ETV Bharat / bharat

'130 కోట్ల మందికి సేవ చేయటమే ప్రభుత్వ లక్ష్యం'

author img

By

Published : Feb 29, 2020, 1:10 PM IST

Updated : Mar 2, 2020, 11:03 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ పర్యటనలో భాగంగా ప్రయాగ్​రాజ్​లో చేపట్టిన సామాజిక సాధికారిత శిబిరంలో దివ్యాంగులు, వృద్ధులకు సహాయ ఉపకరణాలు అందించారు ప్రధాని మోదీ. ప్రజలకు ప్రభుత్వ పథకాలు, న్యాయం అందించటమే ప్రభుత్వ బాధ్యత అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

PM Narendra Modi
యూపీ ప్రయాగ్​రాజ్ పర్యటనలో ప్రధాని మోదీ
'130 కోట్ల మందికి సేవ చేయటమే ప్రభుత్వ లక్ష్యం'

దేశంలోని 130 కోట్ల మందికి సేవ చేయటమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రజలకు ప్రభుత్వ పథకాలు, న్యాయం అందించటమే ప్రభుత్వ బాధ్యత అన్నారు.

ఉత్తర్​ప్రదేశ్​​ పర్యటనలో భాగంగా ప్రయాగ్​రాజ్​లో నిర్వహించిన సామాజిక సాధికారిత శిబిరంలో వృద్ధులు, దివ్యాంగులకు కావాల్సిన ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్రీయ వయోశ్రీ యోజన, ఏడీఐపీ పథకాల కింద 19 కోట్ల ఖర్చుతో సుమారు 27 వేల మంది లబ్ధిదారులకు ఉచితంగా సుమారు 56 వేల పరికరాలను అందజేశారు.

ఈ సందర్భంగా గత ప్రభుత్వాలపై విమర్శలు చేశారు ప్రధాని. దివ్యాంగుల కోసం వారు ఏమి చేయలేకపోయారన్నారు.

" 27 వేల మందికి ఉపకరణాలు అందించాం. అందులో మూడు చక్రాల సైకిళ్లు, వినికిడి యంత్రాలు​, వీల్​ చైర్లు లభించాయి. ఈ సామాజిక సాధికారిత శిబిరంలో చాలా రికార్డులు నమోదయ్యాయి. ఈ ఉపకరణాలు మీ జీవితంలోని సమస్యలు తగ్గిపోయేందుకు ఉపయోగపడతాయి. గత ప్రభుత్వాల సమయంలో ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చేయటం చాలా అరుదు. ఇలాంటి మెగా క్యాంపులు చేపట్టిన దాఖలాలు లేవు. గడిచిన ఐదేళ్లలో మా ప్రభుత్వం దేశంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 9 వేలకుపైగా క్యాంపులు చేపట్టింది. "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ఈ కార్యక్రమానంతరం ప్రయాగ్​రాజ్​, చిత్రకూట్​లలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు ప్రధాని. చిత్రకూట్​లో బుందేల్​ఖండ్​ ఎక్స్​ప్రెస్​వేకు శంకుస్థాపన చేయనున్నారు.

ఇదీ చూడండి: విద్వేషపూరిత సందేశాలను అరికట్టేందుకు వాట్సప్ నంబర్​!

'130 కోట్ల మందికి సేవ చేయటమే ప్రభుత్వ లక్ష్యం'

దేశంలోని 130 కోట్ల మందికి సేవ చేయటమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రజలకు ప్రభుత్వ పథకాలు, న్యాయం అందించటమే ప్రభుత్వ బాధ్యత అన్నారు.

ఉత్తర్​ప్రదేశ్​​ పర్యటనలో భాగంగా ప్రయాగ్​రాజ్​లో నిర్వహించిన సామాజిక సాధికారిత శిబిరంలో వృద్ధులు, దివ్యాంగులకు కావాల్సిన ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్రీయ వయోశ్రీ యోజన, ఏడీఐపీ పథకాల కింద 19 కోట్ల ఖర్చుతో సుమారు 27 వేల మంది లబ్ధిదారులకు ఉచితంగా సుమారు 56 వేల పరికరాలను అందజేశారు.

ఈ సందర్భంగా గత ప్రభుత్వాలపై విమర్శలు చేశారు ప్రధాని. దివ్యాంగుల కోసం వారు ఏమి చేయలేకపోయారన్నారు.

" 27 వేల మందికి ఉపకరణాలు అందించాం. అందులో మూడు చక్రాల సైకిళ్లు, వినికిడి యంత్రాలు​, వీల్​ చైర్లు లభించాయి. ఈ సామాజిక సాధికారిత శిబిరంలో చాలా రికార్డులు నమోదయ్యాయి. ఈ ఉపకరణాలు మీ జీవితంలోని సమస్యలు తగ్గిపోయేందుకు ఉపయోగపడతాయి. గత ప్రభుత్వాల సమయంలో ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చేయటం చాలా అరుదు. ఇలాంటి మెగా క్యాంపులు చేపట్టిన దాఖలాలు లేవు. గడిచిన ఐదేళ్లలో మా ప్రభుత్వం దేశంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 9 వేలకుపైగా క్యాంపులు చేపట్టింది. "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ఈ కార్యక్రమానంతరం ప్రయాగ్​రాజ్​, చిత్రకూట్​లలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు ప్రధాని. చిత్రకూట్​లో బుందేల్​ఖండ్​ ఎక్స్​ప్రెస్​వేకు శంకుస్థాపన చేయనున్నారు.

ఇదీ చూడండి: విద్వేషపూరిత సందేశాలను అరికట్టేందుకు వాట్సప్ నంబర్​!

Last Updated : Mar 2, 2020, 11:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.