ETV Bharat / bharat

ఎనీ టైం మనసు నింపే.. 'పానీపూరీ-ఏటీఎం' - panipuri machines in india

'భయ్యా ప్యాజ్ డాలో.. ఇంకొంచెం పానీ పొయ్యన్నా.. వేడిగా ఉండాలన్నో..' అంటూ రోడ్డు పక్కన నిలబడి.. పానీపూరీని ఆస్వాదిస్తుంటే ఆ మజానే వేరు. కానీ పానీపూరీవాలా స్వహస్తాలతో వడ్డించే ఫాస్ట్​ఫుడ్​ను కరోనా కాలంలో అంత ధైర్యంగా తినలేకపోతున్నాం. అయితే ఈ పరిస్థితుల్లోనూ పానీపూరీ ప్రియుల మనసు నింపేందుకు ఏకంగా 'పానీపూరీ ఏటీఎం'ను సృష్టించారు మహారాష్ట్రకు చెందిన ఇద్దరు ఇంజినీర్లు.

'Pani-Puri ATM' invented by Aurangabad youth
ఎనీ టైం మనసు నింపే.. 'పానీపూరీ-ఏటీఎం'!
author img

By

Published : Oct 1, 2020, 9:21 PM IST

కరోనా ఎందరో జీవితాల్లో చీకట్లను నింపింది. పానీపూరీ ప్రియుల గుండెల్లోనూ బాధను నింపింది. మనసారా పానీపూరీ తినలేక, ఇంట్లో పూరీల్లో ఆ రుచి దొరక్క తెగ ఇక్కట్లు పడుతున్నారు. అందుకే, మనుషులు తాకని పానీపూరీ-ఏటీఎం యంత్రాన్ని ఏర్పాటు చేశారు మహారాష్ట్ర ఇంజినీర్లు.

ఔరంగాబాద్​కు చెందిన సమీర్ పిటాలే ఓ ఇంజినీరే కాదు పానీపూరీ ప్రియుడు కూడా. అయితే, ఆ ఇష్టంతోనే కొన్ని నెలల క్రితం ఓ వీధిబండి వద్ద పానీపూరీ తిన్నాడు. దాని వల్ల తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆ ఘటన తర్వాత చేతులతో తాకని పానీపూరీ యంత్రం​ తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే స్నేహితుడు ప్రతీక్ పిటాలేతో కలిసి సరికొత్త పానీపూరీ ఏటీఏంను తయారు చేశాడు. ఇందుకు దాదాపు రూ. 60 వేలు ఖర్చు అయినట్లు తెలిపాడు.

సమీర్, ప్రతీక్ కలిసి తయారు చేసిన ఈ మెషీన్​లో బటన్ నొక్కగానే.. పానీపూరీ సిద్ధమై ప్లేటులో పడుతుంది. ఈ యంత్రంలో 5 రకాల పానీపూరీ ఫ్లేవర్లు లభిస్తాయి. దహీపూరీ, పానీపూరీ ఇలా ఏది కావాలన్నా బటన్ నొక్కితే చాలు అంటున్నారు ఆ ఇంజినీర్లు.

ఇదీ చదవండి: రూ.1 జరిమానా చెల్లించిన భూషణ్

కరోనా ఎందరో జీవితాల్లో చీకట్లను నింపింది. పానీపూరీ ప్రియుల గుండెల్లోనూ బాధను నింపింది. మనసారా పానీపూరీ తినలేక, ఇంట్లో పూరీల్లో ఆ రుచి దొరక్క తెగ ఇక్కట్లు పడుతున్నారు. అందుకే, మనుషులు తాకని పానీపూరీ-ఏటీఎం యంత్రాన్ని ఏర్పాటు చేశారు మహారాష్ట్ర ఇంజినీర్లు.

ఔరంగాబాద్​కు చెందిన సమీర్ పిటాలే ఓ ఇంజినీరే కాదు పానీపూరీ ప్రియుడు కూడా. అయితే, ఆ ఇష్టంతోనే కొన్ని నెలల క్రితం ఓ వీధిబండి వద్ద పానీపూరీ తిన్నాడు. దాని వల్ల తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆ ఘటన తర్వాత చేతులతో తాకని పానీపూరీ యంత్రం​ తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే స్నేహితుడు ప్రతీక్ పిటాలేతో కలిసి సరికొత్త పానీపూరీ ఏటీఏంను తయారు చేశాడు. ఇందుకు దాదాపు రూ. 60 వేలు ఖర్చు అయినట్లు తెలిపాడు.

సమీర్, ప్రతీక్ కలిసి తయారు చేసిన ఈ మెషీన్​లో బటన్ నొక్కగానే.. పానీపూరీ సిద్ధమై ప్లేటులో పడుతుంది. ఈ యంత్రంలో 5 రకాల పానీపూరీ ఫ్లేవర్లు లభిస్తాయి. దహీపూరీ, పానీపూరీ ఇలా ఏది కావాలన్నా బటన్ నొక్కితే చాలు అంటున్నారు ఆ ఇంజినీర్లు.

ఇదీ చదవండి: రూ.1 జరిమానా చెల్లించిన భూషణ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.