ETV Bharat / bharat

మహారాష్ట్రలో 90 వేలకు చేరువలో కరోనా కేసులు

author img

By

Published : Jun 8, 2020, 8:58 PM IST

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతుంది. కేసుల సంఖ్య 2.56 లక్షలు దాటింది. మరణాల సంఖ్య 7వేలకు ఎగబాకింది. కరోనాకు కేంద్ర బిందువైన మహారాష్ట్రలో మొత్తం కేసులు 90వేలకు చేరువైంది. తమిళనాడు 33 వేలు, గుజరాత్​లో 20 వేల కేసులు నమోదయ్యాయి.

Odisha reports 138 new COVID-19 cases, total climbs to 2,994
మహారాష్ట్రలో 90 వేలకు చేరువైన కరోనా బాధితులు

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు రికార్డు​ స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రస్తుతం కొవిడ్​ బాధితుల సంఖ్య 2,56,611కి చేరింది. 7,200 మంది మరణించారు. ఇప్పటివరకు 1,24, 429 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

మహారాష్ట్రలో 2,553 కేసులు

మహారాష్ట్రలో కరోనా వైరస్​ విజృంభణ కొనసాగుతోంది. సోమవారం మరో 2,553 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్యలో చైనా (83,036)ను దాటేసేంది. మొత్తం కేసుల సంఖ్య 88,528కి చేరింది. గత 24గంటల్లో రికార్డు స్థాయిలో 109 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 3,169కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 44,374 మంది చికిత్స పొందుతున్నారు.

తమిళనాడులో 286 మంది మృతి..

తమిళనాడులోనూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 1,562 మందికి పాజిటివ్​గా తేలింది. 17 మంది మృతి చెందారు. వీరిలో ముగ్గురు ప్రైవేట్​ ఆసుపత్రిలో చికిత్స పొందిన వారు కాగా... మిగిలిన 14 మంది ప్రభుత్వాసుపత్రుల్లో చేరిన వారని అధికారులు తెలిపారు. వరుసగా తొమ్మిదో రోజు వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 33,229కు, మృతుల సంఖ్య 286కు చేరింది.

గుజరాత్​లో 477 కేసులు..

గుజరాత్​లోనూ వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 477మందికి కరోనా సోకింది. 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 20,574, మృతుల సంఖ్య 1280కి చేరినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 5,205మంది చికిత్స పొందుతున్నారు.

ఒడిశాలో 138 కేసులు

ఒడిశా​లో సోమవారం 138 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య మూడు వేలకు చేరువైంది. వీరిలో 1,089 మంది చికిత్స పొందుతుండగా... మరో 1,894 మంది కోలుకున్నారు.

కర్ణాటకలో 64 మంది మృతి..

కర్ణాటకలో కొత్తగా 308 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ వ్యాధి సోకిన వారిలో ముగ్గురు మరణించగా మృతుల సంఖ్య 64కు చేరింది. మొత్తం కేసుల సంఖ్య 5వేల 760కి ఎగబాకింది.

కరోనాతో జవాను మృతి

దిల్లీలోని సీఆర్​పీఎఫ్​ 90 బెటాలియన్​కు చెందిన ఓ జవాను కరోనాతో మృతిచెందాడు. ఈ జవానుతో కలిపి మొత్తం నలుగురు మహమ్మారికి బలయ్యారు. సీఏపీఎఫ్​ దళాల్లో కరోనా సోకినవారి సంఖ్య 1550కి చేరింది. ఇప్పటి వరకు 1100 మంది కోలుకున్నారు. ఓ సీనియర్​ ఎన్నికల అధికారికి కూడా వైరస్​ సోకినట్లు అధికారులు తెలిపారు.

  • అసోంలో 95 మందికి కరోనా పాజిటివ్ అని తేలగా.. కేసుల సంఖ్య 2వేల 776కు ఎగబాకింది. 2,104 యాక్టివ్​ కేసులు ఉండగా... 665 మంది డిశ్చార్జ్​ అయ్యారు. నలుగురు మృతి చెందారు.
  • కేరళలో ఇవాళ 91 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మొత్తం కేసులు సంఖ్య 2 వేలు దాటింది.
  • మణిపూర్​లో కొత్తగా 37 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. మొత్తం కేసుల సంఖ్య 209కి ఎగబాకింది. కరోనా నుంచి కోలుకొని 52మంది ఇంటికి చేరుకున్నారు.
  • పంజాబ్​లో కొత్తగా 55 కేసులు నిర్ధరణకాగా మొత్తం కేసుల సంఖ్య 2వేల 663కు చేరుకుంది. కరోనా సోకి 53 మంది మృతి చెందారు. వ్యాధి నుంచి 2వేల 128 మంది కోలుకున్నారు.

