ETV Bharat / bharat

'కిసాన్ రైలు​తో రైతు సాధికారత'

author img

By

Published : Dec 28, 2020, 5:01 PM IST

Updated : Dec 28, 2020, 5:53 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ 100వ కిసాన్ రైలును ప్రారంభించారు. మహారాష్ట్రలోని సంగోలా నుంచి బంగాల్​లోని షాలీమార్ వరకు ఈ రైలు నడవనుంది. త్వరగా పాడయ్యే కూరగాయలు సహా వివిధ రకాల పండ్లను ఈ రైలులో రవాణా చేసుకునేందుకు వీలుంది.

PM flag off 100th Kisan Rail from Maharashtra to West Bengal
100వ కిసాన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ 100వ కిసాన్ రైలుకు సోమవారం పచ్చజెండా ఊపారు. మహారాష్ట్రలోని సంగోలా నుంచి బంగాల్​లోని షాలీమార్ వరకు వెళ్లే ఈ రైలును వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, పియూష్ గోయల్ పాల్గొన్నారు. ఓ వైపు నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోసం దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన కొనసాగుతుండగా.. మోదీ కిసాన్​ రైలును ప్రారంభించడం గమనార్హం.

రైతులు ఆదాయం పెంచి, వారిని సాధికారుల్ని చేసే దిశలో కిసాన్​ రైల్​ గొప్ప ముందడుగని మోదీ పేర్కొన్నారు.

ఈ మల్టీ కమోడిటీ రైలులో త్వరగా పాడయ్యే కూరగాయలైన.. కాలీఫ్లవర్​, క్యాప్సికమ్, క్యాబేజీ, ముల్లంగి, మిరప, ఉల్లి వంటి కూరగాయలు సహా.. ద్రాక్ష, నారింజ, అరటి, దానిమ్మ వంటి పండ్లను రవాణా చేసుకునేందుకు వీలుంది.

ఈ రైలు అగే అన్ని స్టేషన్లలో పండ్లు, కూరగాయలను ఎక్కించుకునేందుకు, దించుకునేందుకు అనుమతి ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. లోడ్​పై పరిమితులు లేవని తెలిపాయి. పండ్లు, కూరగాయల రవాణా ఛార్జీలపై ఉన్న సబ్సిడీని 50 శాతానికి పెంచినట్లు వివరించాయి.

ఆగస్టు 7న ప్రారంభించిన తొలి కిసాన్ రైలు​కు రైతుల నుంచి మంచి స్పందన వస్తోందని అధికారులు వెల్లడిచారు. ఈ నేపథ్యంలో ఆ రైలును వారంలో మూడు రోజులు నడిపిస్తున్నట్లు తెలిపారు. తొలుత ఈ రైలు​ వారానికి ఒకసారి మాత్రమే నడిచేది.

ఇదీ చూడండి:రైతులకు మద్దతుగా న్యాయవాది ఆత్మహత్య

ప్రధాని నరేంద్ర మోదీ 100వ కిసాన్ రైలుకు సోమవారం పచ్చజెండా ఊపారు. మహారాష్ట్రలోని సంగోలా నుంచి బంగాల్​లోని షాలీమార్ వరకు వెళ్లే ఈ రైలును వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, పియూష్ గోయల్ పాల్గొన్నారు. ఓ వైపు నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోసం దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన కొనసాగుతుండగా.. మోదీ కిసాన్​ రైలును ప్రారంభించడం గమనార్హం.

రైతులు ఆదాయం పెంచి, వారిని సాధికారుల్ని చేసే దిశలో కిసాన్​ రైల్​ గొప్ప ముందడుగని మోదీ పేర్కొన్నారు.

ఈ మల్టీ కమోడిటీ రైలులో త్వరగా పాడయ్యే కూరగాయలైన.. కాలీఫ్లవర్​, క్యాప్సికమ్, క్యాబేజీ, ముల్లంగి, మిరప, ఉల్లి వంటి కూరగాయలు సహా.. ద్రాక్ష, నారింజ, అరటి, దానిమ్మ వంటి పండ్లను రవాణా చేసుకునేందుకు వీలుంది.

ఈ రైలు అగే అన్ని స్టేషన్లలో పండ్లు, కూరగాయలను ఎక్కించుకునేందుకు, దించుకునేందుకు అనుమతి ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. లోడ్​పై పరిమితులు లేవని తెలిపాయి. పండ్లు, కూరగాయల రవాణా ఛార్జీలపై ఉన్న సబ్సిడీని 50 శాతానికి పెంచినట్లు వివరించాయి.

ఆగస్టు 7న ప్రారంభించిన తొలి కిసాన్ రైలు​కు రైతుల నుంచి మంచి స్పందన వస్తోందని అధికారులు వెల్లడిచారు. ఈ నేపథ్యంలో ఆ రైలును వారంలో మూడు రోజులు నడిపిస్తున్నట్లు తెలిపారు. తొలుత ఈ రైలు​ వారానికి ఒకసారి మాత్రమే నడిచేది.

ఇదీ చూడండి:రైతులకు మద్దతుగా న్యాయవాది ఆత్మహత్య

Last Updated : Dec 28, 2020, 5:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.