ETV Bharat / bharat

జెండాలో విత్తనాలతో పర్యావరణంపై అవగాహన

పంద్రాగస్టు సందర్భంగా కర్ణాటకలో ఓ స్వచ్ఛంద సంస్థ పాఠశాల విద్యార్థులకు పర్యావరణహిత త్రివర్ణ పతాకాన్ని అందజేసింది. వాటి విశిష్టతేంటో తెలుసా.. మట్టిలో వేస్తే కొద్దిరోజులకు మొక్కలుగా ఎదుగుతాయి.

author img

By

Published : Aug 16, 2019, 8:01 PM IST

Updated : Sep 27, 2019, 5:35 AM IST

జెండాలో విత్తనాలతో పర్యావరణంపై అవగాహన
జెండాలో విత్తనాలతో పర్యావరణంపై అవగాహన
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశమంతటా సంబరాలు అంబరాన్నంటాయి. కర్ణాటక చామరాజనగర్​లోని ఇన్నర్​వీల్​ క్లబ్​ సభ్యులు పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. వివిధ పాఠశాలలకు వెళ్లి పిల్లలకు పర్యావరణహిత త్రివర్ణపతాకాలను అందించారు. వీటిని చెట్ల నుంచి తయారు చేస్తారు. ప్లాస్టిక్​తో తయారు చేసిన జెండాలకు బదులుగా వీటి వాడకం వల్ల పర్యావరణం సమతుల్యమవుతుందని క్లబ్​ సభ్యులు తెలిపారు.

జెండాలో విత్తనాలు

చెట్లతో తయారు చేసిన ఈ మువ్వన్నెల జెండాకు ఓ ప్రత్యేకత ఉంది. జెండా రూపకల్పన చేసే సమయంలో రకరకాల కూరగాయలు, పండ్ల విత్తనాలను అందులో ఉంచుతారు. స్వాతంత్ర్య దినోత్సవం అయిపోయాక వీటిని మట్టిలో వేస్తే కొద్దిరోజులకు మొక్కై ఎదుగుతుంది. ఒక్కో జెండాలో 7 వరకు విత్తనాలు ఉంటాయి. అందులో మెక్సికన్​ మారిగోల్డ్​, బొప్పాయి, గ్లాడిరియా, సిలోసియా వంటి విత్తనాలు ఉన్నాయి. అవి రెండు మూడు నెలల్లో మొక్కలుగా రూపాంతరం చెందుతాయి. జెండాలను నీటిలో వేసి కొద్ది సమయం ఉంచితే విత్తనాలు, పేపర్​ వేరవుతాయి. అప్పుడు ఆ విత్తనాలను నాటాల్సి ఉంటుంది.

వీటి ద్వారా ప్లాస్టిక్​ జెండాలను తగ్గించటమే కాకుండా చిన్నారుల్లో పర్యావరణంపై చైతన్యం కలుగుతుందన్నారు ఇన్నర్​వీల్​ క్లబ్​ మాజీ అధ్యక్షురాలు లక్ష్మీశివకుమార్. తెలిసోతెలియకో జెండాను అవమానించే విధానానికి తెరపడుతుందన్నారు.

" పూలతో పాఠశాల అందంగా తయారవుతుంది. పాఠశాల ఆవరణలో జెండాలోని విత్తనాలను నాటటం ద్వారా చిన్నారుల్లో పర్యావరణపై చైనత్యం పెంపొందుతుంది."

- లక్ష్మీశివకుమార్​, ఇన్నర్​వీల్​ క్లబ్​ మాజీ అధ్యక్షురాలు

ఇదీ చూడండి: 'పరిస్థితులను బట్టే అణ్వస్త్రాల వినియోగంపై నిర్ణయాలు'

జెండాలో విత్తనాలతో పర్యావరణంపై అవగాహన
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశమంతటా సంబరాలు అంబరాన్నంటాయి. కర్ణాటక చామరాజనగర్​లోని ఇన్నర్​వీల్​ క్లబ్​ సభ్యులు పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. వివిధ పాఠశాలలకు వెళ్లి పిల్లలకు పర్యావరణహిత త్రివర్ణపతాకాలను అందించారు. వీటిని చెట్ల నుంచి తయారు చేస్తారు. ప్లాస్టిక్​తో తయారు చేసిన జెండాలకు బదులుగా వీటి వాడకం వల్ల పర్యావరణం సమతుల్యమవుతుందని క్లబ్​ సభ్యులు తెలిపారు.

జెండాలో విత్తనాలు

చెట్లతో తయారు చేసిన ఈ మువ్వన్నెల జెండాకు ఓ ప్రత్యేకత ఉంది. జెండా రూపకల్పన చేసే సమయంలో రకరకాల కూరగాయలు, పండ్ల విత్తనాలను అందులో ఉంచుతారు. స్వాతంత్ర్య దినోత్సవం అయిపోయాక వీటిని మట్టిలో వేస్తే కొద్దిరోజులకు మొక్కై ఎదుగుతుంది. ఒక్కో జెండాలో 7 వరకు విత్తనాలు ఉంటాయి. అందులో మెక్సికన్​ మారిగోల్డ్​, బొప్పాయి, గ్లాడిరియా, సిలోసియా వంటి విత్తనాలు ఉన్నాయి. అవి రెండు మూడు నెలల్లో మొక్కలుగా రూపాంతరం చెందుతాయి. జెండాలను నీటిలో వేసి కొద్ది సమయం ఉంచితే విత్తనాలు, పేపర్​ వేరవుతాయి. అప్పుడు ఆ విత్తనాలను నాటాల్సి ఉంటుంది.

వీటి ద్వారా ప్లాస్టిక్​ జెండాలను తగ్గించటమే కాకుండా చిన్నారుల్లో పర్యావరణంపై చైతన్యం కలుగుతుందన్నారు ఇన్నర్​వీల్​ క్లబ్​ మాజీ అధ్యక్షురాలు లక్ష్మీశివకుమార్. తెలిసోతెలియకో జెండాను అవమానించే విధానానికి తెరపడుతుందన్నారు.

" పూలతో పాఠశాల అందంగా తయారవుతుంది. పాఠశాల ఆవరణలో జెండాలోని విత్తనాలను నాటటం ద్వారా చిన్నారుల్లో పర్యావరణపై చైనత్యం పెంపొందుతుంది."

- లక్ష్మీశివకుమార్​, ఇన్నర్​వీల్​ క్లబ్​ మాజీ అధ్యక్షురాలు

ఇదీ చూడండి: 'పరిస్థితులను బట్టే అణ్వస్త్రాల వినియోగంపై నిర్ణయాలు'

Intro:Body:Conclusion:
Last Updated : Sep 27, 2019, 5:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.