ETV Bharat / bharat

'కేంద్ర మార్గదర్శకాలను రాష్ట్రాలు నీరుగార్చొద్దు'

author img

By

Published : May 18, 2020, 2:36 PM IST

లాక్​డౌన్​పై కేంద్రం హోంశాఖ జారీ చేసిన నూతన మార్గదర్శకాలను రాష్ట్రాలు కఠినంగా అమలు చేయాలని సీఎస్​లకు హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. ఈ మార్గదర్శకాలను నీరుగార్చొద్దని రాష్ట్రాలకు సూచించారు.

home ministry
హోంశాఖ

లాక్​డౌన్​ను మే 31వరకు పొడగిస్తూ ఇచ్చిన మార్గదర్శకాలను నీరుగార్చొద్దని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ సూచించింది. రాష్ట్రాల అభ్యర్థనను పరిగణలోకి తీసుకునే మార్గదర్శకాలు రూపొందించినట్లు స్పష్టం చేసింది.

ఈ మేరకు మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎస్​లకు హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు.

"హోంశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ఏ రాష్ట్రం కూడా నీరుగార్చొద్దు. నూతన మార్గదర్శకాలను కఠినంగా అమలు చేసేలా అధికారులను నిర్దేశించాలని రాష్ట్రాలను కోరుతున్నా. జోన్ల పరిధిలో ఉన్న పరిస్థితులను బట్టి అవసరమైతే మరిన్ని కార్యకలాపాలపై నిషేధం విధించవచ్చు. "-అజయ్ భల్లా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి

కేంద్రం మార్గదర్శకాలు అనుసరించి జోన్​లను నిర్ణయించే అధికారం రాష్ట్రాలకే ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు భల్లా. రెడ్, ఆరెంజ్ జోన్​లలో కంటైన్​మెంట్, బఫర్ జోన్లను జిల్లా లేదా స్థానిక యంత్రాంగం గుర్తిస్తుందని తెలిపారు.

కంటైన్​మెంట్​ జోన్లలో ఆంక్షలు కట్టుదిట్టంగా అమలు చేయాలని సీఎస్​లకు సూచించారు. అత్యవసర అవసరాలకు మినహాయించి ఏ ఒక్కరినీ బయట తిరగకుండా చూడాలని పేర్కొన్నారు. కొన్ని కార్యక్రమాలపై దేశవ్యాప్తంగా పూర్తి నిషేధం అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.

మే 31 వరకు..

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ను మే 31 వరకు పొడగిస్తూ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్​డీఎంఏ) ఆదేశాలు జారీ చేసింది. అనంతరం హోంశాఖ నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. అంతర్​ రాష్ట్ర బస్సులకు అనుమతిచ్చింది. జోన్ల నిర్ణయాధికారం రాష్ట్రాలకే కట్టబెట్టింది. విమానాలు, రైళ్లు, మెట్రోలపై నిషేధం కొనసాగించింది.

ఇదీ చదవండి: తెలుగమ్మాయి శ్రావ్యకు ట్రంప్ సత్కారం

లాక్​డౌన్​ను మే 31వరకు పొడగిస్తూ ఇచ్చిన మార్గదర్శకాలను నీరుగార్చొద్దని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ సూచించింది. రాష్ట్రాల అభ్యర్థనను పరిగణలోకి తీసుకునే మార్గదర్శకాలు రూపొందించినట్లు స్పష్టం చేసింది.

ఈ మేరకు మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎస్​లకు హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు.

"హోంశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ఏ రాష్ట్రం కూడా నీరుగార్చొద్దు. నూతన మార్గదర్శకాలను కఠినంగా అమలు చేసేలా అధికారులను నిర్దేశించాలని రాష్ట్రాలను కోరుతున్నా. జోన్ల పరిధిలో ఉన్న పరిస్థితులను బట్టి అవసరమైతే మరిన్ని కార్యకలాపాలపై నిషేధం విధించవచ్చు. "-అజయ్ భల్లా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి

కేంద్రం మార్గదర్శకాలు అనుసరించి జోన్​లను నిర్ణయించే అధికారం రాష్ట్రాలకే ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు భల్లా. రెడ్, ఆరెంజ్ జోన్​లలో కంటైన్​మెంట్, బఫర్ జోన్లను జిల్లా లేదా స్థానిక యంత్రాంగం గుర్తిస్తుందని తెలిపారు.

కంటైన్​మెంట్​ జోన్లలో ఆంక్షలు కట్టుదిట్టంగా అమలు చేయాలని సీఎస్​లకు సూచించారు. అత్యవసర అవసరాలకు మినహాయించి ఏ ఒక్కరినీ బయట తిరగకుండా చూడాలని పేర్కొన్నారు. కొన్ని కార్యక్రమాలపై దేశవ్యాప్తంగా పూర్తి నిషేధం అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.

మే 31 వరకు..

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ను మే 31 వరకు పొడగిస్తూ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్​డీఎంఏ) ఆదేశాలు జారీ చేసింది. అనంతరం హోంశాఖ నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. అంతర్​ రాష్ట్ర బస్సులకు అనుమతిచ్చింది. జోన్ల నిర్ణయాధికారం రాష్ట్రాలకే కట్టబెట్టింది. విమానాలు, రైళ్లు, మెట్రోలపై నిషేధం కొనసాగించింది.

ఇదీ చదవండి: తెలుగమ్మాయి శ్రావ్యకు ట్రంప్ సత్కారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.