ETV Bharat / bharat

​​​​​రోగుల పాలిట సంజీవని.. ధన్వంతరి రథ్‌

author img

By

Published : Jul 12, 2020, 5:31 AM IST

ప్రస్తుతం ఆసుపత్రులన్ని కరోనా బాధితులతో నిండిపోయాయి. ఫలితంగా సాధారణ రోగులు ఆసుపత్రులకు రావటమే తగ్గించారు. ఇలాంటి వారి కోసం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఏంఎసీ) సరికొత్త ప్రయోగానికి తెరతీసింది. 'ధన్వంతరి రథ్‌' పేరిట ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది. ఇందులో డయాబెటిస్​, బీపీ, గుండె సంబంధింత సమస్యలు, ఇతర రోగాలతో బాధపడేవారికి చికిత్స అందించనున్నారు.

Non COVID healthcare services to peoples doorsteps in Ahmedabad with Dhanvantri Rath
​​​​​రోగుల పాటి సంజీవని.. ధన్వంతరి రథ్‌

కరోనా కారణంగా ఆస్పత్రులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. చాలా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కొవిడ్‌ ఆస్పత్రులుగా రూపుదాల్చాయి. దాదాపు అన్ని ఆస్పత్రులు ఓపీ సేవలు నిలిపివేశాయి. ఫలితంగా సాధారణ రోగులు ఆస్పత్రులకు రావడం తగ్గిపోయింది. చూసేవారికి మాత్రం వీరి సంఖ్య తగ్గిపోయిందని అనుకోవడం సహజం. కానీ, ఇలాంటి సమయంలో ఉన్న రోగాలకు కొత్త రోగాలు ఎందుకు తెచ్చుకోవడం అని ఆస్పత్రుల మొహం కూడా చూడడం లేదనేది కాదనలేని సత్యం. ఈ పరిస్థితిని ఊహించిన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఏంఎసీ) సరికొత్త ప్రయోగానికి తెరతీసింది. ధన్వంతరి రథ్‌ పేరిట ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది.

Non COVID healthcare services to peoples doorsteps in Ahmedabad with Dhanvantri Rath
ధన్వంతరి రథ్

వారి కోసం ప్రత్యేకంగా...

డయాబెటిస్‌, బీపీ, గుండె సంబంధిత జబ్బులతో బాధపడేవారితో పాటు ఇతర సమస్యలతో ఆస్పత్రికి రాలేని వారి కోసం అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఈ మొబైల్‌ మెడికల్‌ వ్యాన్లు ఏర్పాటు చేసింది. ఇందులో ఆయుష్‌ డాక్టర్‌, ఓ పారామెడిక్‌, నర్సింగ్‌ సిబ్బంది, స్థానిక వైద్యాధికారి ఉంటారు. అహ్మదాబాద్‌ నగరంలో కరోనా యేతర సేవలు అందించేందుకు ప్రత్యేకించారు. ఆయుర్వేదిక్‌, హోమియోపతి, విటమిన్‌ టాబ్లెట్లు, సాధారణ పరీక్షల యంత్రాలు ఇందులో అందుబాటులో ఉంటాయి. ఈ వాహనాల్లో పరీక్షించిన అనంతరం ఎవరికైనా ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటే తగిన సూచనలు కూడా చేస్తారు.

4 లక్షల మందికి ఓపీ సేవలు...

అహ్మదాబాద్‌ నగర వ్యాప్తంగా ఇలాంటివి 120 వాహనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 4 లక్షల మందికి పైగా ఓపీ సేవలను వీటి ద్వారా అందించారు. అంతేకాదు నగరంలో బయటకు రాని కరోనా కేసులు కూడా వీటి వల్ల వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా సకాలంలో వీరికి వైద్యం అందించగలిగారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మలేరియా, డెంగీ వంటి పరీక్షలు నిర్వహించే సదుపాయం కూడా ఇందులో ఏర్పాటు చేశారు.

ప్రధాని ప్రశంసలు..

