ETV Bharat / bharat

కేంద్రప్రభుత్వంలో 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు అవకాశం

author img

By

Published : Nov 21, 2019, 4:39 PM IST

2018 మార్చి 1 నాటికి కేంద్రంలో సుమారు 7 లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈమేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

RSQ-VACANCIES

కేంద్రప్రభుత్వ పరిధిలో భారీ ఎత్తున ఉద్యోగాల ఖాళీలు ఏర్పడినట్లు రాజ్యసభకు తెలిపింది ఎన్డీఏ సర్కార్. గతేడాది మార్చి 1 నాటికి సుమారు 7 లక్షల ఖాళీలు ఉన్నట్లు సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు.

జితేంద్రసింగ్ తెలిపిన సమాచారం మేరకు మొత్తం 6,83,823 ఖాళీలు ఉన్నాయి. ఇందులో గ్రూప్-సీ స్థాయివే అత్యధికం.

  • గ్రూప్​ సీ - 5,74,289
  • గ్రూప్ బీ - 89,638
  • గ్రూప్ ఏ - 19,896

ఈ ఖాళీలకు సంబంధించి 1,05,338 ఉద్యోగాలకు నియామక ప్రక్రియను ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. మరో 4,08,591 ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియ ఎస్​ఎస్​సీ, ఆర్​ఆర్​బీ చేపడుతున్నాయని వివరించారు.

నియామక ప్రక్రియలో జాప్యాన్ని నివారించేందుకు కంప్యూటర్​ బేస్​డ్​ పరీక్షలను నియామక సంస్థలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాన్​ గెజిటెడ్​ ఉద్యోగాలకు ముఖాముఖిని రద్దు చేసినట్లు చెప్పారు.

ఇదీ చూడండి: కశ్మీర్​ ఆంక్షల గుప్పెట్లో లేదు: సుప్రీంకు కేంద్రం వివరణ

కేంద్రప్రభుత్వ పరిధిలో భారీ ఎత్తున ఉద్యోగాల ఖాళీలు ఏర్పడినట్లు రాజ్యసభకు తెలిపింది ఎన్డీఏ సర్కార్. గతేడాది మార్చి 1 నాటికి సుమారు 7 లక్షల ఖాళీలు ఉన్నట్లు సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు.

జితేంద్రసింగ్ తెలిపిన సమాచారం మేరకు మొత్తం 6,83,823 ఖాళీలు ఉన్నాయి. ఇందులో గ్రూప్-సీ స్థాయివే అత్యధికం.

  • గ్రూప్​ సీ - 5,74,289
  • గ్రూప్ బీ - 89,638
  • గ్రూప్ ఏ - 19,896

ఈ ఖాళీలకు సంబంధించి 1,05,338 ఉద్యోగాలకు నియామక ప్రక్రియను ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. మరో 4,08,591 ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియ ఎస్​ఎస్​సీ, ఆర్​ఆర్​బీ చేపడుతున్నాయని వివరించారు.

నియామక ప్రక్రియలో జాప్యాన్ని నివారించేందుకు కంప్యూటర్​ బేస్​డ్​ పరీక్షలను నియామక సంస్థలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాన్​ గెజిటెడ్​ ఉద్యోగాలకు ముఖాముఖిని రద్దు చేసినట్లు చెప్పారు.

ఇదీ చూడండి: కశ్మీర్​ ఆంక్షల గుప్పెట్లో లేదు: సుప్రీంకు కేంద్రం వివరణ

New Delhi, Nov 21 (ANI): Congress leader and Rajya Sabha MP Shashi Tharoor reacted over ongoing debates on electoral bonds. He said that something is rotten in this stage. He said, "When electoral bonds were introduced, many of us had raised serious objections about how it could easily become a way for rich corporations and individuals to influence improperly political parties, particularly the ruling party."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.