ETV Bharat / bharat

రైతు నిరసనలపై రాజ్​నాథ్​ కీలక వ్యాఖ్యలు

author img

By

Published : Dec 23, 2020, 12:31 PM IST

Updated : Dec 23, 2020, 1:29 PM IST

మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ పునరుద్ఘాటించారు. రైతులు త్వరలో ఉద్యమాన్ని విరమించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. 'కిసాన్​ దివస్'​ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Modi govt committed to farmers' welfare, hope protesting farmers soon withdraw stir: Rajnath
'రైతు సంక్షేమానికి మోదీ సర్కార్​ కట్టుబడి ఉంది'

మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ స్పష్టం చేశారు. రైతులు ఉద్యమాన్ని విరమించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత మాజీ ప్రధాని చరణ్​ సింగ్​ జయంతి(కిసాన్ దివస్​) సందర్భంగా రాజ్​నాథ్​ ఈ వ్యాఖ్యలు చేశారు. చరణ్​ సింగ్ స్ఫూర్తితో రైతుల కోసం ప్రధాని మోదీ అనేక సంస్కరణలను తీసుకొచ్చారని తెలిపారు.

" నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొంతమంది రైతులు ఆందోళనలు చేస్తున్నారు. కేంద్రం వారితో చర్చలు జరుపుతోంది. త్వరలోనే రైతులు ఉద్యమాన్ని విరమించుకుంటారని భావిస్తున్నా"

--రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​

చరణ్​ సింగ్ రైతుల సంక్షేమం కోసం నిరంతర కృషి చేశారని కొనియాడారు రాజ్​నాథ్. రైతుల ఆదాయం పెంచేందుకు ఆయన శ్రమించారని గుర్తు చేశారు. అన్నదాతల వల్లే భారత్​ ధాన్యబండాగారంలా మారిందని రైతులను ప్రశంసించారు.

ప్రధాని నివాళి ..

భారత మాజీ ప్రధాని చరణ్​ సింగ్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. గ్రామాలు, రైతుల అభివృద్ధికి చరణ్​ సింగ్ చేసిన కృషి ఎల్లప్పుడూ గుర్తుచేసుకోవాల్సిన విషయం అని ట్విట్టర్​లో తెలిపారు.

'రైతులు ఆందోళన చేయటం దురదృష్టకరం'

జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​ రైతు ఉద్యమానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులను గౌరవించాల్సిన కేంద్రమే.. అన్నదాతలను ఆందోళనల బాట పట్టించిందని ట్విట్టర్​లో మండిపడ్డారు.

ఇదీ చదవండి : 'జనవరి 26న దిల్లీ వీధుల్లో రైతుల పరేడ్'

మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ స్పష్టం చేశారు. రైతులు ఉద్యమాన్ని విరమించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత మాజీ ప్రధాని చరణ్​ సింగ్​ జయంతి(కిసాన్ దివస్​) సందర్భంగా రాజ్​నాథ్​ ఈ వ్యాఖ్యలు చేశారు. చరణ్​ సింగ్ స్ఫూర్తితో రైతుల కోసం ప్రధాని మోదీ అనేక సంస్కరణలను తీసుకొచ్చారని తెలిపారు.

" నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొంతమంది రైతులు ఆందోళనలు చేస్తున్నారు. కేంద్రం వారితో చర్చలు జరుపుతోంది. త్వరలోనే రైతులు ఉద్యమాన్ని విరమించుకుంటారని భావిస్తున్నా"

--రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​

చరణ్​ సింగ్ రైతుల సంక్షేమం కోసం నిరంతర కృషి చేశారని కొనియాడారు రాజ్​నాథ్. రైతుల ఆదాయం పెంచేందుకు ఆయన శ్రమించారని గుర్తు చేశారు. అన్నదాతల వల్లే భారత్​ ధాన్యబండాగారంలా మారిందని రైతులను ప్రశంసించారు.

ప్రధాని నివాళి ..

భారత మాజీ ప్రధాని చరణ్​ సింగ్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. గ్రామాలు, రైతుల అభివృద్ధికి చరణ్​ సింగ్ చేసిన కృషి ఎల్లప్పుడూ గుర్తుచేసుకోవాల్సిన విషయం అని ట్విట్టర్​లో తెలిపారు.

'రైతులు ఆందోళన చేయటం దురదృష్టకరం'

జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​ రైతు ఉద్యమానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులను గౌరవించాల్సిన కేంద్రమే.. అన్నదాతలను ఆందోళనల బాట పట్టించిందని ట్విట్టర్​లో మండిపడ్డారు.

ఇదీ చదవండి : 'జనవరి 26న దిల్లీ వీధుల్లో రైతుల పరేడ్'

Last Updated : Dec 23, 2020, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.