ETV Bharat / bharat

పాలకుడికి అహంకారం తగదు: సోనియా

author img

By

Published : Oct 25, 2020, 5:47 PM IST

పాలకుడి జీవితంలో అహంకారం, వాగ్దానాల ఉల్లంఘనకు చోటుండకూడదని దసరా సందర్భంగా సందేశం ఇచ్చారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ.

sonia gandhi news
పాలకుడికి అహంకారం తగదు: సోనియాగాంధీ

పాలనలో ప్రజలే అత్యున్నతమని.. పాలకుడి జీవితంలో అహంకారం, అబద్ధాలు, వాగ్దానాల విస్మరించే తత్వం ఉండకూడదని విజయదశమి సందర్భంగా సందేశమిచ్చారు కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ. పండుగ సందర్భంగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

" అన్యాయంపై న్యాయం, అబద్ధంపై నిజం, అహంకారంపై వివేకం గెలుపునకు నిదర్శనమే దసరా. తొమ్మిది రోజుల పూజల తర్వాత ఏ పరిస్థితుల్లోనైనా పనిచేసే కొత్త సంకల్పం పుట్టుకొస్తుంది.

ప్రజాస్వామ్య పాలనలో ప్రజలే అత్యున్నతం. ఒక పాలకుడి జీవితంలో అహంకారం, అబద్ధం, వాగ్ధానాల ఉల్లంఘనకు చోటులేదు. ఇదే విజయదశమి ఇచ్చే అతిపెద్ద సందేశం".

--సోనియా గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షురాలు

ఈ దసరా ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సును తీసుకురావడమే కాకుండా ప్రజల మధ్య సామరస్యాన్ని, సాంస్కృతిక విలువలను మరింత బలోపేతం చేస్తుందని సోనియా ఆకాంక్షించారు. ఈ పండుగ రోజుల్లో కరోనా సోకకుండా అందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ.. ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. సత్యమే ఎప్పటికైనా గెలుస్తుందని అన్నారు. వీళ్లతో పాటు ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​, పార్టీ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా, ప్రియాంకా గాంధీ సహా పలువురు సీనియర్​ నేతలు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

పాలనలో ప్రజలే అత్యున్నతమని.. పాలకుడి జీవితంలో అహంకారం, అబద్ధాలు, వాగ్దానాల విస్మరించే తత్వం ఉండకూడదని విజయదశమి సందర్భంగా సందేశమిచ్చారు కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ. పండుగ సందర్భంగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

" అన్యాయంపై న్యాయం, అబద్ధంపై నిజం, అహంకారంపై వివేకం గెలుపునకు నిదర్శనమే దసరా. తొమ్మిది రోజుల పూజల తర్వాత ఏ పరిస్థితుల్లోనైనా పనిచేసే కొత్త సంకల్పం పుట్టుకొస్తుంది.

ప్రజాస్వామ్య పాలనలో ప్రజలే అత్యున్నతం. ఒక పాలకుడి జీవితంలో అహంకారం, అబద్ధం, వాగ్ధానాల ఉల్లంఘనకు చోటులేదు. ఇదే విజయదశమి ఇచ్చే అతిపెద్ద సందేశం".

--సోనియా గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షురాలు

ఈ దసరా ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సును తీసుకురావడమే కాకుండా ప్రజల మధ్య సామరస్యాన్ని, సాంస్కృతిక విలువలను మరింత బలోపేతం చేస్తుందని సోనియా ఆకాంక్షించారు. ఈ పండుగ రోజుల్లో కరోనా సోకకుండా అందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ.. ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. సత్యమే ఎప్పటికైనా గెలుస్తుందని అన్నారు. వీళ్లతో పాటు ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​, పార్టీ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా, ప్రియాంకా గాంధీ సహా పలువురు సీనియర్​ నేతలు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.