ETV Bharat / bharat

కేంద్ర హోంశాఖ, రైల్వేకు ఎన్​హెచ్​ఆర్సీ నోటీసులు

author img

By

Published : May 28, 2020, 10:09 PM IST

కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రైల్వే శాఖ​, గుజరాత్, బిహార్​ రాష్ట్ర ప్రభుత్వాలకు జాతీయ మానవహక్కుల కమిషన్​ నోటీసులు జారీ చేసింది. రైళ్లలో వలస కూలీలకు కనీస సదుపాయాలు కల్పించలేదని, పలువురు కూలీల ప్రాణాలను కాపాడలేక పోయారని పేర్కొంది. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని తెలిపింది.

NHRC notices to Union Home Secy, Rlys, Guj and Bihar govts over migrants hardships in trains
పేద కూలీల ప్రాణాలు కాపాడలేకపోయారని నోటీసులు

శ్రామిక్​ రైళ్లలో వలస కూలీలకు ఆహారం, నీరు వంటి కనీస సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేదని పేర్కొంటూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రైల్వేశాఖ సహా గుజరాత్​, బిహార్ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది జాతీయ మానవ హక్కుల కమిషన్ ​(ఎన్​హెచ్​ఆర్​సీ). తిండిలేక కొంత మంది అనారోగ్యానికి గురయ్యారని, ఆకలి కేకలతో అలమటించి పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారని తెలిపింది.

శ్రామిక్​ రైళ్లు రోజుల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయని, అందులో ప్రయాణిస్తున్న వలస కూలీలు ఎన్నో కష్టాలు పడుతున్నారని పత్రికలో వచ్చిన వార్తను సుమోటోగా స్వీకరించింది ఎన్​హెచ్​ఆర్సీ. వివరణ ఇవ్వాలని కేంద్రం, రెండు రాష్ట్రాలను కోరింది. పేద ప్రజల ప్రాణాలను కాపాడలేక పోయారని పేర్కొంది.

బిహార్​లోని ముజఫర్​ఫుర్​లో ఇద్దరు.. దనాపుర్​, ససరాం, గయా, బెగుసరాయ్, జెహానాబాద్​లో ఒక్కొక్క వలస కూలీ మృతి చెందినట్లు ఎన్​హెచ్​ఆర్సీ నివేదికలో వెల్లడించింది. వీరిలో నాలుగేళ్ల బాలుడు కూడా ఉన్నట్లు తెలిపింది. గుజరాత్ సూరత్​ నుంచి మే 16న బయలుదేరిన ఓ రైలు 9 రోజుల తర్వాత ఆలస్యంగా మే 25న బిహార్​లోని శివాన్ చేరుకున్నట్లు పేర్కొంది.

మీడియాలో వచ్చిన ఈ వార్తలు నిజమైతే అది కచ్చితంగా మానవహక్కుల ఉల్లంఘనే అవుతుందని ఎన్​హెచ్​ఆర్సీ స్పష్టం చేసింది. ఆయా కుటుంబాలకు జరిగిన నష్టం భర్తీ చేయలేమని వ్యాఖ్యానించింది. రైళ్లలో వలసకూలీలకు కనీస సదుపాయాలు సహా వైద్య సాయం అందే ఏర్పాట్లకు సంబంధించి తీసుకున్న చర్యలపై గుజరాత్, బిహార్ ప్రభుత్వాలు వివరణ ఇవ్వాలని తెలిపింది. నాలుగు వారాల్లోగా సంబంధిత అధికారులు స్పందించాలని పేర్కొంది.

శ్రామిక్​ రైళ్లలో వలస కూలీలకు ఆహారం, నీరు వంటి కనీస సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేదని పేర్కొంటూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రైల్వేశాఖ సహా గుజరాత్​, బిహార్ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది జాతీయ మానవ హక్కుల కమిషన్ ​(ఎన్​హెచ్​ఆర్​సీ). తిండిలేక కొంత మంది అనారోగ్యానికి గురయ్యారని, ఆకలి కేకలతో అలమటించి పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారని తెలిపింది.

శ్రామిక్​ రైళ్లు రోజుల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయని, అందులో ప్రయాణిస్తున్న వలస కూలీలు ఎన్నో కష్టాలు పడుతున్నారని పత్రికలో వచ్చిన వార్తను సుమోటోగా స్వీకరించింది ఎన్​హెచ్​ఆర్సీ. వివరణ ఇవ్వాలని కేంద్రం, రెండు రాష్ట్రాలను కోరింది. పేద ప్రజల ప్రాణాలను కాపాడలేక పోయారని పేర్కొంది.

బిహార్​లోని ముజఫర్​ఫుర్​లో ఇద్దరు.. దనాపుర్​, ససరాం, గయా, బెగుసరాయ్, జెహానాబాద్​లో ఒక్కొక్క వలస కూలీ మృతి చెందినట్లు ఎన్​హెచ్​ఆర్సీ నివేదికలో వెల్లడించింది. వీరిలో నాలుగేళ్ల బాలుడు కూడా ఉన్నట్లు తెలిపింది. గుజరాత్ సూరత్​ నుంచి మే 16న బయలుదేరిన ఓ రైలు 9 రోజుల తర్వాత ఆలస్యంగా మే 25న బిహార్​లోని శివాన్ చేరుకున్నట్లు పేర్కొంది.

మీడియాలో వచ్చిన ఈ వార్తలు నిజమైతే అది కచ్చితంగా మానవహక్కుల ఉల్లంఘనే అవుతుందని ఎన్​హెచ్​ఆర్సీ స్పష్టం చేసింది. ఆయా కుటుంబాలకు జరిగిన నష్టం భర్తీ చేయలేమని వ్యాఖ్యానించింది. రైళ్లలో వలసకూలీలకు కనీస సదుపాయాలు సహా వైద్య సాయం అందే ఏర్పాట్లకు సంబంధించి తీసుకున్న చర్యలపై గుజరాత్, బిహార్ ప్రభుత్వాలు వివరణ ఇవ్వాలని తెలిపింది. నాలుగు వారాల్లోగా సంబంధిత అధికారులు స్పందించాలని పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.