ETV Bharat / bharat

కశ్మీర్​లో పాక్ సైన్యం కాల్పులు.. స్థానికుడు మృతి

author img

By

Published : Feb 14, 2020, 3:19 PM IST

Updated : Mar 1, 2020, 8:15 AM IST

one-villager-killed-four-injured-as-pak-troops-shell-village-along-loc-in-j-ks-poonch
కశ్మీర్​లో పాక్ సైన్యం కాల్పులు.. స్థానికుడు మృతి

15:58 February 14

కశ్మీర్​లో పాక్ సైన్యం కాల్పులు.. స్థానికుడు మృతి

సరిహద్దులో పాకిస్థాన్​ సైన్యం దురాగతాలు రోజురోజుకూ హద్దుమీరుతున్నాయి. తాజాగా జమ్ముకశ్మీర్​ పూంచ్​ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గ్రామాలే లక్ష్యంగా కాల్పులకు తెగించింది. మోర్టారు బాంబులతో దాడి చేసింది. ఈ ఘటనలో ఓ స్థానికుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులకు వైద్య చికిత్స అందిస్తున్నారు.

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. పూంచ్​ జిల్లాలోని షాపుర్​, కెర్నీ ప్రాంతాల్లోని జనావాసాలపై పాక్ సైన్యం బుల్లెట్ల వర్షం కురిపించిందని.. 120మిల్లీమీటర్ల మోర్టారు బాంబులతో విరుచుకుపడిందని అధికారులు తెలిపారు. పొరుగుదేశం కాల్పులను భారత జవాన్లు దీటుగా తిప్పికొడుతున్నట్లు స్పష్టం చేశారు. ఘటనకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉందని ప్రకటించారు.

15:16 February 14

పాక్​ సైన్యం దుర్నీతి- ఎల్​ఓసీ వద్ద ఒక కశ్మీరీ బలి

పాకిస్థాన్ సైన్యం మరోమారు దుర్నీతి ప్రదర్శించింది. జమ్ముకశ్మీర్​ పూంచ్​ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంట గ్రామాల్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడింది. పాక్ సైన్యం దాడిలో ఒక స్థానికుడు మరణించాడు. నలుగురు గాయపడ్డారు.  

పొరుగు దేశం కాల్పులకు భారత సైన్యం గట్టిగా జవాబిస్తోంది.

15:58 February 14

కశ్మీర్​లో పాక్ సైన్యం కాల్పులు.. స్థానికుడు మృతి

సరిహద్దులో పాకిస్థాన్​ సైన్యం దురాగతాలు రోజురోజుకూ హద్దుమీరుతున్నాయి. తాజాగా జమ్ముకశ్మీర్​ పూంచ్​ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గ్రామాలే లక్ష్యంగా కాల్పులకు తెగించింది. మోర్టారు బాంబులతో దాడి చేసింది. ఈ ఘటనలో ఓ స్థానికుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులకు వైద్య చికిత్స అందిస్తున్నారు.

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. పూంచ్​ జిల్లాలోని షాపుర్​, కెర్నీ ప్రాంతాల్లోని జనావాసాలపై పాక్ సైన్యం బుల్లెట్ల వర్షం కురిపించిందని.. 120మిల్లీమీటర్ల మోర్టారు బాంబులతో విరుచుకుపడిందని అధికారులు తెలిపారు. పొరుగుదేశం కాల్పులను భారత జవాన్లు దీటుగా తిప్పికొడుతున్నట్లు స్పష్టం చేశారు. ఘటనకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉందని ప్రకటించారు.

15:16 February 14

పాక్​ సైన్యం దుర్నీతి- ఎల్​ఓసీ వద్ద ఒక కశ్మీరీ బలి

పాకిస్థాన్ సైన్యం మరోమారు దుర్నీతి ప్రదర్శించింది. జమ్ముకశ్మీర్​ పూంచ్​ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంట గ్రామాల్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడింది. పాక్ సైన్యం దాడిలో ఒక స్థానికుడు మరణించాడు. నలుగురు గాయపడ్డారు.  

పొరుగు దేశం కాల్పులకు భారత సైన్యం గట్టిగా జవాబిస్తోంది.

Last Updated : Mar 1, 2020, 8:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.