ETV Bharat / bharat

నిర్భయ దోషికి షాక్... పిటిషన్​ను కొట్టివేసిన దిల్లీ హైకోర్టు

author img

By

Published : Mar 18, 2020, 5:53 PM IST

Updated : Mar 18, 2020, 11:37 PM IST

nirbhaya
నిర్భయ

23:13 March 18

ఉరిశిక్షకు సర్వం సిద్ధం!

నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఉరి తీసేందుకు తలారి పవన్ జల్లాడ్ ఆధ్వర్యంలో ట్రయల్స్ నిర్వహించారు. ఉరిలో ఉపయోగించే మనీలా తాళ్లను పరీక్షించారు. ఒకే కేసుకు సంబంధించిన నలుగురు దోషుల్ని ఒకేసారి ఉరితీయడం తిహార్ జైలు చరిత్రలో ఇదే తొలిసారి కానుంది. దోషులు తమ న్యాయపరమైన అవకాశాలను ఉపయోగించుకోలేదన్న కారణాలతో ఉరిశిక్ష ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది.

హైకోర్టు విచారణ

దిల్లీ హైకోర్టు బుధవారం ముకేశ్ అభ్యర్థనను కొట్టిపారేసింది. నిర్భయ ఘటన జరిగినప్పుడు తాను దిల్లీలో లేనన్న పిటిషన్​ను తోసిపుచ్చింది. ఈ వ్యాజ్యాన్ని ఇదివరకే ట్రయల్ కోర్టు కొట్టేయగా... ఆ తీర్పును సవాల్ చేస్తూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు ముకేశ్. దోషి అభ్యర్థనను రుజువు చేసే ఆధారాలేవీ లేవని కేసు విచారించిన దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బ్రిజేష్ సేథీ పేర్కొన్నారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో ఎలాంటి అవకతవకలు, చట్టవిరుద్ధమైన అంశాలు లేవని స్పష్టం చేశారు.

దిల్లీ కోర్టు విచారణ

మరోవైపు రెండో క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్​లో ఉన్న కారణంగా ఉరిశిక్షను నిలిపివేయాలని నిర్భయ దోషులు దిల్లీ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన అదనపు సెషన్స్ జడ్జి జస్టిస్ ధర్మేంద్ర రాణా నేతృత్వంలోని ధర్మాసనం... తిహార్ జైలు అధికారులు సహా పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

ఉరిశిక్షకు ఒక్క రోజు(కోర్టు పనిదినాల ప్రకారం) మిగిలి ఉన్న సమయంలో వ్యాజ్యాన్ని దాఖలు చేయడానికి కారణాలేంటని దోషుల తరపు న్యాయవాది ఏపీ సింగ్​ను ధర్మాసనం ప్రశ్నించింది.

దీనికి స్పందించిన సింగ్.. దోషులకు సంబంధించి వివిధ కేసులు పెండింగ్​లో ఉన్నాయని కోర్టుకు వివరించారు. అక్షయ్, పవన్​ల క్షమాభిక్ష పిటిషన్​లు రాష్ట్రపతి వద్ద, అక్షయ్ భార్య వేసిన విడాకుల పిటిషన్ బిహార్ కోర్టులో పెండింగ్​లో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఉరిశిక్ష తేదీ అయిన మార్చి 20ని పక్కనబెట్టాలని ధర్మాసనాన్ని కోరారు. 

ఈ కేసుకు సంబంధించి తదుపరి వాదనలు గురువారానికి వాయిదా వేసింది ధర్మాసనం.

20:30 March 18

నిర్భయ దోషి ముకేష్​కు చుక్కెదురైంది. నిర్భయ ఘటన జరిగినప్పుడు తాను దిల్లీలో లేనన్న పిటిషన్​ను దిల్లీ హైకోర్టు సైతం కొట్టిపారేసింది. ఈ వ్యాజ్యాన్ని ఇదివరకే ట్రయల్ కోర్టు కొట్టేయగా... ఆ తీర్పును సవాల్ చేస్తూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు ముకేశ్. దోషి అభ్యర్థనను రుజువు చేసే ఆధారాలేవీ లేవని జస్టిస్ బ్రిజేష్ సేతీ పేర్కొన్నారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో ఎలాంటి అవకతవకలు, చట్టవిరుద్ధమైన అంశాలు లేవని స్పష్టం చేశారు. 

