ETV Bharat / bharat

బిహార్ పోరు: ఆ పార్టీలు ఓట్లు చీల్చేందుకే పరిమితమా?

author img

By

Published : Sep 23, 2020, 5:13 PM IST

బిహార్​ బరిలో ప్రధాన పక్షాలే కాకుండా.. ఎంఐఎం, ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ సహా పలు పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందు సన్నద్ధమవుతున్నాయి. గత ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకున్నా.. ఈసారి దశ మారుతుందన్న ఆశతో ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అయితే, ఈ పార్టీలు ఇతర రాష్ట్రాల్లో హవా చాటుతున్నా.. బిహార్​లో మాత్రం ఓట్లు చీల్చటం వరకే పరిమితమవుతున్నాయి.

Bihar parties
పార్టీల ప్రయత్నం

బిహార్​ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహప్రతివ్యూహాల్లో నిమగ్నమై ఉన్నాయి. క్షేత్రస్థాయిలో గట్టి పట్టున్న సంప్రదాయ పార్టీలకు తోడుగా పొరుగు రాష్ట్రాల్లోని బలమైన పక్షాలు.. బిహారీ గడ్డపై గెలుపు మార్గం వెతికే పనిలో పడ్డాయి.

సమాజ్​వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, తృణముల్​ కాంగ్రెస్​, ఝార్ఖండ్​ ముక్తి మోర్చా తదితర పార్టీలు.. ఎన్నికల్లో విజయం సాధించకపోయినా ప్రధాన పార్టీల ఓట్లు చీల్చి.. ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలోనే ఉన్నాయి.

ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ కసరత్తులు

1999లో తారిఖ్​ అన్వర్​ కాంగ్రెస్​ నుంచి బయటికొచ్చి వేరు కుంపటి పెట్టుకున్నారు. శరద్​ పవార్​, పీఏ సంగ్మాతో కలిసి ఎన్సీపీని స్థాపించారు. అన్వర్​ గతంలో బిహార్​లోని కతిహార్ ఎంపీగానూ పని చేశారు. 2018లో అన్వర్​ ఎన్సీపీని వీడినప్పటి నుంచి బిహార్​లో ఆ పార్టీకి గడ్డుకాలం మొదలైంది. క్షేత్రస్థాయిలో బలం కొల్పోతూ వస్తోంది. ఇక సమాజ్​వాదీ, బీఎస్పీ పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

2015లో తీవ్ర నిరాశ

2015లో బిహార్​ శాసనసభ ఎన్నికల్లో సమాజ్​వాదీ, ఎంఐఎం, జేఎమ్ఎమ్​ పార్టీలు ప్రచారంతో హోరెత్తించి పోటీ చేసినా.. ఒక్క సీటు గెలవలేకపోయాయి. ఆ ఎన్నికల్లో ఝార్ఖండ్​ ముక్తి మోర్చా 32 చోట్ల పోటీచేసింది. సమాజ్​వాదీ పార్టీ ఏకంగా 135మంది అభ్యర్థులను బరిలోకి దించింది. ఓవైసీ ఆధ్వర్యంలోని ఎంఐఎం కూడా సీమాంచల్​ పరిధిలోని 6 స్థానాల్లో తమ అదృష్టం పరీక్షించుకుంది. వీటితో పాటు మరికొన్ని ఇతర ప్రాంతీయ పార్టీలు పోటీ చేసినా రిక్తహస్తాలే మిగిలాయి.

సమరంలో సమాజ్​వాదీ పార్టీ..

బిహార్​లో సమాజ్​వాదీ పార్టీ ప్రభావం క్రమంగా తగ్గిపోతోంది. శాసనసభ ఎన్నికల్లో పార్టీ ప్రదర్శన తీసికట్టుగా తయారవుతోంది. 2005లో ఎస్పీ 142 స్థానాల్లో బరిలోకి దిగి నాలుగు స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఇక అప్పటినుంచి ఎస్పీ సైకిల్​ తిరోమనంలోనే ఉంది. వరసగా 2010, 2015 శాసనసభ ఎన్నికల్లో సున్నాకే పరిమితమైంది.

జాడలేని జేఎంఎం..

బిహార్​ సరిహద్దు రాష్ట్రం ఝార్ఖండ్. ప్రస్తుతం అక్కడి అధికార పార్టీ ఝార్ఖండ్​ ముక్తి మోర్చా ​.. బిహార్​ ఎన్నికల్లో ఒక్కసారి మాత్రమే విజయం రుచి చూసింది. 2010 అసెంబ్లీ ఎన్నికల్లో 41 స్థానాల్లో పోటీకి దిగిన జేఎంఎం.. ఒక్క సీటుకే పరిమితమైంది. ఆ తర్వాత 2015లో 32 మందిని బరిలో నిలిపినా ఖాతా తెరవలేకపోయింది.

