లక్షల మంది వలస కార్మికులు ఉత్తర్​ప్రదేశ్​లోని తమ ఇళ్లకు తిరిగివచ్చారు. అలాగే రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 25 వేలకు పైగా ప్రజలు తమ స్వస్థలాలకు చేరుకున్నారు.

మోదీ మాట

శుక్రవారం ఉదయం నిర్వహించనున్న వర్చువల్ లాంఛ్​లో... ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్​లోని ఆరు జిల్లాల గ్రామస్థులతో మాట్లాడనున్నారు. కామన్ సర్వీస్ సెంటర్లు, కృష్ణ విజ్ఞాన కేంద్రాల ద్వారా.... రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.

ఇదీ చూడండి: ఆగస్టు 12 వరకు రైళ్లు బంద్

ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం 'ఆత్మ నిర్భర్ ఉత్తర్​ప్రదేశ్​ రోజ్​గార్ అభియాన్'​ ప్రారంభించనున్నారు. స్థానిక వ్యవస్థాపకత (ఎంట్రప్రెన్యూర్​షిప్​)ను ప్రోత్సహించడం, పారిశ్రామిక సంఘాల భాగస్వామ్యంతో ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ పథకం లక్ష్యం.

కరోనా సంక్షోభం కారణంగా వలసకార్మికులు, శ్రామికులు ఉపాధి కోల్పోయి.. చాలా అవస్థలు పడుతున్నారు. అందువల్ల వారికి ప్రాథమిక సౌకర్యాలు, జీవనోపాధి కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం... 'యూపీ ఉపాధి స్వావలంబన ప్రచారం' ప్రారంభించింది. స్థానిక ఎంట్రప్రెన్యూర్స్​ని ప్రోత్సహించడం; పరిశ్రమలు, ఇతర సంస్థలతో భాగస్వామ్యాన్ని ఏర్పరచి, ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తోంది.

ఉపాధి కల్పన

కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి.. సుమారు 30 లక్షల మంది వలస కార్మికులు ఉత్తర్​ప్రదేశ్​లోని తమ ఇళ్లకు తిరిగివచ్చారు. అలాగే రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 25 వేలకు పైగా ప్రజలు తమ స్వస్థలాలకు చేరుకున్నారు.

మోదీ మాట

శుక్రవారం ఉదయం నిర్వహించనున్న వర్చువల్ లాంఛ్​లో... ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్​లోని ఆరు జిల్లాల గ్రామస్థులతో మాట్లాడనున్నారు. కామన్ సర్వీస్ సెంటర్లు, కృష్ణ విజ్ఞాన కేంద్రాల ద్వారా.... రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.

ఇదీ చూడండి: ఆగస్టు 12 వరకు రైళ్లు బంద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.