ETV Bharat / bharat

'నిర్భయ' దోషులకు ఉరి ప్రక్రియ సాగనుందిలా..

author img

By

Published : Mar 19, 2020, 6:48 PM IST

ఉరి... భారత్​లో అత్యంత అరుదైన కేసుల్లో పడే శిక్ష. న్యాయస్థానాలు మరణదండన విధించినా అమలయ్యేది అతికొద్ది కేసుల్లోనే. అనేక సంవత్సరాల తర్వాత ఇప్పుడు నిర్భయ దోషుల్ని ఉరి తీయబోతున్నారు. అసలు ఈ ప్రక్రియ అంతా ఎలా సాగుతుంది?

Nirbhaya convicts death sentence process
'నిర్భయ' దోషులకు ఉరి ప్రక్రియ సాగనుందిలా..

ఉరిశిక్ష.. ఈ పేరు వినడమేగానీ ఎలా అమలు చేస్తారనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అప్పుడప్పుడు సినిమాల్లో చూసి.. నిజజీవితంలోనూ అదే విధంగానే ఖైదీలను ఉరితీస్తారేమో అనుకుంటాం. అయితే కారాగారంలో ఓ ఖైదీని ఉరి తీయాలంటే జైలు అధికారులకు ఎన్నో నిబంధనలుంటాయి. అవేంటంటే..

ఉరిశిక్ష అమలు ఇలా...

⦁ సూపరింటెండెంట్​, డిప్యూటీ సూపరింటెండెంట్​, ఇంఛార్జ్​ వైద్యాధికారి​, రెసిడెంట్ వైద్యాధికారి, జిల్లా కలెక్టర్​ లేదా అదనపు కలెక్టర్​ సమక్షంలో ఉరిశిక్ష అమలవుతుంది.

⦁ ఉరిశిక్ష అమలుకు ఒక్కరోజు ముందు ఉరితాళ్లతో పాటు ఉరికంబాన్ని పరీక్షించే ప్రక్రియను జైలు సూపరింటెండెంట్ దగ్గరుండి పర్యవేక్షిస్తారు.

⦁ అనంతరం ఖైదీల బరువుకు 1.5 ఇంతలు బరువుండే ఇసుక బస్తా​ను ఉరికంబం నుంచి 1.830 నుంచి 2.440 మీటర్ల వరకు కిందకు వదిలి ఉరితాడును పరీక్షిస్తారు.

⦁ ఉరిశిక్ష అమలు ప్రాంతంలో 10 మందికి తక్కువ కాకుండా కానిస్టేబుళ్లు, వార్డెన్లు, ఇద్దరు హెడ్​ కానిస్టేబుళ్లు, హెడ్​ వార్డెన్లు, అదే సంఖ్యలో జైలు సాయుధ గార్డులు ఉంటారు.

⦁ ఉరిశిక్షను చూసేందుకు దోషుల కుటుంబసభ్యులను అనుమతించరు.

⦁ ఒకవేళ ఖైదీ కోరుకుంటే అతనికి నమ్మకమున్న పూజారిని ఉరిశిక్ష చూసేందుకు అనుమతిస్తారు.

⦁ ఒకరి ఉరిశిక్ష పూర్తయి, మృతదేహాన్ని ఉరికంబం నుంచి తీసేంత వరకు మిగతా దోషులను జైలు గదుల్లోనే ఉంచుతారు.

⦁ ఖైదీల ఆరోగ్య పరిస్థితిని ఉరిశిక్ష తేదీకి నాలుగురోజుల మందే డాక్టర్లు పర్యవేక్షిస్తారు. ఖైదీని ఉరికంబం నుంచి కిందకు ఎంత దూరం వేలాడదీయాలో వైద్యులే సూచిస్తారు.

⦁ ఒక్కో ఖైదీకి రెండు జతల ఉరితాళ్లు సిద్ధం చేస్తారు. వాటిని పరీక్షించిన అనంతరం తాళ్లతో పాటు ఇతర ఉరి సామగ్రిని స్టీలు పెట్టె​లో పెట్టి తాళం వేస్తారు. ఆ పెట్టెను జైలు సూపరింటెండెంట్​ ఆధీనంలో ఉంచుతారు.

⦁ సూపరింటెండెంట్​, జిల్లా కలెక్టర్​, వైద్యాధికారి బృందం ఉరిశిక్ష అమలయ్యేనాటి ఉదయమే ఖైదీలను పర్యవేక్షిస్తారు.

⦁ ఉరికంబాన్ని ఎక్కేముందు.. ఖైదీలు ఉరితాడును చూడకుండా అతని ముఖాన్ని గుడ్డతో కప్పేస్తారు.

