ETV Bharat / bharat

ముంబయిలోని అందరికీ కరోనా పరీక్షలు.. మెగా ల్యాబ్​ ఏర్పాటు! - maharastra latest news

కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ముంబయిలోని మొత్తం జనాభాకు పరీక్షలు నిర్వహించేలా మెగా ల్యాబ్​ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది ఐఐటీ పూర్వ విద్యార్థుల సమాఖ్య. ఇప్పటికే పనులు ప్రారంభించినట్లు తెలిపింది. నెలకు ఒక కోటి పరీక్షలు నిర్వహించే సామర్థ్యంతో ఈ ల్యాబ్​ పని చేస్తుందని స్పష్టం చేసింది.

Mega lab to be set up to test entire Mumbai population for COVID-19
ముంబయి మొత్తం జనాభాకు కరోనా పరీక్షలు
author img

By

Published : May 29, 2020, 11:27 AM IST

దేశంలో మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. అందులో ముంబయి తీవ్రంగా ప్రభావితమైంది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిపై పోరాటానికి ప్రపంచంలోనే పెద్దదైన ఐఐటీ పూర్వ విద్యార్థుల సమాఖ్య కీలక నిర్ణయం తీసుకుంది. ముంబయిలోని మొత్తం జనాభాకు కరోనా పరీక్షలు చేసేందుకు నెలకు ఒక కోటి పరీక్షలు నిర్వహించే సామర్థ్యంతో మెగా ల్యాబ్​ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం త్వరలోనే భాగస్వామ్య సంస్థలను గుర్తిస్తామని తెలిపింది.

ఈ నెల మొదట్లో తొలి కొవిడ్​ టెస్ట్​ బస్​ను ప్రారంభించిన కౌన్సిల్.​. నగరంలో రెండు సూపర్​ కంప్యూటర్​ క్లస్టర్లలో ఇప్పటికే ట్రయల్స్​ ప్రారంభించినట్లు ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్​ వచ్చేందుకు ఇంకా ఏడాదికిపైగా సమయం పడుతుందని భావిస్తున్న నేపథ్యంలో పరీక్షల సామర్థ్యం ఒక పెద్దసవాలుగా మారింది. సకాలంలో పరీక్షలు చేయటం, నిర్ధరించటం, నివారించటం, సరైన సమయంలో చికిత్స అందించటం ఈ ల్యాబ్​ ముఖ్య ఉద్దేశం.

ఐఐటీ కాన్పుర్​ పూర్వ విద్యార్థి, ప్రిన్సిపల్​ సైంటిఫిక్​ ఆఫీసర్​ కే. విజయ్​ రాఘవన్​ నేతృత్వంలో కొవిడ్​-19 టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది మండలి. ఇందులో 20 మంది ఐఐటీ డైరెక్టర్లతో పాటు పలువురు పూర్వ విద్యార్థులు సభ్యులుగా ఉండనున్నారు. ఐఐటీ పూర్వ విద్యార్థుల మండలిలో 23 ఐఐటీలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు ఉన్నారు.

" అంతర్జాతీయ నిపుణులను సంప్రదించిన తర్వాత కొవిడ్​-19, ఇతర వ్యాధుల కోసం అతిపెద్ద జన్యు పరీక్ష ల్యాబ్​ను ఏర్పాటు చేయాలని ఐఐటీ పూర్వ విద్యార్థుల మండలి నిర్ణయించింది. నెలకు ఒక కోటి ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షల సామర్థ్యంతో 'మెగాల్యాబ్​ ముంబయి'ని రూపొందించేందుకు ఇప్పటికే ఓ బృందం పని ప్రారంభించింది. నెలకు ఒకసారి అంటువ్యాధుల కోసం ముంబయిలోని మొత్తం జనాభాకు పరీక్షలు నిర్వహించేందుకు పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది."

- రవి శర్మ, ఐఐటీ పూర్వవిద్యార్థుల మండలి అధ్యక్షుడు

మార్చి 25నే కొవిడ్​-19 టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేసింది ఐఐటీ అల్యూమినీ కౌన్సిల్​. కరోనాపై పోరాటానికి అవసరమైన పరిష్కారమార్గాలు వెతికేందుకు ప్రపంచవ్యాప్తంగా సుమారు వెయ్యి మంది సభ్యులు రంగంలోకి దిగారు. దాంతో పాటు పొద్దార్​ ఆస్పత్రిలో కృత్రిమ మేథస్సుతో పనిచేసే డిజిటల్​ ఎక్స్​-రే వ్యవస్థను ఏప్రిల్​ 23న ఏర్పాటు చేశారు. మే 1న దేశంలోని తొలి కొవిడ్​ టెస్ట్​​ బస్​ను ప్రారంభించారు. మెగా ల్యాబ్​లో భాగంగా స్వయంచాలితంగా నమూనాలు సేకరించే స్టేషన్లు ఉంటాయి.

