మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్కు ప్రముఖ ప్రచార కర్త హోదాను రద్దు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. పదే పదే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణంగా ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
మధ్యప్రదేశ్లో 28 అసెంబ్లీ నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు జరగనుండగా.. కాంగ్రెస్ పార్టీ తరఫున కమల్నాథ్ ప్రముఖ ప్రచారకర్తగా ఉన్నారు. తాజాగా ఎన్నికల సంఘం ఆ హోదాను రద్దు చేసినందున ఇకపై కమల్నాథ్ ఎక్కడకు ప్రచారానికి వెళ్లినా.. ప్రయాణం, వసతి తదితర ఖర్చులను ఆయా నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థులు భరించాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి: 'మేం గెలిస్తే మాజీ సీఎం కుమారులు పదో తరగతి పాస్!'