లాక్డౌన్ మొదటి రెండు దశల్లో దేశవ్యాప్తంగా లాక్డౌన్ పూర్తిస్థాయిలో అమలైంది. ఈ నేపథ్యంలో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. అడవి సమీప ప్రాంతాల్లో జనసంచారం తగ్గిన నేపథ్యంలో జంతువులు యథేచ్చగా తిరుగులాడటం ప్రారంభించాయి. రాజస్థాన్లో ఓ చిరుత ఏకంగా ఓ హోటల్ను ఆశ్రయం చేసుకుని ప్రసవించింది.
పాలీ జిల్లాలోని అభయారణ్యం నుంచి బయటకు వచ్చిన చిరుత సమీపంలోని ప్రసిద్ధ జైన క్షేత్రమైన రణక్పుర్కు చేరుకుంది. అక్కడే ఉన్న ఓ హోటల్ను ఆశ్రయంగా చేసుకుని మూడు చిరుతలకు జన్మనిచ్చింది. హోటల్ను ఆవాసంగా చేసుకుని కాలం గడుపుతోంది.
చిరుత జాడపై అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు స్థానికులు. చిరుతలను పట్టుకున్న అధికారులు సంరక్షణ కేంద్రానికి తరలించారు.
ఇదీ చదవండి: థర్మల్ స్క్రీనింగ్ టు హెయిర్ కటింగ్.. పోలీసులకు మాత్రమే!