ETV Bharat / bharat

అత్యాచార దోషికి 17 రోజుల్లోనే శిక్ష విధించిన కోర్టు

అత్యాచార ఘటనపై సత్వరమే విచారణ చేపట్టి కేవలం 17 రోజుల్లోనే శిక్ష విధించిన ఘటన రాజస్థాన్​లో జరిగింది. సెప్టెంబర్ 30న ఓ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన వ్యక్తికి న్యాయస్థానం జీవితఖైదు విధించింది. కేవలం ఏడు రోజుల్లోనే ఛార్జిషీట్ నమోదు చేసి పోలీసులు సత్వర న్యాయానికి బాటలు పరిచారు.

author img

By

Published : Dec 18, 2019, 7:37 PM IST

Man sentenced to life imprisonment within 17 days of raping girl
అత్యాచార నిందితుడికి 17రోజుల్లోనే శిక్ష విధించిన న్యాయస్థానం

రాజస్థాన్​లో ఓ బాలికను అత్యాచారం చేసిన దుర్మార్గుడికి ప్రత్యేక పోక్సో న్యాయస్థానం కేవలం 17 రోజుల్లోనే జీవితఖైదు శిక్ష విధించింది. సాక్ష్యాధారాలతో ఏకీభవించిన కోర్టు.. దోషిగా తేలిన 21 ఏళ్ల దయారాం మేఘ్​వాల్​కు శిక్ష ఖరారు చేసింది.

రాజస్థాన్​లోని చూరు జిల్లాలో నవంబర్ 30న ఓ బాలికను అత్యాచారం చేసిన మేఘ్​వాల్​ను స్థానిక పోలీసులు మరుసటి రోజే అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ, పోక్సో(లైంగిక నేరాల నుంచి బాలలను రక్షించే చట్టం) ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. డిసెంబర్ 7న ఛార్జిషీట్ నమోదు చేశారు. ఈ కేసుపై మంగళవారం తీర్పు వెలువడింది.

"పోలీసులు సత్వర చర్యలు చేపట్టి 7 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి అభియోగ పత్రాలు(ఛార్జిషీట్) నమోదు చేశారు. కోర్టులో రోజువారీగా వాదనలు జరిగాయి. బాధితురాలి వాంగ్మూలం, శాస్త్రీయ ఆధారాలు కేసులో కీలకంగా వ్యవహరించాయి."-తేజస్వీ గౌతమ్, ఎస్​పీ, చూరు

మేఘ్​వాల్​ తండ్రి కూడా గతంలో అత్యాచార కేసులో జైలుకు వెళ్లినట్లు తేజస్వీ తెలిపారు. ​

ఇదీ చదవండి: భారత బ్యాట్స్​మెన్​ 'హిట్​' షో... విండీ లక్ష్యం 388

రాజస్థాన్​లో ఓ బాలికను అత్యాచారం చేసిన దుర్మార్గుడికి ప్రత్యేక పోక్సో న్యాయస్థానం కేవలం 17 రోజుల్లోనే జీవితఖైదు శిక్ష విధించింది. సాక్ష్యాధారాలతో ఏకీభవించిన కోర్టు.. దోషిగా తేలిన 21 ఏళ్ల దయారాం మేఘ్​వాల్​కు శిక్ష ఖరారు చేసింది.

రాజస్థాన్​లోని చూరు జిల్లాలో నవంబర్ 30న ఓ బాలికను అత్యాచారం చేసిన మేఘ్​వాల్​ను స్థానిక పోలీసులు మరుసటి రోజే అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ, పోక్సో(లైంగిక నేరాల నుంచి బాలలను రక్షించే చట్టం) ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. డిసెంబర్ 7న ఛార్జిషీట్ నమోదు చేశారు. ఈ కేసుపై మంగళవారం తీర్పు వెలువడింది.

"పోలీసులు సత్వర చర్యలు చేపట్టి 7 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి అభియోగ పత్రాలు(ఛార్జిషీట్) నమోదు చేశారు. కోర్టులో రోజువారీగా వాదనలు జరిగాయి. బాధితురాలి వాంగ్మూలం, శాస్త్రీయ ఆధారాలు కేసులో కీలకంగా వ్యవహరించాయి."-తేజస్వీ గౌతమ్, ఎస్​పీ, చూరు

మేఘ్​వాల్​ తండ్రి కూడా గతంలో అత్యాచార కేసులో జైలుకు వెళ్లినట్లు తేజస్వీ తెలిపారు. ​

ఇదీ చదవండి: భారత బ్యాట్స్​మెన్​ 'హిట్​' షో... విండీ లక్ష్యం 388

New Delhi, Dec 18 (ANI): Chief Minister Arvind Kejriwal announced various facilities and welfare scheme for lawyers who are voters in Delhi. "There were some longstanding demands of lawyers that we had promised to fulfill. We had set aside Rs 50 crore for their welfare, a committee was set up to decide how to spend it. Committee had made four demands, the cabinet has accepted all of them. We have decided to give lawyers who are voters in Delhi, medical insurance up to Rs 5 lakh, every lawyer will be given life insurance up to Rs 10 lakh. E-libraries and creches will be started in all court premises for the lawyers, for their convenience," said CM Kejriwal.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.