ETV Bharat / bharat

అండర్​ వరల్డ్​ డాన్​లు,​ అగ్రనేతలు జెఠ్మలానీ క్లయింట్లే!

author img

By

Published : Sep 8, 2019, 10:32 AM IST

Updated : Sep 29, 2019, 8:49 PM IST

రామ్​ జెఠ్మలానీ... దేశంలోనే దిగ్గజ న్యాయవాది. అత్యధిక పారితోషికం తీసుకునే లాయర్​గా గుర్తింపు పొందిన వ్యక్తి. అతి పిన్న వయసులోనే న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్న ఆయన... కీలక కేసుల్లో అప్రతిహత విజయాలతో దూసుకెళ్లారు. రాజకీయంగా ఎన్నో కీలక పదవులు చేపట్టినా... న్యాయవాదిగానే అందరికీ సుపరిచితం అయ్యారు.

రామ్​ జఠ్మలానీ
రామ్​ జెఠ్మలానీ

ప్రముఖ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి రామ్​ జెఠ్మలానీ(1923 సెప్టెంబర్​14- 2019 సెప్టెంబర్​ 8) ఆదివారం ఉదయం కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దిల్లీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

17 ఏళ్లకే 'లా' పట్టా

పాకిస్థాన్​లోని సింధ్​ డివిజన్​ శికర్​పుర్​ గ్రామంలో బూల్చంద్​ గుర్ముఖ్​దాస్​ జెఠ్మలానీ, పర్బతి బూల్చంద్​ దంపతులకు 1923 సెప్టెంబర్​ 14న జన్మించారు రామ్​ జెఠ్మలానీ. ఆయన అసాధారణ ప్రతిభతో 13 ఏళ్ల వయసులోనే మెట్రికులేషన్​ పూర్తిచేశారు. న్యాయవాద పట్టా పొందడానికి కనీస వయసు 21గా ఉన్నప్పటికీ ప్రత్యేక అనుమతుల మేరకు ఆయన 17 ఏళ్ల వయసులో బాంబే విశ్వవిద్యాలయం నుంచి ఎల్​ఎల్​బీ పట్టా అందుకున్నారు.
1947లో 18 ఏళ్ల వయసులోనే దుర్గను వివాహం చేసుకున్నారు జెఠ్మలానీ. అనంతరం రత్నా శహానీని రెండో వివాహం చేసుకున్నారు. భారత్​ నుంచి పాకిస్థాన్​ విడిపోయాక ముంబయి వచ్చి స్థిరపడ్డారు. ఈయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రాజకీయం...

దేశంలో అత్యవసర పరిస్థితుల అనంతరం 1977లో జరిగిన సాధారణ ఎన్నికల్లో శివసేన, భారతీయ జన సంఘ్​ మద్దతుతో ఉల్హాస్​నగర్​ నుంచి తొలిసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు రామ్​ జెఠ్మలానీ. అప్పటి న్యాయశాఖ మంత్రి హెచ్​ఆర్​ గోఖలేపై గెలుపొందారు. 1988లో రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు.

అటల్​ బిహారి వాజ్​పేయీ ప్రభుత్వంలో 1996లో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా, పరిశ్రమల వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. వాజ్​పేయీ రెండోసారి ఏర్పాటుచేసిన ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలు నిర్వర్తించారు.

వాజ్​పేయీపై పోటీ...

2004 సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని అటల్​ బిహారి వాజ్​పేయీపై లఖ్​నవూ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు రామ్​ జెఠ్మలానీ. తిరిగి 2010లో భాజపాలో చేరి రాజస్థాన్​ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

2013లో భాజపా నుంచి బయటకు వచ్చారు జెఠ్మలానీ.

న్యాయవాదిగా అసాధారణ గుర్తింపు..

