ETV Bharat / bharat

కరోనా పేరిట సైబర్ దాడులు.. యూజర్లూ జర జాగ్రత్త​!

author img

By

Published : Jun 21, 2020, 2:05 PM IST

కరోనా వంటి సంక్షోభ పరిస్థితుల్లో దేశంలో సాంకేతిక ఇబ్బందులు సృష్టించేందుకు పన్నాగాలు పన్నుతున్నారు ప్రత్యర్థి దేశాల సైబర్​ కేటుగాళ్లు. ఈ తరహా దాడుల కోసం ఉత్తరకొరియా హ్యాకర్లు ప్రణాళికలు రచించినట్లు సమాచారం వచ్చిందని తెలిపారు సైబర్​ నిపుణులు. ప్రజలు ఎక్కువగా సెర్చ్​ చేస్తున్న కరోనా, కొవిడ్​-19 సమచారానికి సంబంధించిన మెయిల్స్​తోనే ఈ దాడులు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

cyber crimes in india
జర భద్రం..కరోనా పేరిట సైబర్ మోసాలు!

కరోనా వైరస్ హెచ్చరికలు, ఆర్థిక సేవల పేరిట సైబర్‌ నేరగాళ్లు భారీ మోసాలకు పాల్పడే అవకాశం ఉందని 'ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్'‌(సీఈఆర్‌టీ-ఇన్‌) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కరోనాకు సంబంధించిన ప్రభుత్వ సహాయ కార్యక్రమాల పేరుతో హానికరమైన ఈ-మెయిల్స్‌తో ప్రజల్ని మభ్యపెట్టే అవకాశం ఉందని వెల్లడించింది.

ఈ సైబర్‌ దాడి ఆదివారం నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. సైబర్‌ నేరగాళ్ల దగ్గర దాదాపు రెండు మిలియన్ల భారత పౌరుల ఈ-మెయిల్‌ ఐడీలు ఉన్నట్లు గుర్తించామంది. అనుమానాస్పదమైన సందేశాలకు స్పందించొద్దని.. అందులో పంపే లింకులపై ఎట్టిపరిస్థితుల్లో క్లిక్‌ చేయొద్దని హెచ్చరించింది.

మోసగాళ్లు కొవిడ్‌-19 పరీక్షల పేరిట దిల్లీ, ముంబయి, హైదరాబాద్‌, చెన్నై, అహ్మదాబాద్‌ సహా పలు ఇతర ప్రముఖ నగరాల్లోని ప్రజల వ్యక్తిగత వివరాలు సేకరించి మోసాలకు పాల్పడే అవకాశం ఉందని సీఈఆర్‌టీ-ఇన్‌ తెలిపింది.

ప్రభుత్వ అధికారులు, ఇతర అధికారిక సంస్థల ఈ-మెయిల్‌ ఐడీలను పోలిన లేదా నకిలీ ఐడీలతో నేరాలకు పాల్పడొచ్చని హెచ్చరించింది. 'ncov2019@gov.in' వంటి ఈ-మెయిళ్ల ద్వారా ప్రజల్ని మోసం చేయోచ్చని తెలిపింది. ఎలాంటి అనుమానం ఉన్నా లేదా సైబర్‌ మోసానికి గురైనా వెంటనే incident@cert-in.org.inకు సమాచారం అందజేయాలని కోరింది.

ఇవీ చూడండి:

కరోనా వైరస్ హెచ్చరికలు, ఆర్థిక సేవల పేరిట సైబర్‌ నేరగాళ్లు భారీ మోసాలకు పాల్పడే అవకాశం ఉందని 'ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్'‌(సీఈఆర్‌టీ-ఇన్‌) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కరోనాకు సంబంధించిన ప్రభుత్వ సహాయ కార్యక్రమాల పేరుతో హానికరమైన ఈ-మెయిల్స్‌తో ప్రజల్ని మభ్యపెట్టే అవకాశం ఉందని వెల్లడించింది.

ఈ సైబర్‌ దాడి ఆదివారం నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. సైబర్‌ నేరగాళ్ల దగ్గర దాదాపు రెండు మిలియన్ల భారత పౌరుల ఈ-మెయిల్‌ ఐడీలు ఉన్నట్లు గుర్తించామంది. అనుమానాస్పదమైన సందేశాలకు స్పందించొద్దని.. అందులో పంపే లింకులపై ఎట్టిపరిస్థితుల్లో క్లిక్‌ చేయొద్దని హెచ్చరించింది.

మోసగాళ్లు కొవిడ్‌-19 పరీక్షల పేరిట దిల్లీ, ముంబయి, హైదరాబాద్‌, చెన్నై, అహ్మదాబాద్‌ సహా పలు ఇతర ప్రముఖ నగరాల్లోని ప్రజల వ్యక్తిగత వివరాలు సేకరించి మోసాలకు పాల్పడే అవకాశం ఉందని సీఈఆర్‌టీ-ఇన్‌ తెలిపింది.

ప్రభుత్వ అధికారులు, ఇతర అధికారిక సంస్థల ఈ-మెయిల్‌ ఐడీలను పోలిన లేదా నకిలీ ఐడీలతో నేరాలకు పాల్పడొచ్చని హెచ్చరించింది. 'ncov2019@gov.in' వంటి ఈ-మెయిళ్ల ద్వారా ప్రజల్ని మోసం చేయోచ్చని తెలిపింది. ఎలాంటి అనుమానం ఉన్నా లేదా సైబర్‌ మోసానికి గురైనా వెంటనే incident@cert-in.org.inకు సమాచారం అందజేయాలని కోరింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.