ETV Bharat / bharat

రాష్ట్రపతి వద్దకు నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్​

author img

By

Published : Jan 17, 2020, 10:42 AM IST

Updated : Jan 17, 2020, 10:56 AM IST

దిల్లీ లెఫ్టినెంట్​ గవర్నర్​ నుంచి అందిన నిర్భయ దోషి క్షమాభిక్ష అర్జీని రాష్ట్రపతికి పంపించింది కేంద్ర హోంశాఖ. గవర్నర్​ సూచన మేరకు ఈ అర్జీని తిరస్కరించాలని రాష్ట్రపతికి సిఫార్సు చేసింది.

MHA-NIRBHAYA MERCY
MHA-NIRBHAYA MERCY

నిర్భయ కేసు దోషి ముఖేశ్​ సింగ్​ క్షమాభిక్ష పిటిషన్​ను రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు పంపింది కేంద్ర హోంశాఖ. ఈ అభ్యర్థనను తిరస్కరించాలని హోంశాఖ సిఫార్సు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

నిర్భయ కేసు దోషుల్లో ఒకడైన ముఖేశ్.. కొన్ని రోజుల క్రితం క్షమాభిక్ష పిటిషన్​ను దిల్లీ లెఫ్టినెంట్​ గవర్నర్​కు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ అర్జీని పరిశీలించిన గవర్నర్​.. కేంద్ర హోంశాఖ వద్దకు గురువారం పంపారు.

"లెఫ్టినెంట్​ గవర్నర్​ నుంచి అందిన ముఖేశ్​ క్షమాభిక్ష అర్జీని రాష్ట్రపతికి పంపాం. క్షమాభిక్షను తిరస్కరించాలన్న గవర్నర్​ సిఫార్సును యథావిధిగా రాష్ట్రపతి వద్ద పునరుద్ఘాటించాం."

-కేంద్ర హోంశాఖ అధికారి

నిర్భయ కేసులో నలుగురు దోషులైన అక్షయ్ కుమార్ సింగ్, వినయ్ శర్మ, ముకేశ్ కుమార్ సింగ్, పవన్ గుప్తాకు జనవరి 22న ఉరిశిక్ష అమలుచేసేందుకు నిర్ణయంచారు. అయితే ముఖేశ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ఇంకా పెండింగ్​లో ఉన్నందున ఉరిశిక్ష అమలును వాయిదా వేయాలని దిల్లీ ప్రభుత్వం బుధవారం.. హైకోర్టుకు తెలిపింది.

నిర్భయ కేసు దోషి ముఖేశ్​ సింగ్​ క్షమాభిక్ష పిటిషన్​ను రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు పంపింది కేంద్ర హోంశాఖ. ఈ అభ్యర్థనను తిరస్కరించాలని హోంశాఖ సిఫార్సు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

నిర్భయ కేసు దోషుల్లో ఒకడైన ముఖేశ్.. కొన్ని రోజుల క్రితం క్షమాభిక్ష పిటిషన్​ను దిల్లీ లెఫ్టినెంట్​ గవర్నర్​కు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ అర్జీని పరిశీలించిన గవర్నర్​.. కేంద్ర హోంశాఖ వద్దకు గురువారం పంపారు.

"లెఫ్టినెంట్​ గవర్నర్​ నుంచి అందిన ముఖేశ్​ క్షమాభిక్ష అర్జీని రాష్ట్రపతికి పంపాం. క్షమాభిక్షను తిరస్కరించాలన్న గవర్నర్​ సిఫార్సును యథావిధిగా రాష్ట్రపతి వద్ద పునరుద్ఘాటించాం."

-కేంద్ర హోంశాఖ అధికారి

నిర్భయ కేసులో నలుగురు దోషులైన అక్షయ్ కుమార్ సింగ్, వినయ్ శర్మ, ముకేశ్ కుమార్ సింగ్, పవన్ గుప్తాకు జనవరి 22న ఉరిశిక్ష అమలుచేసేందుకు నిర్ణయంచారు. అయితే ముఖేశ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ఇంకా పెండింగ్​లో ఉన్నందున ఉరిశిక్ష అమలును వాయిదా వేయాలని దిల్లీ ప్రభుత్వం బుధవారం.. హైకోర్టుకు తెలిపింది.

Last Updated : Jan 17, 2020, 10:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.