దేశంలో మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. అందులో ముంబయి తీవ్రంగా ప్రభావితమైంది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిపై పోరాటానికి ప్రపంచంలోనే పెద్దదైన ఐఐటీ పూర్వ విద్యార్థుల సమాఖ్య కీలక నిర్ణయం తీసుకుంది. ముంబయిలోని మొత్తం జనాభాకు కరోనా పరీక్షలు చేసేందుకు నెలకు ఒక కోటి పరీక్షలు నిర్వహించే సామర్థ్యంతో మెగా ల్యాబ్​ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం త్వరలోనే భాగస్వామ్య సంస్థలను గుర్తిస్తామని తెలిపింది.

ఈ నెల మొదట్లో తొలి కొవిడ్​ టెస్ట్​ బస్​ను ప్రారంభించిన కౌన్సిల్.​. నగరంలో రెండు సూపర్​ కంప్యూటర్​ క్లస్టర్లలో ఇప్పటికే ట్రయల్స్​ ప్రారంభించినట్లు ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్​ వచ్చేందుకు ఇంకా ఏడాదికిపైగా సమయం పడుతుందని భావిస్తున్న నేపథ్యంలో పరీక్షల సామర్థ్యం ఒక పెద్దసవాలుగా మారింది. సకాలంలో పరీక్షలు చేయటం, నిర్ధరించటం, నివారించటం, సరైన సమయంలో చికిత్స అందించటం ఈ ల్యాబ్​ ముఖ్య ఉద్దేశం.

ఐఐటీ కాన్పుర్​ పూర్వ విద్యార్థి, ప్రిన్సిపల్​ సైంటిఫిక్​ ఆఫీసర్​ కే. విజయ్​ రాఘవన్​ నేతృత్వంలో కొవిడ్​-19 టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది మండలి. ఇందులో 20 మంది ఐఐటీ డైరెక్టర్లతో పాటు పలువురు పూర్వ విద్యార్థులు సభ్యులుగా ఉండనున్నారు. ఐఐటీ పూర్వ విద్యార్థుల మండలిలో 23 ఐఐటీలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు ఉన్నారు.

" అంతర్జాతీయ నిపుణులను సంప్రదించిన తర్వాత కొవిడ్​-19, ఇతర వ్యాధుల కోసం అతిపెద్ద జన్యు పరీక్ష ల్యాబ్​ను ఏర్పాటు చేయాలని ఐఐటీ పూర్వ విద్యార్థుల మండలి నిర్ణయించింది. నెలకు ఒక కోటి ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షల సామర్థ్యంతో 'మెగాల్యాబ్​ ముంబయి'ని రూపొందించేందుకు ఇప్పటికే ఓ బృందం పని ప్రారంభించింది. నెలకు ఒకసారి అంటువ్యాధుల కోసం ముంబయిలోని మొత్తం జనాభాకు పరీక్షలు నిర్వహించేందుకు పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది."

- రవి శర్మ, ఐఐటీ పూర్వవిద్యార్థుల మండలి అధ్యక్షుడు

మార్చి 25నే కొవిడ్​-19 టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేసింది ఐఐటీ అల్యూమినీ కౌన్సిల్​. కరోనాపై పోరాటానికి అవసరమైన పరిష్కారమార్గాలు వెతికేందుకు ప్రపంచవ్యాప్తంగా సుమారు వెయ్యి మంది సభ్యులు రంగంలోకి దిగారు. దాంతో పాటు పొద్దార్​ ఆస్పత్రిలో కృత్రిమ మేథస్సుతో పనిచేసే డిజిటల్​ ఎక్స్​-రే వ్యవస్థను ఏప్రిల్​ 23న ఏర్పాటు చేశారు. మే 1న దేశంలోని తొలి కొవిడ్​ టెస్ట్​​ బస్​ను ప్రారంభించారు. మెగా ల్యాబ్​లో భాగంగా స్వయంచాలితంగా నమూనాలు సేకరించే స్టేషన్లు ఉంటాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.