ETV Bharat / bharat

తిట్టొద్దని అంటే తుపాకులతో చితక్కొట్టారు

ఉత్తరప్రదేశ్​ మథురలో కొంతమంది దుండగులు ఓ వైద్యునిపై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

author img

By

Published : Jun 2, 2019, 12:34 PM IST

Updated : Jun 2, 2019, 5:24 PM IST

తుపాకులు మళ్లేసి వైద్యునిపై దుండగుల దాడి
తిట్టొద్దని అంటే తుపాకులతో చితక్కొట్టారు

ఉత్తరప్రదేశ్​ మథురలో ఓ వైద్యునిపై కొంత మంది దుండగులు ఆటవికంగా దాడి చేశారు. ఒంటరిగా ఉన్న వ్యక్తిని కర్రలు, తుపాకులతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. అక్కడే ఉన్న సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి.

కారు పార్కింగ్​ స్థలంలో జరిగిన వాగ్వాదం వల్ల డాక్టర్ రాహుల్​పై ఓ పన్నెండు మంది దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో రాహుల్​తో పాటు అతని తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి.

"పార్కింగ్ స్థలంలో నా బండి ఆగి ఉంది. పక్కనే ఉన్న బండివాళ్లు నాపై అరిచారు. బండి తీసివేయమని అన్నారు. నేను తీసేలోపే తిట్టడం మొదలుపెట్టారు. ఇందులో ఒకరి పేరు రాజీవ్​. మిగతావాళ్ల గురించి నాకు తెలియదు. వాళ్లు మా ఇంటిపైన ఉంటారని అందరూ అంటున్నారు. కారులో కూర్చొని తాగుతున్నారనుకుంటా. నేను తిట్ట వద్దు అంటున్నప్పడు వాళ్లు గాల్లోకి ఓసారి కాల్పులు జరిపారు. తరువాత నన్ను లాఠీలతో కొట్టడం మొదలుపెట్టారు. నా వేలు విరిగింది. నాతో పాటు ఉన్న నా తమ్ముడికి తలపై పెద్ద గాయమైంది." -రాహుల్​, బాధితుడు

సమాచారం అందుకున్న పోలీసులు తక్షణం స్పందించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 3 తుపాకులు స్వాధీనం చేసకున్నారు.

"కొంత మంది వ్యక్తులు ఒకరిని కొడుతున్నారని సమాచారం వచ్చింది. ఘటనా స్థలానికి వెళ్లి, ఈ దాడులకు పాల్పడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాం. కేసు నమోదు చేశాం." -పోలీసు అధికారి

ఇదీ చూడండి: పోలీసు అమర వీరులకు అమిత్​ షా నివాళులు

తిట్టొద్దని అంటే తుపాకులతో చితక్కొట్టారు

ఉత్తరప్రదేశ్​ మథురలో ఓ వైద్యునిపై కొంత మంది దుండగులు ఆటవికంగా దాడి చేశారు. ఒంటరిగా ఉన్న వ్యక్తిని కర్రలు, తుపాకులతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. అక్కడే ఉన్న సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి.

కారు పార్కింగ్​ స్థలంలో జరిగిన వాగ్వాదం వల్ల డాక్టర్ రాహుల్​పై ఓ పన్నెండు మంది దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో రాహుల్​తో పాటు అతని తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి.

"పార్కింగ్ స్థలంలో నా బండి ఆగి ఉంది. పక్కనే ఉన్న బండివాళ్లు నాపై అరిచారు. బండి తీసివేయమని అన్నారు. నేను తీసేలోపే తిట్టడం మొదలుపెట్టారు. ఇందులో ఒకరి పేరు రాజీవ్​. మిగతావాళ్ల గురించి నాకు తెలియదు. వాళ్లు మా ఇంటిపైన ఉంటారని అందరూ అంటున్నారు. కారులో కూర్చొని తాగుతున్నారనుకుంటా. నేను తిట్ట వద్దు అంటున్నప్పడు వాళ్లు గాల్లోకి ఓసారి కాల్పులు జరిపారు. తరువాత నన్ను లాఠీలతో కొట్టడం మొదలుపెట్టారు. నా వేలు విరిగింది. నాతో పాటు ఉన్న నా తమ్ముడికి తలపై పెద్ద గాయమైంది." -రాహుల్​, బాధితుడు

సమాచారం అందుకున్న పోలీసులు తక్షణం స్పందించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 3 తుపాకులు స్వాధీనం చేసకున్నారు.

"కొంత మంది వ్యక్తులు ఒకరిని కొడుతున్నారని సమాచారం వచ్చింది. ఘటనా స్థలానికి వెళ్లి, ఈ దాడులకు పాల్పడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాం. కేసు నమోదు చేశాం." -పోలీసు అధికారి

ఇదీ చూడండి: పోలీసు అమర వీరులకు అమిత్​ షా నివాళులు

Intro:Body:Conclusion:
Last Updated : Jun 2, 2019, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.