ETV Bharat / bharat

ఇస్లామిక్​ స్టడీస్​లో ముస్లిమేతర యువకుడి ప్రథమ స్థానం

author img

By

Published : Nov 18, 2020, 8:35 AM IST

రాజస్థాన్​కు చెందిన ఓ ముస్లిమేతర యువకుడు... ఇస్లామిక్​ స్టడీస్​ ప్రవేశ పరీక్షలో ప్రథమ స్థానం సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కశ్మీర్​లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రవేశం కోసం సెప్టంబరులో రాసిన పరీక్షల్లో ప్రత్యేకత చాటాడు.

Non-Muslim student tops in Islamic Studies  at Central University of Kashmir
ఇస్లామిక్​ స్టడీస్​ ప్రవేశ పరీక్షలో ప్రథమ స్థానం

ఆ యువకుడు పుట్టింది ముస్లిమేతర కుటుంబంలో. కానీ ఇస్లామిక్​ స్టడీస్​లో పీజీ చేయాలనుకున్నాడు. అదే అరుదనుకుంటే ఆ కోర్సు కోసం రాసిన ప్రవేశ పరీక్షల్లో 73.25 పాయింట్లతో దేశంలోనే తొలి స్థానంలో నిలిచి ఆశ్చర్యపరిచాడు. అతడే రాజస్థాన్​కు చెందిన శుభం యాదవ్​. 21ఏళ్ల యాదవ్​కు ఇస్లాం బోధనలపై అధ్యయనం చేయాలన్న ఆసక్తి. అందుకోసం కశ్మీర్​లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రవేశం కోసం సెప్టంబరులో పరీక్ష రాశాడు. అక్టోబరు 29న విడుదలైన ఫలితాల్లో ప్రథమ ర్యాంకు సాధించి ప్రత్యేకత చాటాడు. ఆ యూనివర్సటీలో 2015లో ఇస్లామిక్​ స్టడీస్​ సెంటర్​ను ప్రారంభించగా, ఇప్పటివరకూ పీజీ ప్రవేశ పరీక్షల్లో మొదటి ర్యాంకు సాధించిన తొలి ముస్లిమేతర అభ్యర్థి యాదవే అని వర్సీటీ వర్గాలు వెల్లడించాయి.

దిల్లీ యూనివర్సిటీలో తత్వశాస్త్రంలో డిగ్రీ చేసిన యాదవ్​... ఇస్లామిక్​ స్టడీస్​ను ఎంచుకోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు. "ఇస్లాం మతం హింసను ప్రేరేపిస్తుందని సమాజంలో అపోహ ఉంది. మత విద్వేసాలు పెరుగుతున్న నేటి కాలంలో ఇతరుల మతాలను అర్థం చేసుకోవడం అత్యంత అవసరం" అని యాదవ్​ చెప్పారు. తాను భవిష్యత్​లో సివిల్స్ సర్వీసు​లో చేరాలనుకుంటున్నట్లు తెలిపాడు యాదవ్​.

ఆ యువకుడు పుట్టింది ముస్లిమేతర కుటుంబంలో. కానీ ఇస్లామిక్​ స్టడీస్​లో పీజీ చేయాలనుకున్నాడు. అదే అరుదనుకుంటే ఆ కోర్సు కోసం రాసిన ప్రవేశ పరీక్షల్లో 73.25 పాయింట్లతో దేశంలోనే తొలి స్థానంలో నిలిచి ఆశ్చర్యపరిచాడు. అతడే రాజస్థాన్​కు చెందిన శుభం యాదవ్​. 21ఏళ్ల యాదవ్​కు ఇస్లాం బోధనలపై అధ్యయనం చేయాలన్న ఆసక్తి. అందుకోసం కశ్మీర్​లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రవేశం కోసం సెప్టంబరులో పరీక్ష రాశాడు. అక్టోబరు 29న విడుదలైన ఫలితాల్లో ప్రథమ ర్యాంకు సాధించి ప్రత్యేకత చాటాడు. ఆ యూనివర్సటీలో 2015లో ఇస్లామిక్​ స్టడీస్​ సెంటర్​ను ప్రారంభించగా, ఇప్పటివరకూ పీజీ ప్రవేశ పరీక్షల్లో మొదటి ర్యాంకు సాధించిన తొలి ముస్లిమేతర అభ్యర్థి యాదవే అని వర్సీటీ వర్గాలు వెల్లడించాయి.

దిల్లీ యూనివర్సిటీలో తత్వశాస్త్రంలో డిగ్రీ చేసిన యాదవ్​... ఇస్లామిక్​ స్టడీస్​ను ఎంచుకోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు. "ఇస్లాం మతం హింసను ప్రేరేపిస్తుందని సమాజంలో అపోహ ఉంది. మత విద్వేసాలు పెరుగుతున్న నేటి కాలంలో ఇతరుల మతాలను అర్థం చేసుకోవడం అత్యంత అవసరం" అని యాదవ్​ చెప్పారు. తాను భవిష్యత్​లో సివిల్స్ సర్వీసు​లో చేరాలనుకుంటున్నట్లు తెలిపాడు యాదవ్​.

ఇదీ చూడండి: ఆ ఊరి నిండా అల్లుళ్లే.. కారణమిదే.?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.