ఓవైసీ సత్తా చాటేనా..

అసదుద్దీన్​ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం ప్రధానంగా సీమాంచల్​పై దృష్టి సారించింది. కారణం ఈ ప్రాంతంలో ముస్లింల జనభా ఎక్కువగా ఉండటమే. గత ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులను పోటీలో దింపి భంగపడినా.. ఈసారి గెలుపే లక్ష్యంగా 50 స్థానాలకు అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసింది.

ఇదీ చూడండి: 'త్రీ గ్రేడ్' వ్యూహంతో బిహార్​ పోరుకు ఓవైసీ

ఓవైసీ పార్టీ బిహార్​లో ఓ శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించింది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత కిషన్​జంగ్​ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుంది. అయినా.. ఎంఐఎంకు సీమాంచల్​ ముస్లిం ఓటర్లలో తప్ప రాష్ట్రాంలోని ఇతర ప్రాంతాల్లో వ్యవస్థాగతంగా ఎటువంటి పట్టు లేదు.

రణక్షేత్రంలో తగ్గిన పార్టీల జోష్​..

గతంలోలానే విజయావకాశాలు తక్కువగానే ఉన్నా.. ఈసారి కూడా ఇతర రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు బిహార్ ఎన్నికలకు ప్రణాళికలు రచిస్తున్నాయి. పోటీకి సన్నద్ధమవుతున్నా.. అంతకుముందు చేసిన హడావుడి ఈ ఎన్నికల్లో అంతలా కనిపించటం లేదు.

ఇదీ చూడండి: బిహార్​ డీజీపీ వీఆర్​ఎస్​- అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ!

పరిశీలకుల మాటేంటి ?

బిహార్​లో పార్టీ పరంగా పట్టు పెంచుకోవటం కోసమే సంప్రదాయేతర పార్టీలు పోటీకి దిగుతున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

2015లో పార్టీల ఓట్ల శాతమెంత ?

పార్టీఓట్లు ఓట్ల శాతం
ఎస్పీ13,5921.7%
బీఎస్పీ13,5881.5%
ఎంఐఎం60630.7%
జేఎంఎం33810.4%
ఎన్సీపీ26530.3%
ఎస్​కేపీఎల్​22500.3%

ఇదీ చూడండి: ఎన్డీఏతో ఎల్​జేపీ తెగదెంపులు- బిహార్​లో​ ఒంటరి పోరు!

ఇదీ చూడండి: బిహార్​ పోరు: ప్రధాన పార్టీల అస్త్రాలివే...

ఇదీ చూడండి: 'నితీశ్​ ఒంటరిగా ఎందుకు పోటీ చేయరు?'

బిహార్​ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహప్రతివ్యూహాల్లో నిమగ్నమై ఉన్నాయి. క్షేత్రస్థాయిలో గట్టి పట్టున్న సంప్రదాయ పార్టీలకు తోడుగా పొరుగు రాష్ట్రాల్లోని బలమైన పక్షాలు.. బిహారీ గడ్డపై గెలుపు మార్గం వెతికే పనిలో పడ్డాయి.

సమాజ్​వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, తృణముల్​ కాంగ్రెస్​, ఝార్ఖండ్​ ముక్తి మోర్చా తదితర పార్టీలు.. ఎన్నికల్లో విజయం సాధించకపోయినా ప్రధాన పార్టీల ఓట్లు చీల్చి.. ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలోనే ఉన్నాయి.

ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ కసరత్తులు

1999లో తారిఖ్​ అన్వర్​ కాంగ్రెస్​ నుంచి బయటికొచ్చి వేరు కుంపటి పెట్టుకున్నారు. శరద్​ పవార్​, పీఏ సంగ్మాతో కలిసి ఎన్సీపీని స్థాపించారు. అన్వర్​ గతంలో బిహార్​లోని కతిహార్ ఎంపీగానూ పని చేశారు. 2018లో అన్వర్​ ఎన్సీపీని వీడినప్పటి నుంచి బిహార్​లో ఆ పార్టీకి గడ్డుకాలం మొదలైంది. క్షేత్రస్థాయిలో బలం కొల్పోతూ వస్తోంది. ఇక సమాజ్​వాదీ, బీఎస్పీ పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

2015లో తీవ్ర నిరాశ

2015లో బిహార్​ శాసనసభ ఎన్నికల్లో సమాజ్​వాదీ, ఎంఐఎం, జేఎమ్ఎమ్​ పార్టీలు ప్రచారంతో హోరెత్తించి పోటీ చేసినా.. ఒక్క సీటు గెలవలేకపోయాయి. ఆ ఎన్నికల్లో ఝార్ఖండ్​ ముక్తి మోర్చా 32 చోట్ల పోటీచేసింది. సమాజ్​వాదీ పార్టీ ఏకంగా 135మంది అభ్యర్థులను బరిలోకి దించింది. ఓవైసీ ఆధ్వర్యంలోని ఎంఐఎం కూడా సీమాంచల్​ పరిధిలోని 6 స్థానాల్లో తమ అదృష్టం పరీక్షించుకుంది. వీటితో పాటు మరికొన్ని ఇతర ప్రాంతీయ పార్టీలు పోటీ చేసినా రిక్తహస్తాలే మిగిలాయి.