⦁ ఉరికంబంపై జైలు వార్డెన్లు ఖైదీని పట్టుకుని ఉంటారు. ఆ తర్వాత జైలు సూపరింటెండెంట్​ ఆదేశానుసారం ఉరిశిక్ష అమలు చేస్తారు.

⦁ పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగిస్తారు.

⦁ ఖైదీల మృతదేహాలను స్మశానవాటికకు తరలించేందుకు అంబులెన్స్​ను వినియోగిస్తారు.

ఉరిశిక్ష.. ఈ పేరు వినడమేగానీ ఎలా అమలు చేస్తారనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అప్పుడప్పుడు సినిమాల్లో చూసి.. నిజజీవితంలోనూ అదే విధంగానే ఖైదీలను ఉరితీస్తారేమో అనుకుంటాం. అయితే కారాగారంలో ఓ ఖైదీని ఉరి తీయాలంటే జైలు అధికారులకు ఎన్నో నిబంధనలుంటాయి. అవేంటంటే..

ఉరిశిక్ష అమలు ఇలా...

⦁ సూపరింటెండెంట్​, డిప్యూటీ సూపరింటెండెంట్​, ఇంఛార్జ్​ వైద్యాధికారి​, రెసిడెంట్ వైద్యాధికారి, జిల్లా కలెక్టర్​ లేదా అదనపు కలెక్టర్​ సమక్షంలో ఉరిశిక్ష అమలవుతుంది.

⦁ ఉరిశిక్ష అమలుకు ఒక్కరోజు ముందు ఉరితాళ్లతో పాటు ఉరికంబాన్ని పరీక్షించే ప్రక్రియను జైలు సూపరింటెండెంట్ దగ్గరుండి పర్యవేక్షిస్తారు.

⦁ అనంతరం ఖైదీల బరువుకు 1.5 ఇంతలు బరువుండే ఇసుక బస్తా​ను ఉరికంబం నుంచి 1.830 నుంచి 2.440 మీటర్ల వరకు కిందకు వదిలి ఉరితాడును పరీక్షిస్తారు.

⦁ ఉరిశిక్ష అమలు ప్రాంతంలో 10 మందికి తక్కువ కాకుండా కానిస్టేబుళ్లు, వార్డెన్లు, ఇద్దరు హెడ్​ కానిస్టేబుళ్లు, హెడ్​ వార్డెన్లు, అదే సంఖ్యలో జైలు సాయుధ గార్డులు ఉంటారు.

⦁ ఉరిశిక్షను చూసేందుకు దోషుల కుటుంబసభ్యులను అనుమతించరు.

⦁ ఒకవేళ ఖైదీ కోరుకుంటే అతనికి నమ్మకమున్న పూజారిని ఉరిశిక్ష చూసేందుకు అనుమతిస్తారు.

⦁ ఒకరి ఉరిశిక్ష పూర్తయి, మృతదేహాన్ని ఉరికంబం నుంచి తీసేంత వరకు మిగతా దోషులను జైలు గదుల్లోనే ఉంచుతారు.

⦁ ఖైదీల ఆరోగ్య పరిస్థితిని ఉరిశిక్ష తేదీకి నాలుగురోజుల మందే డాక్టర్లు పర్యవేక్షిస్తారు. ఖైదీని ఉరికంబం నుంచి కిందకు ఎంత దూరం వేలాడదీయాలో వైద్యులే సూచిస్తారు.

⦁ ఒక్కో ఖైదీకి రెండు జతల ఉరితాళ్లు సిద్ధం చేస్తారు. వాటిని పరీక్షించిన అనంతరం తాళ్లతో పాటు ఇతర ఉరి సామగ్రిని స్టీలు పెట్టె​లో పెట్టి తాళం వేస్తారు. ఆ పెట్టెను జైలు సూపరింటెండెంట్​ ఆధీనంలో ఉంచుతారు.

⦁ సూపరింటెండెంట్​, జిల్లా కలెక్టర్​, వైద్యాధికారి బృందం ఉరిశిక్ష అమలయ్యేనాటి ఉదయమే ఖైదీలను పర్యవేక్షిస్తారు.

⦁ ఉరికంబాన్ని ఎక్కేముందు.. ఖైదీలు ఉరితాడును చూడకుండా అతని ముఖాన్ని గుడ్డతో కప్పేస్తారు.

⦁ ఉరికంబంపై జైలు వార్డెన్లు ఖైదీని పట్టుకుని ఉంటారు. ఆ తర్వాత జైలు సూపరింటెండెంట్​ ఆదేశానుసారం ఉరిశిక్ష అమలు చేస్తారు.

⦁ పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగిస్తారు.

⦁ ఖైదీల మృతదేహాలను స్మశానవాటికకు తరలించేందుకు అంబులెన్స్​ను వినియోగిస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.