ETV Bharat / bharat

ఔషధాలు, వైద్య పరికరాల కొరత లేదు: కేంద్రం

author img

By

Published : Apr 3, 2020, 8:30 PM IST

కరోనా వైరస్​ పోరాటానికి కావాల్సిన ఔషధాలు, వైద్య పరికరాలు భారత్​ వద్ద ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటి తయారీ, పంపిణీపైనా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు తెలిపింది.

No shortage of medicines, medical supplies across the country: Govt
దేశంలో ఔషధాలు, వైద్య పరికరాల కొరత లేదు: కేంద్రం

దేశంలో ఔషధాల కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనాపై పోరాటానికి కావాల్సిన వైద్య పరికరాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.

"వైద్య పరికరాలు, ఔషధాల... తయారీ, పంపిణీపై ప్రభుత్వం పూర్తి శ్రద్ధ చూపుతోంది."

- డి.వి.సదానంద గౌడ, కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి

కొరత లేదు... భయం లేదు..

గత ఐదు రోజుల్లో 62 లైఫ్​లైన్ ఉడాన్ విమానాలు 15.4 టన్నులకు పైగా అవసరమైన వైద్య సామగ్రిని రవాణా చేశాయని సదానంద గౌడ తెలిపారు. వైద్య పరికరాలు, ఔషధాల తయారీ కోసం సెజ్​లోని 200 యూనిట్లు నిరంతరాయంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు. ఈ వైద్య సామగ్రి పంపిణీని నిశితంగా పర్యవేక్షించడానికి, లాజిస్టిక్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం ఓ కంట్రోల్​ రూమ్​ను ఏర్పాటు చేసిందని చెప్పారు సదానంద.

ఉత్పత్తి చేయాల్సిందే..

నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్​పీపీఏ)... అవసరమైన ఔషధాలను తగినంతగా ఉత్పత్తి చేసి, వాటిని అందుబాటులో ఉంచాలని తయారీదారులను ఆదేశించింది. ఎన్​పీపీఏ ఇంతకు ముందు ... ఎఫ్​డీసీ లోపినావిర్​, రిటోనావిర్​ (200 ఎమ్​జీ+50 మి.గ్రా), హైడ్రాక్సీ క్లోరోక్విన్ (200 మి.గ్రా& 400 మి.గ్రా) అజిత్రోమైసిన్ (200 మి.గ్రా & 500 మి.గ్రా), పారాసెటమాల్​ (500 మి.గ్రా) తయారీదారులు తమ వద్ద ఈ ఔషధాల నిల్వలు ఎన్ని ఉన్నాయో తెలపాలని ఆదేశించింది కూడా.

"దేశంలో తగినంత స్థాయిలో హైడ్రాక్సీ క్లోరోక్విన్​, అజిత్రోమైసిన్ ఔషధ నిల్వలు ఉన్నాయి. అవసరమైతే, కంపెనీలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి." - సుదర్శన్​ జైన్​, ఫార్మాసూటికల్ అలయన్స్ సెక్రటరీ జనరల్​

ఇదీ చూడండి: 'ఆ 2 ఘటనలు కరోనాపై పోరులో ఎదురుదెబ్బలు'

దేశంలో ఔషధాల కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనాపై పోరాటానికి కావాల్సిన వైద్య పరికరాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.

"వైద్య పరికరాలు, ఔషధాల... తయారీ, పంపిణీపై ప్రభుత్వం పూర్తి శ్రద్ధ చూపుతోంది."

- డి.వి.సదానంద గౌడ, కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి

కొరత లేదు... భయం లేదు..

గత ఐదు రోజుల్లో 62 లైఫ్​లైన్ ఉడాన్ విమానాలు 15.4 టన్నులకు పైగా అవసరమైన వైద్య సామగ్రిని రవాణా చేశాయని సదానంద గౌడ తెలిపారు. వైద్య పరికరాలు, ఔషధాల తయారీ కోసం సెజ్​లోని 200 యూనిట్లు నిరంతరాయంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు. ఈ వైద్య సామగ్రి పంపిణీని నిశితంగా పర్యవేక్షించడానికి, లాజిస్టిక్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం ఓ కంట్రోల్​ రూమ్​ను ఏర్పాటు చేసిందని చెప్పారు సదానంద.

ఉత్పత్తి చేయాల్సిందే..

నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్​పీపీఏ)... అవసరమైన ఔషధాలను తగినంతగా ఉత్పత్తి చేసి, వాటిని అందుబాటులో ఉంచాలని తయారీదారులను ఆదేశించింది. ఎన్​పీపీఏ ఇంతకు ముందు ... ఎఫ్​డీసీ లోపినావిర్​, రిటోనావిర్​ (200 ఎమ్​జీ+50 మి.గ్రా), హైడ్రాక్సీ క్లోరోక్విన్ (200 మి.గ్రా& 400 మి.గ్రా) అజిత్రోమైసిన్ (200 మి.గ్రా & 500 మి.గ్రా), పారాసెటమాల్​ (500 మి.గ్రా) తయారీదారులు తమ వద్ద ఈ ఔషధాల నిల్వలు ఎన్ని ఉన్నాయో తెలపాలని ఆదేశించింది కూడా.

"దేశంలో తగినంత స్థాయిలో హైడ్రాక్సీ క్లోరోక్విన్​, అజిత్రోమైసిన్ ఔషధ నిల్వలు ఉన్నాయి. అవసరమైతే, కంపెనీలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి." - సుదర్శన్​ జైన్​, ఫార్మాసూటికల్ అలయన్స్ సెక్రటరీ జనరల్​

ఇదీ చూడండి: 'ఆ 2 ఘటనలు కరోనాపై పోరులో ఎదురుదెబ్బలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.