సమరంలో సమాజ్​వాదీ పార్టీ..

బిహార్​లో సమాజ్​వాదీ పార్టీ ప్రభావం క్రమంగా తగ్గిపోతోంది. శాసనసభ ఎన్నికల్లో పార్టీ ప్రదర్శన తీసికట్టుగా తయారవుతోంది. 2005లో ఎస్పీ 142 స్థానాల్లో బరిలోకి దిగి నాలుగు స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఇక అప్పటినుంచి ఎస్పీ సైకిల్​ తిరోమనంలోనే ఉంది. వరసగా 2010, 2015 శాసనసభ ఎన్నికల్లో సున్నాకే పరిమితమైంది.

జాడలేని జేఎంఎం..

బిహార్​ సరిహద్దు రాష్ట్రం ఝార్ఖండ్. ప్రస్తుతం అక్కడి అధికార పార్టీ ఝార్ఖండ్​ ముక్తి మోర్చా ​.. బిహార్​ ఎన్నికల్లో ఒక్కసారి మాత్రమే విజయం రుచి చూసింది. 2010 అసెంబ్లీ ఎన్నికల్లో 41 స్థానాల్లో పోటీకి దిగిన జేఎంఎం.. ఒక్క సీటుకే పరిమితమైంది. ఆ తర్వాత 2015లో 32 మందిని బరిలో నిలిపినా ఖాతా తెరవలేకపోయింది.

ఓవైసీ సత్తా చాటేనా..

అసదుద్దీన్​ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం ప్రధానంగా సీమాంచల్​పై దృష్టి సారించింది. కారణం ఈ ప్రాంతంలో ముస్లింల జనభా ఎక్కువగా ఉండటమే. గత ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులను పోటీలో దింపి భంగపడినా.. ఈసారి గెలుపే లక్ష్యంగా 50 స్థానాలకు అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసింది.

ఇదీ చూడండి: 'త్రీ గ్రేడ్' వ్యూహంతో బిహార్​ పోరుకు ఓవైసీ

ఓవైసీ పార్టీ బిహార్​లో ఓ శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించింది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత కిషన్​జంగ్​ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుంది. అయినా.. ఎంఐఎంకు సీమాంచల్​ ముస్లిం ఓటర్లలో తప్ప రాష్ట్రాంలోని ఇతర ప్రాంతాల్లో వ్యవస్థాగతంగా ఎటువంటి పట్టు లేదు.

రణక్షేత్రంలో తగ్గిన పార్టీల జోష్​..

గతంలోలానే విజయావకాశాలు తక్కువగానే ఉన్నా.. ఈసారి కూడా ఇతర రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు బిహార్ ఎన్నికలకు ప్రణాళికలు రచిస్తున్నాయి. పోటీకి సన్నద్ధమవుతున్నా.. అంతకుముందు చేసిన హడావుడి ఈ ఎన్నికల్లో అంతలా కనిపించటం లేదు.

ఇదీ చూడండి: బిహార్​ డీజీపీ వీఆర్​ఎస్​- అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ!

పరిశీలకుల మాటేంటి ?

బిహార్​లో పార్టీ పరంగా పట్టు పెంచుకోవటం కోసమే సంప్రదాయేతర పార్టీలు పోటీకి దిగుతున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

2015లో పార్టీల ఓట్ల శాతమెంత ?

పార్టీఓట్లు ఓట్ల శాతం
ఎస్పీ13,5921.7%
బీఎస్పీ13,5881.5%
ఎంఐఎం60630.7%
జేఎంఎం33810.4%
ఎన్సీపీ26530.3%
ఎస్​కేపీఎల్​22500.3%

ఇదీ చూడండి: ఎన్డీఏతో ఎల్​జేపీ తెగదెంపులు- బిహార్​లో​ ఒంటరి పోరు!

ఇదీ చూడండి: బిహార్​ పోరు: ప్రధాన పార్టీల అస్త్రాలివే...

ఇదీ చూడండి: 'నితీశ్​ ఒంటరిగా ఎందుకు పోటీ చేయరు?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.