అవిభజిత భారత్​లోని సింధ్​లో న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు జెఠ్మలానీ. విభజన తర్వాత భారత్​లో పలు కీలక కేసుల్లో తనదైన ముద్రవేశారు. అత్యవసర పరిస్థితికి ముందు, తర్వాత నాలుగు పర్యాయాలు బార్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియాకు ఛైర్మన్​గా సేవలందించారు. 2010 మేలో సుప్రీంకోర్టు బార్​ అసోసియేషన్​ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1996లో అంతర్జాతీయ బార్​ అసోసియేషన్​లో సభ్యుడిగానూ వ్యవహరించారు.

అత్యంత ప్రముఖులకు సంబంధించిన​ కేసులు వాదిస్తూ.. అత్యధిక పారితోషికం తీసుకునే న్యాయవాదిగా పేరొందారు రామ్​ జెఠ్మలానీ.

అండర్​ వరల్డ్ డాన్​లు, అగ్రనేతల కేసులు...

న్యాయవాద వృత్తిలో దేశంలోని ప్రముఖులు, అండర్​ వరల్డ్​ డాన్​ల కేసులను వాదించి తనదైన ముద్ర వేశారు జెఠ్మలానీ. వాటిలో కొన్ని....

  • హవాలా కుంభకోణం కేసులో భాజపా అగ్రనేత ఎల్​కే అడ్వాణీ తరఫున వాదనలు.
  • సోహ్రబుద్దీన్​ ఎన్​కౌంటర్​ కేసులో ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్​ షా తరఫున వాదనలు.
  • ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్​ మోహన్ రెడ్డికి సంబంధించిన మనీలాండరింగ్​ కేసు.
  • స్టాక్​ మార్కెట్​ కుంభకోణంలో హర్షద్​ మెహతా, కేతన్​ పరేఖ్​ తరఫున వాదనలు.
  • పారిశ్రామికవేత్త సుబ్రతా రాయ్​​కు సంబంధించిన సహారా-సెబీ కేసు
  • తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమ ఆస్తుల కేసు
  • అండర్​ వరల్డ్​ డాన్​ హాజీ మస్తాన్​ కేసు
  • ఉగ్రవాది అఫ్జల్​ గురు మరణ శిక్ష కేసు(శిక్షను సమర్థిస్తూ వాదనలు)

ఇదీ చూడండి: సీనియర్ న్యాయవాది​ జెఠ్మలానీ కన్నుమూత

రామ్​ జెఠ్మలానీ

ప్రముఖ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి రామ్​ జెఠ్మలానీ(1923 సెప్టెంబర్​14- 2019 సెప్టెంబర్​ 8) ఆదివారం ఉదయం కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దిల్లీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

17 ఏళ్లకే 'లా' పట్టా

పాకిస్థాన్​లోని సింధ్​ డివిజన్​ శికర్​పుర్​ గ్రామంలో బూల్చంద్​ గుర్ముఖ్​దాస్​ జెఠ్మలానీ, పర్బతి బూల్చంద్​ దంపతులకు 1923 సెప్టెంబర్​ 14న జన్మించారు రామ్​ జెఠ్మలానీ. ఆయన అసాధారణ ప్రతిభతో 13 ఏళ్ల వయసులోనే మెట్రికులేషన్​ పూర్తిచేశారు. న్యాయవాద పట్టా పొందడానికి కనీస వయసు 21గా ఉన్నప్పటికీ ప్రత్యేక అనుమతుల మేరకు ఆయన 17 ఏళ్ల వయసులో బాంబే విశ్వవిద్యాలయం నుంచి ఎల్​ఎల్​బీ పట్టా అందుకున్నారు.
1947లో 18 ఏళ్ల వయసులోనే దుర్గను వివాహం చేసుకున్నారు జెఠ్మలానీ. అనంతరం రత్నా శహానీని రెండో వివాహం చేసుకున్నారు. భారత్​ నుంచి పాకిస్థాన్​ విడిపోయాక ముంబయి వచ్చి స్థిరపడ్డారు. ఈయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రాజకీయం...