విపత్తు వేళ ఇలా ఇంటింటికీ వెళ్లి వైద్యం అందించాలనే అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆలోచనను కేంద్రం ప్రశంసించింది. కొవిడ్‌పై శనివారం నిర్వహించిన ప్రత్యేక సమీక్షలో ప్రధాని మోదీ సైతం ధన్వంతరి రథ్‌లను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇతర ప్రాంతాలకు కూడా వీటిని విస్తరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి:కేరళ బంగారం స్మగ్లింగ్​ కేసు కి'లేడీ' అరెస్ట్

కరోనా కారణంగా ఆస్పత్రులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. చాలా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కొవిడ్‌ ఆస్పత్రులుగా రూపుదాల్చాయి. దాదాపు అన్ని ఆస్పత్రులు ఓపీ సేవలు నిలిపివేశాయి. ఫలితంగా సాధారణ రోగులు ఆస్పత్రులకు రావడం తగ్గిపోయింది. చూసేవారికి మాత్రం వీరి సంఖ్య తగ్గిపోయిందని అనుకోవడం సహజం. కానీ, ఇలాంటి సమయంలో ఉన్న రోగాలకు కొత్త రోగాలు ఎందుకు తెచ్చుకోవడం అని ఆస్పత్రుల మొహం కూడా చూడడం లేదనేది కాదనలేని సత్యం. ఈ పరిస్థితిని ఊహించిన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఏంఎసీ) సరికొత్త ప్రయోగానికి తెరతీసింది. ధన్వంతరి రథ్‌ పేరిట ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది.

Non COVID healthcare services to peoples doorsteps in Ahmedabad with Dhanvantri Rath
ధన్వంతరి రథ్

వారి కోసం ప్రత్యేకంగా...

డయాబెటిస్‌, బీపీ, గుండె సంబంధిత జబ్బులతో బాధపడేవారితో పాటు ఇతర సమస్యలతో ఆస్పత్రికి రాలేని వారి కోసం అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఈ మొబైల్‌ మెడికల్‌ వ్యాన్లు ఏర్పాటు చేసింది. ఇందులో ఆయుష్‌ డాక్టర్‌, ఓ పారామెడిక్‌, నర్సింగ్‌ సిబ్బంది, స్థానిక వైద్యాధికారి ఉంటారు. అహ్మదాబాద్‌ నగరంలో కరోనా యేతర సేవలు అందించేందుకు ప్రత్యేకించారు. ఆయుర్వేదిక్‌, హోమియోపతి, విటమిన్‌ టాబ్లెట్లు, సాధారణ పరీక్షల యంత్రాలు ఇందులో అందుబాటులో ఉంటాయి. ఈ వాహనాల్లో పరీక్షించిన అనంతరం ఎవరికైనా ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటే తగిన సూచనలు కూడా చేస్తారు.

4 లక్షల మందికి ఓపీ సేవలు...

అహ్మదాబాద్‌ నగర వ్యాప్తంగా ఇలాంటివి 120 వాహనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 4 లక్షల మందికి పైగా ఓపీ సేవలను వీటి ద్వారా అందించారు. అంతేకాదు నగరంలో బయటకు రాని కరోనా కేసులు కూడా వీటి వల్ల వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా సకాలంలో వీరికి వైద్యం అందించగలిగారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మలేరియా, డెంగీ వంటి పరీక్షలు నిర్వహించే సదుపాయం కూడా ఇందులో ఏర్పాటు చేశారు.

ప్రధాని ప్రశంసలు..

విపత్తు వేళ ఇలా ఇంటింటికీ వెళ్లి వైద్యం అందించాలనే అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆలోచనను కేంద్రం ప్రశంసించింది. కొవిడ్‌పై శనివారం నిర్వహించిన ప్రత్యేక సమీక్షలో ప్రధాని మోదీ సైతం ధన్వంతరి రథ్‌లను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇతర ప్రాంతాలకు కూడా వీటిని విస్తరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి:కేరళ బంగారం స్మగ్లింగ్​ కేసు కి'లేడీ' అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.