16:58 March 18

ఉరి శిక్ష నిలుపుదలపై తిహార్ అధికారులకు నోటీసులు

నిర్భయ హత్యాచార ఘటన సమయంలో తాను దిల్లీలోనే లేనన్న వ్యాజ్యాన్ని ట్రయల్​ కోర్టు కొట్టివేయడాన్ని సవాల్​ చేస్తూ దోషి ముకేశ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్​పై దిల్లీ హైకోర్టు తన తీర్పును రిజర్వు చేసింది. దిల్లీ ప్రభుత్వ వాదనలు విన్న తర్వాత జస్టిస్ బ్రిజేష్ సేథీ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు రిజర్వు చేస్తున్నట్లు తెలిపింది.

శిక్ష నిలిపివేయాలని పిటిషన్

నిర్భయ దోషులు రెండోసారి దాఖలు చేసుకున్నక్యురేటివ్​, క్షమాభిక్ష పిటిషన్లు పెండింగ్​లో ఉన్నందున ఉరి శిక్షను నిలుపుదల చేయాలని న్యాయవాది వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన అదనపు సెషన్స్ జడ్జి జస్టిస్ ధర్మేంద్ర రాణా నేతృత్వంలోని ధర్మాసనం... తిహార్ జైలు అధికారులు సహా పోలీసులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి వాదనలు రేపటికి వాయిదా వేసింది.

మంగళవారం.. అక్షయ్ సింగ్ రెండో క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయగా.. మరో దోషి పవన్ గుప్తా సుప్రీంలో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో నిర్భయ దోషుల ఉరి శిక్షపై మరోసారి అనిశ్చితి ఏర్పడింది.

మార్చి 20న ఉరి!

ఇప్పటికే నలుగురు దోషుల ఉరికి సర్వం సిద్ధం చేశారు తిహార్​ అధికారులు. దిల్లీ కోర్టు ఆదేశాల ప్రకారం ముకేశ్​ కుమార్​ సింగ్​(32), పవన్​ గుప్తా(25), వినయ్​ శర్మ (26), అక్షయ్​ కుమార్​ సింగ్​(31)లను ఈ నెల 20న ఉదయం 5.30 గంటలకు ఉరి తీయాల్సి ఉంది.

23:13 March 18

ఉరిశిక్షకు సర్వం సిద్ధం!

నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఉరి తీసేందుకు తలారి పవన్ జల్లాడ్ ఆధ్వర్యంలో ట్రయల్స్ నిర్వహించారు. ఉరిలో ఉపయోగించే మనీలా తాళ్లను పరీక్షించారు. ఒకే కేసుకు సంబంధించిన నలుగురు దోషుల్ని ఒకేసారి ఉరితీయడం తిహార్ జైలు చరిత్రలో ఇదే తొలిసారి కానుంది. దోషులు తమ న్యాయపరమైన అవకాశాలను ఉపయోగించుకోలేదన్న కారణాలతో ఉరిశిక్ష ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది.

హైకోర్టు విచారణ

దిల్లీ హైకోర్టు బుధవారం ముకేశ్ అభ్యర్థనను కొట్టిపారేసింది. నిర్భయ ఘటన జరిగినప్పుడు తాను దిల్లీలో లేనన్న పిటిషన్​ను తోసిపుచ్చింది. ఈ వ్యాజ్యాన్ని ఇదివరకే ట్రయల్ కోర్టు కొట్టేయగా... ఆ తీర్పును సవాల్ చేస్తూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు ముకేశ్. దోషి అభ్యర్థనను రుజువు చేసే ఆధారాలేవీ లేవని కేసు విచారించిన దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బ్రిజేష్ సేథీ పేర్కొన్నారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో ఎలాంటి అవకతవకలు, చట్టవిరుద్ధమైన అంశాలు లేవని స్పష్టం చేశారు.

దిల్లీ కోర్టు విచారణ

మరోవైపు రెండో క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్​లో ఉన్న కారణంగా ఉరిశిక్షను నిలిపివేయాలని నిర్భయ దోషులు దిల్లీ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన అదనపు సెషన్స్ జడ్జి జస్టిస్ ధర్మేంద్ర రాణా నేతృత్వంలోని ధర్మాసనం... తిహార్ జైలు అధికారులు సహా పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

ఉరిశిక్షకు ఒక్క రోజు(కోర్టు పనిదినాల ప్రకారం) మిగిలి ఉన్న సమయంలో వ్యాజ్యాన్ని దాఖలు చేయడానికి కారణాలేంటని దోషుల తరపు న్యాయవాది ఏపీ సింగ్​ను ధర్మాసనం ప్రశ్నించింది.

