ETV Bharat / bharat

నిర్భయ దోషుల్ని ఉరి తీసే పవన్​కు ప్రత్యేక వసతులెన్నో... - పవన్​ జల్లాద్​ తిహార్ జైలులోని ఒక ఫ్లాట్‌లో

నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1ను ఉరిశిక్షను అమలుచేయాలని దిల్లీ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు తిహార్ జైలు అధికారులు. నలుగురు దోషులను ఉరి తీయడానికి తలారి పవన్​ జల్లాద్​ను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఉరి తీసే పవన్​ కోసం అన్ని వసతులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

pawan-is-one-of-the-special-facilities-for-hanging-nirbhaya-dot-dot-dot
నిర్భయ దోషుల్ని ఉరి తీసే పవన్​కు ప్రత్యేక వసతులెన్నో...
author img

By

Published : Jan 22, 2020, 1:00 PM IST

Updated : Feb 17, 2020, 11:32 PM IST

నిర్భయ కేసు దోషులకు శిక్ష అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దిల్లీ తిహార్​ జైలు అధికారులు. నలుగురు దోషులను ఉరి తీయడానికి తలారి పవన్ జల్లాద్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ దోషులకు ఫిబ్రవరి 1న శిక్షను అమలుచేయాలని కోర్టు ఆదేశించింది. శిక్ష అమలుకు రెండు రోజుల ముందుగానే... ఈనెల 30న తలారి పవన్ యూపీ మేరఠ్​ నుంచి తిహార్ జైలుకు చేరుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

పవన్​ జల్లాద్​ తిహార్ జైలులోని ఒక ఫ్లాట్‌లో ఉంటారని జైలు వర్గాలు వెల్లడించాయి. జైలు ప్రధాన కార్యాలయానికి కొన్ని అడుగుల దూరంలో ఉన్న సెమీ ఓపెన్ జైలులోని ఒక ఫ్లాట్ ను ప్రత్యేకంగా సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ ప్లాట్​లో ప్రస్తుతం ఉన్న ముగ్గురు ఖైదీలను మరొక గదికి తరలించినట్లు తెలిసింది.

ఉరితీసే పవన్ కోసమే ఈ ఫ్లాట్​ను ఖాళీ చేసినట్లు తిహార్ వర్గాలు పేర్కొన్నాయి. పవన్​ కోసం అన్ని వసతులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అతను తినే ఆహారం కూడా క్యాంటీన్‌లో ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: సెంట్రల్​ విస్టా: అన్నీ ఒక్క చోట.. దేశ రాజధాని ఘనత

నిర్భయ కేసు దోషులకు శిక్ష అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దిల్లీ తిహార్​ జైలు అధికారులు. నలుగురు దోషులను ఉరి తీయడానికి తలారి పవన్ జల్లాద్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ దోషులకు ఫిబ్రవరి 1న శిక్షను అమలుచేయాలని కోర్టు ఆదేశించింది. శిక్ష అమలుకు రెండు రోజుల ముందుగానే... ఈనెల 30న తలారి పవన్ యూపీ మేరఠ్​ నుంచి తిహార్ జైలుకు చేరుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

పవన్​ జల్లాద్​ తిహార్ జైలులోని ఒక ఫ్లాట్‌లో ఉంటారని జైలు వర్గాలు వెల్లడించాయి. జైలు ప్రధాన కార్యాలయానికి కొన్ని అడుగుల దూరంలో ఉన్న సెమీ ఓపెన్ జైలులోని ఒక ఫ్లాట్ ను ప్రత్యేకంగా సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ ప్లాట్​లో ప్రస్తుతం ఉన్న ముగ్గురు ఖైదీలను మరొక గదికి తరలించినట్లు తెలిసింది.

ఉరితీసే పవన్ కోసమే ఈ ఫ్లాట్​ను ఖాళీ చేసినట్లు తిహార్ వర్గాలు పేర్కొన్నాయి. పవన్​ కోసం అన్ని వసతులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అతను తినే ఆహారం కూడా క్యాంటీన్‌లో ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: సెంట్రల్​ విస్టా: అన్నీ ఒక్క చోట.. దేశ రాజధాని ఘనత

Last Updated : Feb 17, 2020, 11:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.