ETV Bharat / bharat

గంజాయి సాగుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం! - మధ్య ప్రదేశ్ గంజాయి

మధ్యప్రదేశ్​లో గంజాయి జాతికి చెందిన జనపనారను పండించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి వెల్లడించారు. క్యాన్సర్ మందుల తయారీలో ఉపయోగించే ఈ మొక్కల సాగు చేపట్టనున్నట్లు తెలిపారు. కేవలం వైద్య అవసరాల కోసమే పండిస్తున్నట్లు స్పష్టం చేశారు.

గంజాయిని పండించేందుకు సిద్ధమైన ప్రభుత్వం!
author img

By

Published : Nov 21, 2019, 1:09 PM IST

మధ్యప్రదేశ్​లో గంజాయి జాతికి చెందిన జనపనార (హెంప్​)ను పండించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు మధ్యప్రదేశ్​ మంత్రి పీసీ శర్మ వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గంజాయి సాగు ప్రారంభించినట్లు తెలిపారు.

సతీవా జాతికి చెందిన ఈ గంజాయి రకం మొక్కను.. వైద్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. క్యాన్సర్​ వ్యాధి నివారణకు ఉపయోగించే మందుల తయారీలో వీటిని వినియోగిస్తారు. అంతేకాక బట్టలు, బయో ప్లాస్టిక్​ వంటి ఉత్పత్తులలో ఈ రకం మొక్కలను వాడతారు.

ఈ రకం మొక్కలను ఇప్పటికే ఉత్తర్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​ రాష్ట్రాలలో పండిస్తున్నారని మంత్రి వివరించారు. ఈ గంజాయి మత్తు కోసం కాదని స్పష్టం చేసిన ఆయన...కేవలం క్యాన్సర్ మందులలో ఉపయోగించడానికేనని తెలిపారు.

'ఇది గంజాయి కాదు. దీనిని హెంప్​ అని అంటారు. ఇది గంజాయి జాతికి చెందినది. భాజపా అధికారంలో ఉన్న ఉత్తర్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​లలో ఈ పంటను పండిస్తున్నారు. దీనిని క్యాన్సర్ మందులలో ఉపయోగిస్తారు. బట్టల తయారీలోనూ వాడతారు. దీని వల్ల మధ్యప్రదేశ్​లో కొత్త ఉద్యోగాలు వస్తాయి. ప్రపంచంలో చాలా చోట్ల ఉత్పత్తి జరుగుతోంది. దీనికోసం అంతర్జాతీయ నిపుణులతో చర్చలు జరుపుతున్నాం. ఇది తినడానికో, తాగడానికో మాత్రం కాదు.'-పీసీ శర్మ, మధ్యప్రదేశ్​ న్యాయ శాఖ మంత్రి

మధ్యప్రదేశ్​లో గంజాయి జాతికి చెందిన జనపనార (హెంప్​)ను పండించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు మధ్యప్రదేశ్​ మంత్రి పీసీ శర్మ వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గంజాయి సాగు ప్రారంభించినట్లు తెలిపారు.

సతీవా జాతికి చెందిన ఈ గంజాయి రకం మొక్కను.. వైద్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. క్యాన్సర్​ వ్యాధి నివారణకు ఉపయోగించే మందుల తయారీలో వీటిని వినియోగిస్తారు. అంతేకాక బట్టలు, బయో ప్లాస్టిక్​ వంటి ఉత్పత్తులలో ఈ రకం మొక్కలను వాడతారు.

ఈ రకం మొక్కలను ఇప్పటికే ఉత్తర్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​ రాష్ట్రాలలో పండిస్తున్నారని మంత్రి వివరించారు. ఈ గంజాయి మత్తు కోసం కాదని స్పష్టం చేసిన ఆయన...కేవలం క్యాన్సర్ మందులలో ఉపయోగించడానికేనని తెలిపారు.

'ఇది గంజాయి కాదు. దీనిని హెంప్​ అని అంటారు. ఇది గంజాయి జాతికి చెందినది. భాజపా అధికారంలో ఉన్న ఉత్తర్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​లలో ఈ పంటను పండిస్తున్నారు. దీనిని క్యాన్సర్ మందులలో ఉపయోగిస్తారు. బట్టల తయారీలోనూ వాడతారు. దీని వల్ల మధ్యప్రదేశ్​లో కొత్త ఉద్యోగాలు వస్తాయి. ప్రపంచంలో చాలా చోట్ల ఉత్పత్తి జరుగుతోంది. దీనికోసం అంతర్జాతీయ నిపుణులతో చర్చలు జరుపుతున్నాం. ఇది తినడానికో, తాగడానికో మాత్రం కాదు.'-పీసీ శర్మ, మధ్యప్రదేశ్​ న్యాయ శాఖ మంత్రి

New Delhi, Nov 21 (ANI): Shiv Sena is all set to form a government in Maharashtra within this month only. Shiv Sena leader Sanjay Raut Said on November 21 said that they will form government in Maharashtra before December 01. "The process to form government has started. It will be completed before December 01. All three parties will hold meeting in Mumbai," said Sanjay Raut. On being ask about on secularism issue and Sanjay Singh said "Balasaheb Thackeray also wanted that people should take oath of constitution rather than over any religious book in courts".

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.