ఇదీ చూడండి: 'చైనాతో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయి'

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు రికార్డు​ స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రస్తుతం కొవిడ్​ బాధితుల సంఖ్య 2,56,611కి చేరింది. 7,200 మంది మరణించారు. ఇప్పటివరకు 1,24, 429 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

మహారాష్ట్రలో 2,553 కేసులు

మహారాష్ట్రలో కరోనా వైరస్​ విజృంభణ కొనసాగుతోంది. సోమవారం మరో 2,553 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్యలో చైనా (83,036)ను దాటేసేంది. మొత్తం కేసుల సంఖ్య 88,528కి చేరింది. గత 24గంటల్లో రికార్డు స్థాయిలో 109 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 3,169కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 44,374 మంది చికిత్స పొందుతున్నారు.

తమిళనాడులో 286 మంది మృతి..

తమిళనాడులోనూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 1,562 మందికి పాజిటివ్​గా తేలింది. 17 మంది మృతి చెందారు. వీరిలో ముగ్గురు ప్రైవేట్​ ఆసుపత్రిలో చికిత్స పొందిన వారు కాగా... మిగిలిన 14 మంది ప్రభుత్వాసుపత్రుల్లో చేరిన వారని అధికారులు తెలిపారు. వరుసగా తొమ్మిదో రోజు వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 33,229కు, మృతుల సంఖ్య 286కు చేరింది.

గుజరాత్​లో 477 కేసులు..

గుజరాత్​లోనూ వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 477మందికి కరోనా సోకింది. 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 20,574, మృతుల సంఖ్య 1280కి చేరినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 5,205మంది చికిత్స పొందుతున్నారు.

ఒడిశాలో 138 కేసులు

ఒడిశా​లో సోమవారం 138 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య మూడు వేలకు చేరువైంది. వీరిలో 1,089 మంది చికిత్స పొందుతుండగా... మరో 1,894 మంది కోలుకున్నారు.

కర్ణాటకలో 64 మంది మృతి..

కర్ణాటకలో కొత్తగా 308 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ వ్యాధి సోకిన వారిలో ముగ్గురు మరణించగా మృతుల సంఖ్య 64కు చేరింది. మొత్తం కేసుల సంఖ్య 5వేల 760కి ఎగబాకింది.

కరోనాతో జవాను మృతి

దిల్లీలోని సీఆర్​పీఎఫ్​ 90 బెటాలియన్​కు చెందిన ఓ జవాను కరోనాతో మృతిచెందాడు. ఈ జవానుతో కలిపి మొత్తం నలుగురు మహమ్మారికి బలయ్యారు. సీఏపీఎఫ్​ దళాల్లో కరోనా సోకినవారి సంఖ్య 1550కి చేరింది. ఇప్పటి వరకు 1100 మంది కోలుకున్నారు. ఓ సీనియర్​ ఎన్నికల అధికారికి కూడా వైరస్​ సోకినట్లు అధికారులు తెలిపారు.

  • అసోంలో 95 మందికి కరోనా పాజిటివ్ అని తేలగా.. కేసుల సంఖ్య 2వేల 776కు ఎగబాకింది. 2,104 యాక్టివ్​ కేసులు ఉండగా... 665 మంది డిశ్చార్జ్​ అయ్యారు. నలుగురు మృతి చెందారు.
  • కేరళలో ఇవాళ 91 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మొత్తం కేసులు సంఖ్య 2 వేలు దాటింది.
  • మణిపూర్​లో కొత్తగా 37 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. మొత్తం కేసుల సంఖ్య 209కి ఎగబాకింది. కరోనా నుంచి కోలుకొని 52మంది ఇంటికి చేరుకున్నారు.
  • పంజాబ్​లో కొత్తగా 55 కేసులు నిర్ధరణకాగా మొత్తం కేసుల సంఖ్య 2వేల 663కు చేరుకుంది. కరోనా సోకి 53 మంది మృతి చెందారు. వ్యాధి నుంచి 2వేల 128 మంది కోలుకున్నారు.

ఇదీ చూడండి: 'చైనాతో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.