ETV Bharat / bharat

వలస వ్యథ: సైకిళ్లు కొనేందుకు తాళి తాకట్టు!

author img

By

Published : Jun 2, 2020, 1:40 PM IST

లాక్​డౌన్​ వేళ సైకిళ్లు కొనేందుకు ఓ వలస కూలీ.. భార్య మంగళసూత్రాన్నే తాకట్టు పెట్టాడు. జేబులో చిల్లిగవ్వలేక బెంగళూరు నుంచి ఒడిశాకు చేరుకునేందుకు నానా తిప్పలు పడ్డాడు.

Migrant sells wife's Mangalsutra to purchase bicycles, pedals from Bengaluru to Cuttack
సైకిళ్లు కొనేందుకు తాళి తాకట్టు పెట్టాడు!

లాక్​డౌన్​ పెట్టిన తిప్పలకు వలస కూలీల గుండెలవిసిపోయాయి. సొంతగూటికి చేరేందుకు కొందరికి కాళ్లే చక్రాలయ్యాయి. ఉన్నదంతా అమ్ముకుని మరికొందరి బతుకులు దిగజారిపోయాయి. తాజాగా బెంగళూరు నుంచి ఒడిశాకు చేరేందుకు ఓ వలస కూలీ భార్య మంగళసూత్రాన్నే తాకట్టు పెట్టాడు.

ఒడిశా భద్రక్​, బసుదేవ్​పుర్​కు చెందిన చందన్​ జెనా, భార్యతో కలిసి పని కోసం బెంగళూరుకు వెళ్లాడు. కూలీ చేస్తే గానీ పూటగడవని బతుకులు వారివి. మరి, లాక్​డౌన్​ వేళ పనే లేకుండాపోయింది. లాక్​డౌన్​ ఎత్తేస్తే పని దొరుకుతుందని రెండు నెలలుగా ఎదురుచూశారు. కానీ, ఇప్పట్లో అది జరిగేపని కాదనుకున్నారు.

చేసేదేమీ లేక జెనా.. భార్యను, మరో స్నేహితుడిని వెంటబెట్టుకుని ఊరెళ్లిపోదామనుకున్నాడు. జేబులో చిల్లిగవ్వలేదు. ఊరుగాని ఊరు కాబట్టి అప్పు పుట్టే మార్గంలేదు. గత్యంతరం లేక భార్య మెడలో తాళిని రూ.15 వేలకు తాకట్టు పెట్టాడు. ఆ డబ్బుతో రెండు సైకిళ్లు కొన్నాడు.

Migrant sells wife's Mangalsutra to purchase bicycles, pedals from Bengaluru to Cuttack
సైకిళ్లు కొనేందుకు తాళి తాకట్టు పెట్టాడు!

బెంగళూరు నుంచి సైకిల్​ తొక్కుతూ.. ఒడిశాలోని కటక్​కు చేరుకున్నారు. అక్కడ కొందరు సామాజిక కార్యకర్తల కంటపడ్డారు. జెనా కథ విని చలించిపోయిన వారు.. ఆ ముగ్గురికీ అన్నపానీయాలు అందించి, వారిని సొంతగూటికి చేర్చేందుకు ఓ వాహనం ఏర్పాటు చేసి ఆదుకున్నారు.

ఇదీ చదవండి:'భౌతిక దూరమే' ఆ గిరిజనుల సంప్రదాయం!

లాక్​డౌన్​ పెట్టిన తిప్పలకు వలస కూలీల గుండెలవిసిపోయాయి. సొంతగూటికి చేరేందుకు కొందరికి కాళ్లే చక్రాలయ్యాయి. ఉన్నదంతా అమ్ముకుని మరికొందరి బతుకులు దిగజారిపోయాయి. తాజాగా బెంగళూరు నుంచి ఒడిశాకు చేరేందుకు ఓ వలస కూలీ భార్య మంగళసూత్రాన్నే తాకట్టు పెట్టాడు.

ఒడిశా భద్రక్​, బసుదేవ్​పుర్​కు చెందిన చందన్​ జెనా, భార్యతో కలిసి పని కోసం బెంగళూరుకు వెళ్లాడు. కూలీ చేస్తే గానీ పూటగడవని బతుకులు వారివి. మరి, లాక్​డౌన్​ వేళ పనే లేకుండాపోయింది. లాక్​డౌన్​ ఎత్తేస్తే పని దొరుకుతుందని రెండు నెలలుగా ఎదురుచూశారు. కానీ, ఇప్పట్లో అది జరిగేపని కాదనుకున్నారు.

చేసేదేమీ లేక జెనా.. భార్యను, మరో స్నేహితుడిని వెంటబెట్టుకుని ఊరెళ్లిపోదామనుకున్నాడు. జేబులో చిల్లిగవ్వలేదు. ఊరుగాని ఊరు కాబట్టి అప్పు పుట్టే మార్గంలేదు. గత్యంతరం లేక భార్య మెడలో తాళిని రూ.15 వేలకు తాకట్టు పెట్టాడు. ఆ డబ్బుతో రెండు సైకిళ్లు కొన్నాడు.

Migrant sells wife's Mangalsutra to purchase bicycles, pedals from Bengaluru to Cuttack
సైకిళ్లు కొనేందుకు తాళి తాకట్టు పెట్టాడు!

బెంగళూరు నుంచి సైకిల్​ తొక్కుతూ.. ఒడిశాలోని కటక్​కు చేరుకున్నారు. అక్కడ కొందరు సామాజిక కార్యకర్తల కంటపడ్డారు. జెనా కథ విని చలించిపోయిన వారు.. ఆ ముగ్గురికీ అన్నపానీయాలు అందించి, వారిని సొంతగూటికి చేర్చేందుకు ఓ వాహనం ఏర్పాటు చేసి ఆదుకున్నారు.

ఇదీ చదవండి:'భౌతిక దూరమే' ఆ గిరిజనుల సంప్రదాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.