మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ప్రధాన బుకీ సంజీవ్ చావ్లాను తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు తిహార్ జైలుకు తరలించాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది. 2000 సంవత్సరంలో వెలుగులోకి వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ప్రధాన నిందితుడైన చావ్లాను గురువారం అరెస్టు చేశారు.
తనను 12 రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చావ్లా పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారించిన హైకోర్టు.. తమ అభిప్రాయం తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది. దర్యాప్తు అధికారి హాజరు కానందున ఈ కేసు స్థితి గురించి నివేదిక సమర్పించాలని నేర విభాగాన్ని నిర్దేశించింది. ఈ నేపథ్యంలో చావ్లా పిటిషన్పై తదుపరి విచారణనను ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది.
2000 సంవత్సరంలో అప్పటి దక్షిణాఫ్రికా సారథి హాన్సీ క్రానేతో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు చావ్లా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న చావ్లాను గురువారం దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో భారత క్రికెట్ జట్టు మాజీ సారథి అజహరుద్దీన్ కూడా ఆరోపణలు ఎదుర్కొని క్రికెట్ నుంచి నిషేధానికి గురుయ్యాడు.