ETV Bharat / bharat

'భారత్​లోకి చొరబడేందుకు 300లకుపైగా ఉగ్రవాదులు రెడీ'

author img

By

Published : Jun 19, 2020, 6:50 AM IST

భారత్​లోకి చొరబడేందుకు 300 మందికిపైగా ఉగ్రవాదులు సరిహద్దుల వెంబడి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు జమ్ముకశ్మీర్​ డీజీపీ దిల్బాగ్​ సింగ్​. లద్దాఖ్​​లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో దేశంలోకి భారీగా తీవ్రవాదుల చొరబాట్లుకు పాకిస్థాన్​ పాల్పడే అవకాశం ఉందన్నారు. సరిహద్దుల్లో నిఘా పెంచాలని అధికారులకు సూచించారు.

Pak will try to infiltrate more terrorists
'భారత్​లోకి చొరబడేందుకు 300లకుపైగా ఉగ్రవాదులు రేడీ'

తూర్పు లద్దాఖ్​​లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో నెలకొన్న ప్రతిష్టంభన వేళ దేశంలోకి భారీగా పాక్​ నుంచి ఉగ్రవాదులు చొరబాట్లకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు జమ్ముకశ్మీర్​ పోలీస్​ చీఫ్​ దిల్బాగ్​ సింగ్​. కశ్మీర్​ లోయ, ఇతర ప్రాంతాల్లో వారు అల్లర్లు సృష్టించే ప్రమాదం ఉందని తెలిపారు.

జమ్ముకశ్మీర్​లోని సరిహద్దు ప్రాంతాల్లో భద్రత పరిస్థితులపై ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు డీజీపీ దిల్బాగ్​ సింగ్​.

" కరోనా మహమ్మారి విజృభిస్తున్నప్పటికీ.. సరిహద్దుల వెంబడి ఉగ్రవాదుల అక్రమ చొరబాట్లకు పాల్పడుతోంది పాకిస్థాన్​. అలాంటి ప్రయత్నాలను నిరోధించేందుకు నిఘా పెంచాం. కశ్మీర్​ లోయలో హింస సృష్టించేందుకు 300 మందికిపైగా తీవ్రవాదులు జమ్ముకశ్మీర్​లోకి చొరబడేందుకు నియంత్రణ రేఖ వెంబడి ఉన్న లాంచింగ్​ ప్యాడ్ల వద్ద కాచుకొని ఉన్నారు. లద్దాఖ్​​లో పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్​తో సరిహద్దుల వెంబడి అదనపు శ్రద్ధ అవసరం. కశ్మీర్​లో అల్లర్లు సృష్టించేందుకు జైషే మహమ్మద్​, హిజ్బుల్​ ముజాహిద్దీన్​, లష్కరే తోయిబా వంటి ఉగ్రసంస్థలు చేతులు కలిపినట్లు నిఘావర్గాల సమాచారం ఉంది."

- దల్బాగ్​ సింగ్​, జమ్ముకశ్మీర్​ డీజీపీ​

సరిహద్దులగుండా ఉగ్రవాదుల చొరబాట్లతో సవాళ్లు అధికంగా ఉన్నాయన్నారు డీజీపీ. ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని నిరోధించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. మొబైల్​ పాట్రోల్స్​, తనిఖీ కేంద్రాల వంటి భద్రత చర్యలు పెంచాలని ఆదేశించారు.

ఇదీ చూడండి: చైనా వ్యూహమేంటి? గల్వాన్​ ఘటనతో లక్ష్యం నెరవేరిందా?

తూర్పు లద్దాఖ్​​లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో నెలకొన్న ప్రతిష్టంభన వేళ దేశంలోకి భారీగా పాక్​ నుంచి ఉగ్రవాదులు చొరబాట్లకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు జమ్ముకశ్మీర్​ పోలీస్​ చీఫ్​ దిల్బాగ్​ సింగ్​. కశ్మీర్​ లోయ, ఇతర ప్రాంతాల్లో వారు అల్లర్లు సృష్టించే ప్రమాదం ఉందని తెలిపారు.

జమ్ముకశ్మీర్​లోని సరిహద్దు ప్రాంతాల్లో భద్రత పరిస్థితులపై ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు డీజీపీ దిల్బాగ్​ సింగ్​.

" కరోనా మహమ్మారి విజృభిస్తున్నప్పటికీ.. సరిహద్దుల వెంబడి ఉగ్రవాదుల అక్రమ చొరబాట్లకు పాల్పడుతోంది పాకిస్థాన్​. అలాంటి ప్రయత్నాలను నిరోధించేందుకు నిఘా పెంచాం. కశ్మీర్​ లోయలో హింస సృష్టించేందుకు 300 మందికిపైగా తీవ్రవాదులు జమ్ముకశ్మీర్​లోకి చొరబడేందుకు నియంత్రణ రేఖ వెంబడి ఉన్న లాంచింగ్​ ప్యాడ్ల వద్ద కాచుకొని ఉన్నారు. లద్దాఖ్​​లో పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్​తో సరిహద్దుల వెంబడి అదనపు శ్రద్ధ అవసరం. కశ్మీర్​లో అల్లర్లు సృష్టించేందుకు జైషే మహమ్మద్​, హిజ్బుల్​ ముజాహిద్దీన్​, లష్కరే తోయిబా వంటి ఉగ్రసంస్థలు చేతులు కలిపినట్లు నిఘావర్గాల సమాచారం ఉంది."

- దల్బాగ్​ సింగ్​, జమ్ముకశ్మీర్​ డీజీపీ​

సరిహద్దులగుండా ఉగ్రవాదుల చొరబాట్లతో సవాళ్లు అధికంగా ఉన్నాయన్నారు డీజీపీ. ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని నిరోధించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. మొబైల్​ పాట్రోల్స్​, తనిఖీ కేంద్రాల వంటి భద్రత చర్యలు పెంచాలని ఆదేశించారు.

ఇదీ చూడండి: చైనా వ్యూహమేంటి? గల్వాన్​ ఘటనతో లక్ష్యం నెరవేరిందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.