ETV Bharat / bharat

కార్పెట్ల కోసం ఒక్కరోజులో రూ.28 లక్షలు ఖర్చు

author img

By

Published : Jan 5, 2021, 6:20 PM IST

అధికారంలో ఉండగా జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ చేసిన ఖర్చులపై ఆర్టీఐ ద్వారా కీలక విషయాలు వెల్లడయ్యాయి. 2018లో జనవరి నుంచి జూన్ మధ్య రూ.82 లక్షలు ఖర్చు చేశారని తెలిసింది.

rti, mehbooba mufti
ఆరునెలల్లో 82లక్షలు.. కశ్మీర్ మాజీ సీఎం విలాసాలు

జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ.. అధికారంలో ఆరు నెలల్లో రూ. 82 లక్షల ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేశారు. ఈ విషయం ఇనామ్​ ఉన్​ నబీ సౌదాగర్ అనే కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయడం ద్వారా వెల్లడైంది. శ్రీనగర్​లోని గుప్కార్​ రోడ్డులో ఉన్న అధికారిక నివాసానికి ఈ సొమ్మును ఖర్చు చేశారు ముఫ్తీ. 2018లో జనవరి నుంచి జూన్ మధ్య దుప్పట్లు, ఫర్నిచర్, టీవీలు తదితర వస్తువులను కొనుగోలు చేసినట్లు తెలిసింది.

ఒక్కరోజులోనే 28 లక్షలు...

2018లో మార్చి 28న ఒక్కరోజే ముఫ్తీ రూ.28 లక్షలు ఖర్చు చేశారని ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. ఈ డబ్బును కార్పెట్ల కొనుగోలుకు వినియోగించినట్లు తెలిసింది. ఒక్క మార్చి నెలలోనే రూ.56 లక్షలు ఖర్చు చేశారని వెలుగులోకి వచ్చింది. జూన్​ నెలలో రూ.25 లక్షలతో... టీవీలు(రూ.22 లక్షలు) సహా పలు వస్తువులు కొనుగోలు చేశారని స్పష్టమైంది. ఫిబ్రవరి 22న రూ.11,62,000 విలువ చేసే దుప్పట్లను​ కొనుగోలు చేశారని తెలిసింది.

అంతకు ముందు కూడా..

2017లో జనవరి 30న రూ.14 లక్షలు ఖర్చు చేశారని, అందులో ఓ గొడుగుకు అయిన ఖర్చు రూ. 2.94 లక్షలని తెలిసింది. ఆగస్టు 2016 నుంచి జులై 2018 మధ్య వంట సామగ్రి కోసం 40 లక్షలు ఖర్చు చేశారని వెల్లడైంది.

నబీ సౌదాగర్​కు గతేడాది సెప్టెంబరు 1న ఆర్టీఐ ద్వారా ఈ వివరాలు అందాయి. అయితే జిల్లా అభివృద్ధి మండళ్ల ఎన్నికలు జరిగాక ఈ విషయాలు బయటపడటం గమనార్హం. ​

ఇదీ చదవండి : సెంట్రల్​ విస్టా ప్రాజెక్ట్​కు సుప్రీంకోర్టు అనుమతి

జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ.. అధికారంలో ఆరు నెలల్లో రూ. 82 లక్షల ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేశారు. ఈ విషయం ఇనామ్​ ఉన్​ నబీ సౌదాగర్ అనే కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయడం ద్వారా వెల్లడైంది. శ్రీనగర్​లోని గుప్కార్​ రోడ్డులో ఉన్న అధికారిక నివాసానికి ఈ సొమ్మును ఖర్చు చేశారు ముఫ్తీ. 2018లో జనవరి నుంచి జూన్ మధ్య దుప్పట్లు, ఫర్నిచర్, టీవీలు తదితర వస్తువులను కొనుగోలు చేసినట్లు తెలిసింది.

ఒక్కరోజులోనే 28 లక్షలు...

2018లో మార్చి 28న ఒక్కరోజే ముఫ్తీ రూ.28 లక్షలు ఖర్చు చేశారని ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. ఈ డబ్బును కార్పెట్ల కొనుగోలుకు వినియోగించినట్లు తెలిసింది. ఒక్క మార్చి నెలలోనే రూ.56 లక్షలు ఖర్చు చేశారని వెలుగులోకి వచ్చింది. జూన్​ నెలలో రూ.25 లక్షలతో... టీవీలు(రూ.22 లక్షలు) సహా పలు వస్తువులు కొనుగోలు చేశారని స్పష్టమైంది. ఫిబ్రవరి 22న రూ.11,62,000 విలువ చేసే దుప్పట్లను​ కొనుగోలు చేశారని తెలిసింది.

అంతకు ముందు కూడా..

2017లో జనవరి 30న రూ.14 లక్షలు ఖర్చు చేశారని, అందులో ఓ గొడుగుకు అయిన ఖర్చు రూ. 2.94 లక్షలని తెలిసింది. ఆగస్టు 2016 నుంచి జులై 2018 మధ్య వంట సామగ్రి కోసం 40 లక్షలు ఖర్చు చేశారని వెల్లడైంది.

నబీ సౌదాగర్​కు గతేడాది సెప్టెంబరు 1న ఆర్టీఐ ద్వారా ఈ వివరాలు అందాయి. అయితే జిల్లా అభివృద్ధి మండళ్ల ఎన్నికలు జరిగాక ఈ విషయాలు బయటపడటం గమనార్హం. ​

ఇదీ చదవండి : సెంట్రల్​ విస్టా ప్రాజెక్ట్​కు సుప్రీంకోర్టు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.