ETV Bharat / bharat

ఎమ్మెల్యే మమకారం- వానరానికి వర్ధంతి - కోతికి పూజ

పెంపుడు జంతువులు చనిపోతే మనం అయితే ఏం చేస్తాం? మహా అంటే నాలుగు రోజులు బాధపడతాం. మరో అడుగు ముందుకు వేస్తే అంత్యక్రియలు నిర్వహించేవారు కూడా ఉన్నారు. కానీ కర్ణాకట మైసూర్​ కేఆర్​ నగర్​ ఎమ్మెల్యే మాత్రం అందుకు భిన్నం. ఇంతకు ఆయన ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

MLA Sa Ra Mahesh offered Puja on the Vocation of Pet Monkey's Death Anniversary
వానరం వర్థంతికి ఎమ్మెల్యే పూజలు
author img

By

Published : Jan 2, 2021, 10:58 AM IST

Updated : Jan 2, 2021, 7:39 PM IST

కర్ణాటక మైసూర్​ ఎమ్మెల్యే సారా మహేశ్​కు కోతులు అంటే ఇష్టం. అందరూ పిల్లి, కుక్కని పెంచుకుంటూ ఉంటే ఆయన మాత్రం వానరాన్ని పెంచుకున్నారు. దానికి 'చింటూ' అని పేరు కూడా పెట్టుకున్నారు. అయితే అది ఏడాది కిందట విద్యుదాఘాతంతో చనిపోయింది. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కోతి మృతదేహానికి అంత్యక్రియలు చేసి.. అప్పుడు దానిపై తన ప్రేమను చాటుకున్నారు. తాజాగా చింటూ వర్ధంతిని కూడా ఘనంగా నిర్వహించి.. కోతిపై తనకున్న ప్రేమను మరోసారి నిరూపించుకున్నారు.

వానరం వర్ధంతికి ఎమ్మెల్యే పూజలు

కోతికో గుడి..

'చింటూ'కి మహేశ్​కు ఎంతో అవినాభావ సంబంధం ఉంది అని అంటున్నారు ఆయన గురించి తెలిసిన వారు. ఏడాది కిందట విద్యుదాఘాతంతో వానరం చనిపోతే.. సింగపూర్​లో ఉన్న ఎమ్మెల్యే ట్రిప్​ను కూడా రద్దు చేసుకుని మరీ వచ్చారు. తన ఫామ్​హౌస్​లోనే అంత్యక్రియలు నిర్వహించారు. జ్ఞాపకార్థంగా గుడి కట్టించారు. అందులో చింటు ప్రతిమను నెలకొల్పారు. ఇలా ఆ వానరం మీద ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.

ఇదీ చూడండి: ఆ గ్రామంలో 80శాతం మంది జనవరి 1నే పుట్టారంట!

కర్ణాటక మైసూర్​ ఎమ్మెల్యే సారా మహేశ్​కు కోతులు అంటే ఇష్టం. అందరూ పిల్లి, కుక్కని పెంచుకుంటూ ఉంటే ఆయన మాత్రం వానరాన్ని పెంచుకున్నారు. దానికి 'చింటూ' అని పేరు కూడా పెట్టుకున్నారు. అయితే అది ఏడాది కిందట విద్యుదాఘాతంతో చనిపోయింది. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కోతి మృతదేహానికి అంత్యక్రియలు చేసి.. అప్పుడు దానిపై తన ప్రేమను చాటుకున్నారు. తాజాగా చింటూ వర్ధంతిని కూడా ఘనంగా నిర్వహించి.. కోతిపై తనకున్న ప్రేమను మరోసారి నిరూపించుకున్నారు.

వానరం వర్ధంతికి ఎమ్మెల్యే పూజలు

కోతికో గుడి..

'చింటూ'కి మహేశ్​కు ఎంతో అవినాభావ సంబంధం ఉంది అని అంటున్నారు ఆయన గురించి తెలిసిన వారు. ఏడాది కిందట విద్యుదాఘాతంతో వానరం చనిపోతే.. సింగపూర్​లో ఉన్న ఎమ్మెల్యే ట్రిప్​ను కూడా రద్దు చేసుకుని మరీ వచ్చారు. తన ఫామ్​హౌస్​లోనే అంత్యక్రియలు నిర్వహించారు. జ్ఞాపకార్థంగా గుడి కట్టించారు. అందులో చింటు ప్రతిమను నెలకొల్పారు. ఇలా ఆ వానరం మీద ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.

ఇదీ చూడండి: ఆ గ్రామంలో 80శాతం మంది జనవరి 1నే పుట్టారంట!

Last Updated : Jan 2, 2021, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.