దేశంలో అత్యవసర పరిస్థితుల అనంతరం 1977లో జరిగిన సాధారణ ఎన్నికల్లో శివసేన, భారతీయ జన సంఘ్​ మద్దతుతో ఉల్హాస్​నగర్​ నుంచి తొలిసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు రామ్​ జెఠ్మలానీ. అప్పటి న్యాయశాఖ మంత్రి హెచ్​ఆర్​ గోఖలేపై గెలుపొందారు. 1988లో రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు.

అటల్​ బిహారి వాజ్​పేయీ ప్రభుత్వంలో 1996లో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా, పరిశ్రమల వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. వాజ్​పేయీ రెండోసారి ఏర్పాటుచేసిన ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలు నిర్వర్తించారు.

వాజ్​పేయీపై పోటీ...

2004 సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని అటల్​ బిహారి వాజ్​పేయీపై లఖ్​నవూ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు రామ్​ జెఠ్మలానీ. తిరిగి 2010లో భాజపాలో చేరి రాజస్థాన్​ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

2013లో భాజపా నుంచి బయటకు వచ్చారు జెఠ్మలానీ.

న్యాయవాదిగా అసాధారణ గుర్తింపు..

అవిభజిత భారత్​లోని సింధ్​లో న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు జెఠ్మలానీ. విభజన తర్వాత భారత్​లో పలు కీలక కేసుల్లో తనదైన ముద్రవేశారు. అత్యవసర పరిస్థితికి ముందు, తర్వాత నాలుగు పర్యాయాలు బార్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియాకు ఛైర్మన్​గా సేవలందించారు. 2010 మేలో సుప్రీంకోర్టు బార్​ అసోసియేషన్​ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1996లో అంతర్జాతీయ బార్​ అసోసియేషన్​లో సభ్యుడిగానూ వ్యవహరించారు.

అత్యంత ప్రముఖులకు సంబంధించిన​ కేసులు వాదిస్తూ.. అత్యధిక పారితోషికం తీసుకునే న్యాయవాదిగా పేరొందారు రామ్​ జెఠ్మలానీ.

అండర్​ వరల్డ్ డాన్​లు, అగ్రనేతల కేసులు...

న్యాయవాద వృత్తిలో దేశంలోని ప్రముఖులు, అండర్​ వరల్డ్​ డాన్​ల కేసులను వాదించి తనదైన ముద్ర వేశారు జెఠ్మలానీ. వాటిలో కొన్ని....

  • హవాలా కుంభకోణం కేసులో భాజపా అగ్రనేత ఎల్​కే అడ్వాణీ తరఫున వాదనలు.
  • సోహ్రబుద్దీన్​ ఎన్​కౌంటర్​ కేసులో ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్​ షా తరఫున వాదనలు.
  • ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్​ మోహన్ రెడ్డికి సంబంధించిన మనీలాండరింగ్​ కేసు.
  • స్టాక్​ మార్కెట్​ కుంభకోణంలో హర్షద్​ మెహతా, కేతన్​ పరేఖ్​ తరఫున వాదనలు.
  • పారిశ్రామికవేత్త సుబ్రతా రాయ్​​కు సంబంధించిన సహారా-సెబీ కేసు
  • తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమ ఆస్తుల కేసు
  • అండర్​ వరల్డ్​ డాన్​ హాజీ మస్తాన్​ కేసు
  • ఉగ్రవాది అఫ్జల్​ గురు మరణ శిక్ష కేసు(శిక్షను సమర్థిస్తూ వాదనలు)

ఇదీ చూడండి: సీనియర్ న్యాయవాది​ జెఠ్మలానీ కన్నుమూత

New Delhi, Sep 08 (ANI): The Centers for Disease Control (CDC) is warning people against the use of e-cigarette products after serious lung illnesses were found associated with vaping products. In its official release, the organisation notes that initial findings from the investigation indicate to illnesses likely to be associated with chemical exposure. However, it is yet to be fully linked to a single product or substance common to all cases. More than 25 states have reported possible cases of illnesses associated with e-cigarette products such as devices, liquids, refill pods, and cartridges. So far, two deaths have been reported to the CDC.
Last Updated : Sep 29, 2019, 8:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.