ETV Bharat / bharat

1.25 కోట్ల రైలు టికెట్లు రద్దు.. కారణమిదే?

author img

By

Published : Nov 1, 2020, 6:57 PM IST

Updated : Nov 1, 2020, 8:11 PM IST

ఈ ఏడాది సుమారు 1 కోటి 25 లక్షల మంది టికెట్లు రద్దు చేసుకున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. టిక్కెట్టు​ కొన్న తర్వాత వెయిటింగ్​ లిస్టులో ఉండటం వల్లే ప్రయాణికులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

Over one crore waitlisted passengers denied train travel in 2019-20: RTI
కోటి మంది రైలు ప్రయాణానికి నిరాకరణ.. కారణమిదే?

దేశంలో పెరుగుతున్న రైల్వే ప్రయాణికుల అవసరాలను ఆ శాఖ తీర్చేలేకపోతోందన్న చేదు నిజం మరోసారి బయట పడింది. టికెట్‌ కొన్నా చాలా మంది ప్రయాణానికి దూరమవుతున్నారన్న విషయం ఓ ఆర్‌టీఐ దరఖాస్తు ద్వారా వెల్లడైంది. ఒక్క 2019-2020 ఏడాదిలోనే ఇలా కోటి మందికి పైగా ప్రజలు రైల్వే ప్రయాణానికి దూరమయ్యారని తేలింది. వెయిటింగ్‌ లిస్ట్‌ ఉండే టికెట్లు ఆటోమేటిక్‌గా రద్దు కావడమే ఇందుకు కారణం. ఈ విధంగా 2019-2020లో మొత్తం 84,61,204 ప్యాసింజర్‌ నేమ్‌ రికార్డు (పీఎన్‌ఆర్‌) నంబర్లు కలిగిన 1.25 కోట్ల మంది ప్రయాణానికి దూరమయ్యారని తేలింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త చంద్రశేఖర్‌ గౌర్‌ దాఖలు చేసిన దరఖాస్తు ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఐదేళ్లలో 5 కోట్లు

వెయిట్​లిస్ట్​ కారణంగా ఐదేళ్లలో సుమారు 5కోట్ల పీఎన్​ఆర్​లు ఆటోమేటిక్​గా రద్దైనట్టు తెలిపింది రైల్వేశాఖ. 2014-15లో 1.13కోట్లు; 2015-16లో 81.05 లక్షలు; 2016-17లో 72.13 లక్షలు; 2017-18లో 73.02 లక్షలు; 2018-19లో 68.97 లక్షల పీఎన్​ఆర్​లు రద్దయ్యాయని పేర్కొంది.

ప్రైవేట్​ రైళ్లతో..

వెయిటింగ్​ లిస్ట్​ సమస్యను అధిగమించే ప్రయత్నాల్లో భాగంగా ప్రైవేట్​ రైళ్లకూ అనుమతులు ఇచ్చింది రైల్వే శాఖ. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే మార్గాల్లో ప్రత్యేక 'క్లోన్​ రైళ్ల'ను ప్రవేశపెట్టింది. సాధారణ రైళ్ల కంటే అధిక వేగంతో ప్రయాణించే ఈ రైళ్లకు స్టాప్​లు పరిమితంగా ఉంటాయి. అయితే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడం వల్ల తరచూ ఈ సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారు. పీఎన్​ఆర్​ రద్దయితే వినియోగదారులు చెల్లించిన సొమ్ము మళ్లీ వారి ఖాతాలో జమవుతుంది. ఈ విధంగా రైల్వేశాఖ భారీ ఆదాయాన్ని కోల్పోయింది.

ఇదీ చదవండి: డిసెంబర్​లో 'జాతీయ రైల్ ప్రణాళిక' తుది నివేదిక

దేశంలో పెరుగుతున్న రైల్వే ప్రయాణికుల అవసరాలను ఆ శాఖ తీర్చేలేకపోతోందన్న చేదు నిజం మరోసారి బయట పడింది. టికెట్‌ కొన్నా చాలా మంది ప్రయాణానికి దూరమవుతున్నారన్న విషయం ఓ ఆర్‌టీఐ దరఖాస్తు ద్వారా వెల్లడైంది. ఒక్క 2019-2020 ఏడాదిలోనే ఇలా కోటి మందికి పైగా ప్రజలు రైల్వే ప్రయాణానికి దూరమయ్యారని తేలింది. వెయిటింగ్‌ లిస్ట్‌ ఉండే టికెట్లు ఆటోమేటిక్‌గా రద్దు కావడమే ఇందుకు కారణం. ఈ విధంగా 2019-2020లో మొత్తం 84,61,204 ప్యాసింజర్‌ నేమ్‌ రికార్డు (పీఎన్‌ఆర్‌) నంబర్లు కలిగిన 1.25 కోట్ల మంది ప్రయాణానికి దూరమయ్యారని తేలింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త చంద్రశేఖర్‌ గౌర్‌ దాఖలు చేసిన దరఖాస్తు ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఐదేళ్లలో 5 కోట్లు

వెయిట్​లిస్ట్​ కారణంగా ఐదేళ్లలో సుమారు 5కోట్ల పీఎన్​ఆర్​లు ఆటోమేటిక్​గా రద్దైనట్టు తెలిపింది రైల్వేశాఖ. 2014-15లో 1.13కోట్లు; 2015-16లో 81.05 లక్షలు; 2016-17లో 72.13 లక్షలు; 2017-18లో 73.02 లక్షలు; 2018-19లో 68.97 లక్షల పీఎన్​ఆర్​లు రద్దయ్యాయని పేర్కొంది.

ప్రైవేట్​ రైళ్లతో..

వెయిటింగ్​ లిస్ట్​ సమస్యను అధిగమించే ప్రయత్నాల్లో భాగంగా ప్రైవేట్​ రైళ్లకూ అనుమతులు ఇచ్చింది రైల్వే శాఖ. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే మార్గాల్లో ప్రత్యేక 'క్లోన్​ రైళ్ల'ను ప్రవేశపెట్టింది. సాధారణ రైళ్ల కంటే అధిక వేగంతో ప్రయాణించే ఈ రైళ్లకు స్టాప్​లు పరిమితంగా ఉంటాయి. అయితే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడం వల్ల తరచూ ఈ సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారు. పీఎన్​ఆర్​ రద్దయితే వినియోగదారులు చెల్లించిన సొమ్ము మళ్లీ వారి ఖాతాలో జమవుతుంది. ఈ విధంగా రైల్వేశాఖ భారీ ఆదాయాన్ని కోల్పోయింది.

ఇదీ చదవండి: డిసెంబర్​లో 'జాతీయ రైల్ ప్రణాళిక' తుది నివేదిక

Last Updated : Nov 1, 2020, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.