ETV Bharat / bharat

'పీఎం-కిసాన్​ పింఛన్'​ పథకం ప్రవేశపెట్టిన కేంద్రం

author img

By

Published : Jun 14, 2019, 5:17 AM IST

Updated : Jun 14, 2019, 5:38 AM IST

మోదీ 2.0 ప్రభుత్వం జరిపిన తొలి కేబినెట్​ సమావేశంలోనే ప్రధానమంత్రి కిసాన్​ పెన్షన్​ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఫలితంగా ఈ పథకంలో చేరిన రైతులకు 60 ఏళ్లు నిండిన తరువాత నెలకు రూ.3 వేలు చొప్పున పింఛన్​ లభించనుంది.

'పీఎం-కిసాన్​ పింఛన్'​ పథకం ప్రవేశపెట్టిన కేంద్రం
'పీఎం-కిసాన్​ పింఛన్'​ పథకం ప్రవేశపెట్టిన కేంద్రం

ప్రధానమంత్రి రైతు పింఛన్​ పథకం విధివిధానాలను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకంలో చేరే రైతులు నెలకు రూ.100 పింఛనుగా చెల్లించాలని సూచించింది. పింఛన్​ నిధికి అంతే మొత్తం కేంద్రం చెల్లిస్తుందని వెల్లడించింది. ఈ పథకం ద్వారా 60 ఏళ్ల వయస్సు నిండిన రైతులకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున పింఛన్​ లభించనుంది.

మోదీ 2.0 ప్రభుత్వ తొలి కేబినెట్ సమావేశంలోనే రైతుల ప్రత్యేక పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం వల్ల ఈ మూడు సంవత్సరాల్లో ఐదు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం ద్వారా కేంద్ర ఖజానాపై ఏడాదికి రూ.10,775 కోట్ల భారం పడనుంది. పీఎం కిసాన్​ పింఛన్​ నిధి నిర్వహణ, పింఛన్​ చెల్లింపు బాధ్యతలను ఎల్​ఐసీ చూసుకుంటుంది.

పీఎం కిసాన్ ఫించన్​ విధివిధానాలపై కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. రాష్ట్రాల వ్యవసాయమంత్రులతో వీడియో సమావేశం నిర్వహించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ పథకాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని కోరారు. పథకంపై రైతులకు అవగాహన కల్పించి, 18 నుంచి 40 ఏళ్లలోపు వారిని ఈ పథకంలో చేర్పించాలని తోమర్​ ఆయా రాష్ట్రాలకు సూచించారు.

ఈ పథకం ప్రీమియం వయసులవారీగా మారనుంది. పీఎం కిసాన్​ సమ్మాన్​ పథకం ద్వారా అందే సొమ్ము నుంచి రైతులు నేరుగా పింఛను వాటా చెల్లించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. పారదర్శకత కోసం ఆన్​లైన్ వివాద పరిష్కార వ్యవస్థను ఏర్పాటుచేస్తామని చెప్పారు.

ఇదీ చూడండి: 'దొంగ' తెలివి: సీసీటీవీ వైర్లు కత్తిరించి ఏటీఎం చోరీ

'పీఎం-కిసాన్​ పింఛన్'​ పథకం ప్రవేశపెట్టిన కేంద్రం

ప్రధానమంత్రి రైతు పింఛన్​ పథకం విధివిధానాలను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకంలో చేరే రైతులు నెలకు రూ.100 పింఛనుగా చెల్లించాలని సూచించింది. పింఛన్​ నిధికి అంతే మొత్తం కేంద్రం చెల్లిస్తుందని వెల్లడించింది. ఈ పథకం ద్వారా 60 ఏళ్ల వయస్సు నిండిన రైతులకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున పింఛన్​ లభించనుంది.

మోదీ 2.0 ప్రభుత్వ తొలి కేబినెట్ సమావేశంలోనే రైతుల ప్రత్యేక పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం వల్ల ఈ మూడు సంవత్సరాల్లో ఐదు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం ద్వారా కేంద్ర ఖజానాపై ఏడాదికి రూ.10,775 కోట్ల భారం పడనుంది. పీఎం కిసాన్​ పింఛన్​ నిధి నిర్వహణ, పింఛన్​ చెల్లింపు బాధ్యతలను ఎల్​ఐసీ చూసుకుంటుంది.

పీఎం కిసాన్ ఫించన్​ విధివిధానాలపై కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. రాష్ట్రాల వ్యవసాయమంత్రులతో వీడియో సమావేశం నిర్వహించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ పథకాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని కోరారు. పథకంపై రైతులకు అవగాహన కల్పించి, 18 నుంచి 40 ఏళ్లలోపు వారిని ఈ పథకంలో చేర్పించాలని తోమర్​ ఆయా రాష్ట్రాలకు సూచించారు.

ఈ పథకం ప్రీమియం వయసులవారీగా మారనుంది. పీఎం కిసాన్​ సమ్మాన్​ పథకం ద్వారా అందే సొమ్ము నుంచి రైతులు నేరుగా పింఛను వాటా చెల్లించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. పారదర్శకత కోసం ఆన్​లైన్ వివాద పరిష్కార వ్యవస్థను ఏర్పాటుచేస్తామని చెప్పారు.

ఇదీ చూడండి: 'దొంగ' తెలివి: సీసీటీవీ వైర్లు కత్తిరించి ఏటీఎం చోరీ

Satara (Maharashtra), Jun 12 (ANI): Maharashtra Chief Minister Devendra Fadnavis inaugurated the statue of Chhatrapati Shivaji Maharaj in Maharashtra's Satara on Thursday. The event was attended by large number of people. Shivaji Maharaj was a legendary king, known for his warfare strategies, administrative skills and progressive outlook. He laid the foundation of the Maratha Empire in India. He was one of the greatest sources of inspiration for the Indians over generations.
Last Updated : Jun 14, 2019, 5:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.