ETV Bharat / bharat

పార్లమెంటు సమావేశాల కోసం విపక్షాల అస్త్రశస్త్రాలు

సరిహద్దు ఉద్రిక్తతలు, ఆర్థిక మందగమనం, నిరుద్యోగంపై పార్లమెంట్​లో చర్చలు జరిగే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని విపక్షాలు నిర్ణయించాయి. పార్లమెంట్​ వర్షాకాల సమావేశానికి ఒక రోజు ముందు వివిధ పార్టీల నేతలు సమావేశమయ్యారు. అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

author img

By

Published : Sep 13, 2020, 6:46 PM IST

Oppn demands discussion in Lok Sabha on standoff at LAC, economic slowdown
లోక్​సభలో సరిహద్దు సమరం.. విపక్షాలు ఫిక్స్​

సోమవారం నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల కోసం విపక్షాలు తమ అస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. సరిహద్దు ఉద్రిక్తతలు, ఆర్థిక వ్యవస్థ మందగమనం, నిరుద్యోగంపై లోక్​సభలో చర్చించాలని పట్టుబట్టేందుకు సన్నద్ధమవుతున్నాయి. లోక్​సభలోని వివిధ పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు డీఎంకే నేత టీఆర్​ బాలు వెల్లడించారు.

పార్లమెంట్​ సమావేశాలకు ఒక రోజు ముందు.. బీఏసీ(బిజినెస్​ అడ్వైజరీ కమిటీ) భేటీని నిర్వహించారు లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా. వాస్తవాధీన రేఖ వెంబడి భారత్​-చైనా మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనతో పాటు ఇతర అంశాలపై చర్చలు జరపాలని విపక్ష నేతలు ఓం బిర్లాను కోరినట్టు బాలు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:- పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధం

మరోవైపు సభ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరిస్తామని విపక్షాలు హామీనిచ్చినట్టు ఓం బిర్లా వెల్లడించారు. సభా సమయాన్ని పూర్తి స్థాయిలో నేతలు ఉపయోగించుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆ నాలుగింటికి వ్యతిరేకం...

ఈ సమావేశాల్లో... ప్రస్తుతం ఉన్న ఆర్డినెన్స్​ల స్థానంలో 11బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. అయితే ఈ 11లో నాలుగు బిల్లులను వ్యతిరేకించాలని కాంగ్రెస్​ సహా ఇతర విపక్ష పార్టీలు నిర్ణయించాయి. వీటిపై తమకున్న సందేహాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేస్తారని ఆశిస్తున్నట్టు తెలిపాయి.

వ్యవసాయానికి సంబంధించిన మూడు బిల్లులతో పాటు బ్యాంకింగ్​ రెగ్యులేషన్​ యాక్ట్​ సవరణను వ్యతిరేకించాలని నిర్ణయించుకున్నట్టు కాంగ్రెస్​ సీనియర్​ నేత జైరామ్​ రమేశ్​ వెల్లడించారు.

ఇదీ చూడండి:- పార్లమెంట్​ సమావేశాలకు ఆ ఎంపీలు దూరం!

సోమవారం నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల కోసం విపక్షాలు తమ అస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. సరిహద్దు ఉద్రిక్తతలు, ఆర్థిక వ్యవస్థ మందగమనం, నిరుద్యోగంపై లోక్​సభలో చర్చించాలని పట్టుబట్టేందుకు సన్నద్ధమవుతున్నాయి. లోక్​సభలోని వివిధ పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు డీఎంకే నేత టీఆర్​ బాలు వెల్లడించారు.

పార్లమెంట్​ సమావేశాలకు ఒక రోజు ముందు.. బీఏసీ(బిజినెస్​ అడ్వైజరీ కమిటీ) భేటీని నిర్వహించారు లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా. వాస్తవాధీన రేఖ వెంబడి భారత్​-చైనా మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనతో పాటు ఇతర అంశాలపై చర్చలు జరపాలని విపక్ష నేతలు ఓం బిర్లాను కోరినట్టు బాలు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:- పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధం

మరోవైపు సభ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరిస్తామని విపక్షాలు హామీనిచ్చినట్టు ఓం బిర్లా వెల్లడించారు. సభా సమయాన్ని పూర్తి స్థాయిలో నేతలు ఉపయోగించుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆ నాలుగింటికి వ్యతిరేకం...

ఈ సమావేశాల్లో... ప్రస్తుతం ఉన్న ఆర్డినెన్స్​ల స్థానంలో 11బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. అయితే ఈ 11లో నాలుగు బిల్లులను వ్యతిరేకించాలని కాంగ్రెస్​ సహా ఇతర విపక్ష పార్టీలు నిర్ణయించాయి. వీటిపై తమకున్న సందేహాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేస్తారని ఆశిస్తున్నట్టు తెలిపాయి.

వ్యవసాయానికి సంబంధించిన మూడు బిల్లులతో పాటు బ్యాంకింగ్​ రెగ్యులేషన్​ యాక్ట్​ సవరణను వ్యతిరేకించాలని నిర్ణయించుకున్నట్టు కాంగ్రెస్​ సీనియర్​ నేత జైరామ్​ రమేశ్​ వెల్లడించారు.

ఇదీ చూడండి:- పార్లమెంట్​ సమావేశాలకు ఆ ఎంపీలు దూరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.