దీనికి స్పందించిన సింగ్.. దోషులకు సంబంధించి వివిధ కేసులు పెండింగ్​లో ఉన్నాయని కోర్టుకు వివరించారు. అక్షయ్, పవన్​ల క్షమాభిక్ష పిటిషన్​లు రాష్ట్రపతి వద్ద, అక్షయ్ భార్య వేసిన విడాకుల పిటిషన్ బిహార్ కోర్టులో పెండింగ్​లో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఉరిశిక్ష తేదీ అయిన మార్చి 20ని పక్కనబెట్టాలని ధర్మాసనాన్ని కోరారు. 

ఈ కేసుకు సంబంధించి తదుపరి వాదనలు గురువారానికి వాయిదా వేసింది ధర్మాసనం.

20:30 March 18

నిర్భయ దోషి ముకేష్​కు చుక్కెదురైంది. నిర్భయ ఘటన జరిగినప్పుడు తాను దిల్లీలో లేనన్న పిటిషన్​ను దిల్లీ హైకోర్టు సైతం కొట్టిపారేసింది. ఈ వ్యాజ్యాన్ని ఇదివరకే ట్రయల్ కోర్టు కొట్టేయగా... ఆ తీర్పును సవాల్ చేస్తూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు ముకేశ్. దోషి అభ్యర్థనను రుజువు చేసే ఆధారాలేవీ లేవని జస్టిస్ బ్రిజేష్ సేతీ పేర్కొన్నారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో ఎలాంటి అవకతవకలు, చట్టవిరుద్ధమైన అంశాలు లేవని స్పష్టం చేశారు. 

16:58 March 18

ఉరి శిక్ష నిలుపుదలపై తిహార్ అధికారులకు నోటీసులు

నిర్భయ హత్యాచార ఘటన సమయంలో తాను దిల్లీలోనే లేనన్న వ్యాజ్యాన్ని ట్రయల్​ కోర్టు కొట్టివేయడాన్ని సవాల్​ చేస్తూ దోషి ముకేశ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్​పై దిల్లీ హైకోర్టు తన తీర్పును రిజర్వు చేసింది. దిల్లీ ప్రభుత్వ వాదనలు విన్న తర్వాత జస్టిస్ బ్రిజేష్ సేథీ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు రిజర్వు చేస్తున్నట్లు తెలిపింది.

శిక్ష నిలిపివేయాలని పిటిషన్

నిర్భయ దోషులు రెండోసారి దాఖలు చేసుకున్నక్యురేటివ్​, క్షమాభిక్ష పిటిషన్లు పెండింగ్​లో ఉన్నందున ఉరి శిక్షను నిలుపుదల చేయాలని న్యాయవాది వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన అదనపు సెషన్స్ జడ్జి జస్టిస్ ధర్మేంద్ర రాణా నేతృత్వంలోని ధర్మాసనం... తిహార్ జైలు అధికారులు సహా పోలీసులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి వాదనలు రేపటికి వాయిదా వేసింది.

మంగళవారం.. అక్షయ్ సింగ్ రెండో క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయగా.. మరో దోషి పవన్ గుప్తా సుప్రీంలో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో నిర్భయ దోషుల ఉరి శిక్షపై మరోసారి అనిశ్చితి ఏర్పడింది.

మార్చి 20న ఉరి!

ఇప్పటికే నలుగురు దోషుల ఉరికి సర్వం సిద్ధం చేశారు తిహార్​ అధికారులు. దిల్లీ కోర్టు ఆదేశాల ప్రకారం ముకేశ్​ కుమార్​ సింగ్​(32), పవన్​ గుప్తా(25), వినయ్​ శర్మ (26), అక్షయ్​ కుమార్​ సింగ్​(31)లను ఈ నెల 20న ఉదయం 5.30 గంటలకు ఉరి తీయాల్సి ఉంది.

Last Updated : Mar 18, 2020, 11:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.