ETV Bharat / bharat

పునాది రాయితో పులకించిన అయోధ్య

author img

By

Published : Aug 5, 2020, 12:52 PM IST

Updated : Aug 5, 2020, 1:25 PM IST

కోట్లాది మంది హిందువులు శతాబ్దాలుగా ఎదురుచూసిన చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. వేదమంత్రాలు, అతిరథుల సమక్షంలో రామాలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు ప్రధాని మోదీ. కోట్లాదిమంది భారతీయులు ఈ మహోత్వాన్ని ప్రత్యక్ష ప్రసారంలో చూసి పులకరించిపోయారు.

Pm Modi lays foundation stone for Ayodhya Ram mandir
చారిత్రక ఘట్టం: అయోధ్య రామమందిరానికి మోదీ శంకుస్థాపన
పునాది రాయితో పులకించిన అయోధ్య

కోట్లాదిమంది హిందువుల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ.. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వేదమంత్రాల నడుమ.. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాలకు భూమిపూజను నిర్వహించారు ప్రధాని.

pm-modi-lays-foundation-stone-for-ayodhya-ram-mandir
ప్రధాని మోదీ

175 మంది అతిథుల సమక్షంలో.. గర్భగుడిలో 40 కిలోల వెండి ఇటుకను స్థాపించారు మోదీ. ఆ సమయంలో మోదీ వెంట ఆర్​ఎస్​ఎస్​ అధిపతి​ మోహన్​ భగవత్​, నృత్యగోపాల్‌ దాస్‌, యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మాత్రమే ఉన్నారు.

కరోనా కారణంగా విధించిన నిబంధనలతో అయోధ్యకు చేరుకోలేని భక్తులు.. టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. శంకుస్థాపన మహోత్సవాన్ని కళ్లారా చూసి పులకరించిపోయారు.

సాష్టాంగ నమస్కారం...

అంతకుముందు.. లఖ్​నవూ నుంచి హెలికాఫ్టర్​ ద్వారా అయోధ్యకు చేరుకున్న మోదీకి సీఎం యోగి ఆదిత్యనాథ్​ స్వాగతం పలికారు. ఆ తర్వాత ఇరువురు.. హనుమాన్​గఢీ ఆలయాన్ని సందర్శించారు. హనుమంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మోదీ.

pm-modi-lays-foundation-stone-for-ayodhya-ram-mandir
హనుమాన్​గఢీలో మోదీ

అనంతరం రామ జన్మభూమి ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని.. రామ్​లల్లా విగ్రహం ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. అత్యద్భుతంగా అలంకరించిన రాముని ప్రతిమకు పూజలు నిర్వహించారు. అదే ప్రాంగణంలో పారిజాత మొక్కను కూడా నాటారు.

pm-modi-lays-foundation-stone-for-ayodhya-ram-mandir
రామ్​లల్లా విగ్రహానికి పూజలు
pm-modi-lays-foundation-stone-for-ayodhya-ram-mandir
రామ్​లల్లా విగ్రహానికి మోదీ సాష్టాంగ నమస్కారం
pm-modi-lays-foundation-stone-for-ayodhya-ram-mandir
పారిజాతం మొక్క నాటుతూ..

ఇవీ చూడండి:- శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కథేంటి?

పునాది రాయితో పులకించిన అయోధ్య

కోట్లాదిమంది హిందువుల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ.. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వేదమంత్రాల నడుమ.. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాలకు భూమిపూజను నిర్వహించారు ప్రధాని.

pm-modi-lays-foundation-stone-for-ayodhya-ram-mandir
ప్రధాని మోదీ

175 మంది అతిథుల సమక్షంలో.. గర్భగుడిలో 40 కిలోల వెండి ఇటుకను స్థాపించారు మోదీ. ఆ సమయంలో మోదీ వెంట ఆర్​ఎస్​ఎస్​ అధిపతి​ మోహన్​ భగవత్​, నృత్యగోపాల్‌ దాస్‌, యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మాత్రమే ఉన్నారు.

కరోనా కారణంగా విధించిన నిబంధనలతో అయోధ్యకు చేరుకోలేని భక్తులు.. టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. శంకుస్థాపన మహోత్సవాన్ని కళ్లారా చూసి పులకరించిపోయారు.

సాష్టాంగ నమస్కారం...

అంతకుముందు.. లఖ్​నవూ నుంచి హెలికాఫ్టర్​ ద్వారా అయోధ్యకు చేరుకున్న మోదీకి సీఎం యోగి ఆదిత్యనాథ్​ స్వాగతం పలికారు. ఆ తర్వాత ఇరువురు.. హనుమాన్​గఢీ ఆలయాన్ని సందర్శించారు. హనుమంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మోదీ.

pm-modi-lays-foundation-stone-for-ayodhya-ram-mandir
హనుమాన్​గఢీలో మోదీ

అనంతరం రామ జన్మభూమి ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని.. రామ్​లల్లా విగ్రహం ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. అత్యద్భుతంగా అలంకరించిన రాముని ప్రతిమకు పూజలు నిర్వహించారు. అదే ప్రాంగణంలో పారిజాత మొక్కను కూడా నాటారు.

pm-modi-lays-foundation-stone-for-ayodhya-ram-mandir
రామ్​లల్లా విగ్రహానికి పూజలు
pm-modi-lays-foundation-stone-for-ayodhya-ram-mandir
రామ్​లల్లా విగ్రహానికి మోదీ సాష్టాంగ నమస్కారం
pm-modi-lays-foundation-stone-for-ayodhya-ram-mandir
పారిజాతం మొక్క నాటుతూ..

ఇవీ చూడండి:- శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కథేంటి?

Last Updated : Aug 5, 2020, 1:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.