ETV Bharat / bharat

ముడుపుల ఆశతోనే రఫేల్​పై కాంగ్రెస్ రచ్చ :మోదీ

రక్షణ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆరోపించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. సైన్యానికి కావలసిన అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని ఉత్తరాఖండ్​లోని రుద్రపూర్​లో జరిగిన బహిరంగసభలో ఆరోపించారు.

author img

By

Published : Mar 28, 2019, 5:29 PM IST

కాంగ్రెస్​పై మోదీ విమర్శనాస్త్రాలు

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరాఖండ్​లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాంగ్రెస్​పై విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పాలనలో రక్షణ రంగం నిర్లక్ష్యానికి గురైందని ఉత్తరాఖండ్​లోని రుద్రపూర్​లో జరిగిన బహిరంగ సభలో ఆరోపించారు.

సైన్యానికి కావలసిన అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేయడంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ విఫలమైందన్నారు మోదీ. కాంగ్రెస్​కు కావలసింది కమీషన్లేనని, జాతీయ భద్రత కాదని తీవ్ర విమర్శలు చేశారు. కమీషన్లు లభించకపోవడం వల్ల రఫేల్ కొనుగోలుకు సరైన సమయం దాటిపోతున్నాపదేళ్ల పాటుచర్చల దశలోనే ఉంచిఒప్పందాన్ని హరించి వేసిందని విమర్శించారు.

రుద్రపూర్​ సభలో మోదీ ప్రసంగం

"సైన్యాధ్యక్షుడిపై సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సైన్యం ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. మన వద్ద అత్యాధునిక విమానాలున్నాయి. వాటిని కొనుగోలు చేయడం 1980వ దశాబ్దంలో ప్రారంభమయింది. రఫేల్ విమానాల్ని కొనుగోలు చేసేందుకు అటల్​ బిహారీ ప్రభుత్వంలో ప్రయత్నం మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఆ ప్రతిపాదన పదేళ్లపాటు అలాగే ఉండిపోయింది. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వానికి కమీషన్లు ముట్టలేదు. ఎక్కడి నుంచి కమీషన్లు సేకరించాలన్న సందిగ్ధతలోనే పదేళ్లు గడిచిపోయాయి. మా ప్రభుత్వం వాయుసేన అవసరాలను గుర్తించి ఆ చర్చలను తిరిగి ప్రారంభించింది. మరి కొద్దినెలల్లో రఫేల్ యుద్ధవిమానాలు మన వాయుసేనలో చేరనున్నాయి. మనం అత్యాధునిక హెలికాప్టర్లు వాడుతున్నాం. గతంలో నేలబారు కాంగ్రెస్ ప్రభుత్వం హెలికాప్టర్ల కొనుగోలులోనూ అవినీతికి పాల్పడింది. ప్రస్తుతం ఆ కేసు దర్యాప్తు కొనసాగుతోంది."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరాఖండ్​లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాంగ్రెస్​పై విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పాలనలో రక్షణ రంగం నిర్లక్ష్యానికి గురైందని ఉత్తరాఖండ్​లోని రుద్రపూర్​లో జరిగిన బహిరంగ సభలో ఆరోపించారు.

సైన్యానికి కావలసిన అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేయడంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ విఫలమైందన్నారు మోదీ. కాంగ్రెస్​కు కావలసింది కమీషన్లేనని, జాతీయ భద్రత కాదని తీవ్ర విమర్శలు చేశారు. కమీషన్లు లభించకపోవడం వల్ల రఫేల్ కొనుగోలుకు సరైన సమయం దాటిపోతున్నాపదేళ్ల పాటుచర్చల దశలోనే ఉంచిఒప్పందాన్ని హరించి వేసిందని విమర్శించారు.

రుద్రపూర్​ సభలో మోదీ ప్రసంగం

"సైన్యాధ్యక్షుడిపై సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సైన్యం ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. మన వద్ద అత్యాధునిక విమానాలున్నాయి. వాటిని కొనుగోలు చేయడం 1980వ దశాబ్దంలో ప్రారంభమయింది. రఫేల్ విమానాల్ని కొనుగోలు చేసేందుకు అటల్​ బిహారీ ప్రభుత్వంలో ప్రయత్నం మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఆ ప్రతిపాదన పదేళ్లపాటు అలాగే ఉండిపోయింది. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వానికి కమీషన్లు ముట్టలేదు. ఎక్కడి నుంచి కమీషన్లు సేకరించాలన్న సందిగ్ధతలోనే పదేళ్లు గడిచిపోయాయి. మా ప్రభుత్వం వాయుసేన అవసరాలను గుర్తించి ఆ చర్చలను తిరిగి ప్రారంభించింది. మరి కొద్దినెలల్లో రఫేల్ యుద్ధవిమానాలు మన వాయుసేనలో చేరనున్నాయి. మనం అత్యాధునిక హెలికాప్టర్లు వాడుతున్నాం. గతంలో నేలబారు కాంగ్రెస్ ప్రభుత్వం హెలికాప్టర్ల కొనుగోలులోనూ అవినీతికి పాల్పడింది. ప్రస్తుతం ఆ కేసు దర్యాప్తు కొనసాగుతోంది."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Almeria, Spain - Various.
1. 00:00
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: VNR
DURATION: 04:00
STORYLINE:
++TO FOLLOW++
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.