ETV Bharat / bharat

'బడ్జెట్​... నవభారతానికి మార్గసూచీ'

ఉత్తరప్రదేశ్​ వారణాసిలో 'భాజపా సభ్యత్వ నమోదు' కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం తన ప్రసంగంలో బడ్జెట్​ను ప్రస్తావించిన మోదీ... 5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని కచ్చితంగా సాధిస్తామని పునరుద్ఘాటించారు.

author img

By

Published : Jul 6, 2019, 1:39 PM IST

Updated : Jul 6, 2019, 2:46 PM IST

5 ట్రిలియన్​ డాలర్ల వ్యవస్థను సాధిస్తాం: మోదీ

నవభారత్​ దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ​ఉత్తరప్రదేశ్​లోని సొంత నియోజకవర్గం వారణాసిలో ఏర్పాటు చేసిన పార్టీ 'సభ్యత్వ నమోదు' కార్యక్రమంలో బడ్జెట్​ గురించి ప్రస్తావించారు ప్రధాని. 5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని ఛేదిస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు.

5 ట్రిలియన్​ డాలర్ల వ్యవస్థను సాధిస్తాం: మోదీ

"భారత్​ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్​ డాలర్ల వ్యవస్థగా తయారు చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం. ఇందు కోసం ఎంతో శ్రమిస్తున్నాం. ఆర్థికవ్యవస్థ రూపురేఖలు ఎంత పెద్దగా ఉంటే... దేశాభివృద్ధి అంత గొప్పగా ఉంటుంది. ఈ లక్ష్యాన్ని ఛేదించగలిగే దిశను మేము బడ్జెట్​లో చూపించాం. ఐదేళ్లలో ఒక ప్రభుత్వం ఎంత స్థిరంగా ఉండగలదో ప్రజలకు నిరూపించాం. రానున్న 10 ఏళ్లకు సంబంధించిన ప్రణాళికలతో మేము సిద్ధంగా ఉన్నామని ప్రజల్లో విశ్వాసం కల్పించాం."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

వారందరూ నిరాశావాదులు...

5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్య సాధనపై కొంతమంది అనుమానాలు వ్యక్తం చేయడాన్ని ప్రధాని తప్పుపట్టారు. అసాధ్యమన్న వారిని మోదీ విమర్శించారు. వారందరూ నిరాశావాదులని విమర్శించారు.

సభ్యత్వ నమోదుతో పార్టీకి మరింత బలం...

అంతకముందు భాజపా వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్​ ముఖర్జీ 118వ జయంతి సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. కాశీ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ ప్రక్రియ పార్టీని బలోపేతం చేస్తుందని చెప్పారు.ఇదీ చూడండి:- వారణాసిలో ప్రధాని మోదీ హరితహారం

నవభారత్​ దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ​ఉత్తరప్రదేశ్​లోని సొంత నియోజకవర్గం వారణాసిలో ఏర్పాటు చేసిన పార్టీ 'సభ్యత్వ నమోదు' కార్యక్రమంలో బడ్జెట్​ గురించి ప్రస్తావించారు ప్రధాని. 5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని ఛేదిస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు.

5 ట్రిలియన్​ డాలర్ల వ్యవస్థను సాధిస్తాం: మోదీ

"భారత్​ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్​ డాలర్ల వ్యవస్థగా తయారు చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం. ఇందు కోసం ఎంతో శ్రమిస్తున్నాం. ఆర్థికవ్యవస్థ రూపురేఖలు ఎంత పెద్దగా ఉంటే... దేశాభివృద్ధి అంత గొప్పగా ఉంటుంది. ఈ లక్ష్యాన్ని ఛేదించగలిగే దిశను మేము బడ్జెట్​లో చూపించాం. ఐదేళ్లలో ఒక ప్రభుత్వం ఎంత స్థిరంగా ఉండగలదో ప్రజలకు నిరూపించాం. రానున్న 10 ఏళ్లకు సంబంధించిన ప్రణాళికలతో మేము సిద్ధంగా ఉన్నామని ప్రజల్లో విశ్వాసం కల్పించాం."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

వారందరూ నిరాశావాదులు...

5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్య సాధనపై కొంతమంది అనుమానాలు వ్యక్తం చేయడాన్ని ప్రధాని తప్పుపట్టారు. అసాధ్యమన్న వారిని మోదీ విమర్శించారు. వారందరూ నిరాశావాదులని విమర్శించారు.

సభ్యత్వ నమోదుతో పార్టీకి మరింత బలం...

అంతకముందు భాజపా వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్​ ముఖర్జీ 118వ జయంతి సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. కాశీ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ ప్రక్రియ పార్టీని బలోపేతం చేస్తుందని చెప్పారు.ఇదీ చూడండి:- వారణాసిలో ప్రధాని మోదీ హరితహారం

Varanasi (UP), July 06 (ANI): Prime Minister Narendra Modi unveiled statue of former PM of India Lal Bahadur Shastri at Varanasi airport on Saturday. He has arrived Varanasi to launch BJP's membership drive. PM Modi was welcomed upon arrival by Bharatiya Janata Party (BJP) Working President JP Nadda, Chief Minister of Uttar Pradesh Yogi Adityanath and party's UP Chief MN Pandey.
Last Updated : Jul 6, 2019, 2:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.