ETV Bharat / bharat

పెళ్లి కోసం యూఏఈ నుంచి వచ్చి 'రైతు' నిరసనలో..

author img

By

Published : Dec 23, 2020, 7:56 PM IST

వివాహం చేసుకోవాలని యూఏఈ నుంచి సెలవుపై ఇంటికి వచ్చిన ఓ యువకుడు.. తన నిర్ణయాన్ని మార్చుకుని రైతుల నిరసనల్లో పాల్గొన్నాడు. ఈ సంఘటన పంజాబ్​ జలంధర్​ జిల్లాలో జరిగింది. వివాహం, ఉద్యోగం కోసం వేచి ఉండొచ్చని, తన సాగు భూమిని రక్షించుకోవటమే ఇప్పుడు ముఖ్యమని చెబుతున్నాడు అతడు.

Farmers protest
రైతు నిరసనలు

కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో దాదాపు నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు రైతులు. వారికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలోనే పెళ్లి కోసం యూఏఈ నుంచి ఇంటికి వచ్చిన ఓ యువకుడు.. తన వివాహ సన్నాహాలను వాయిదా వేసుకున్నాడు. నేరుగా దిల్లీ సరిహద్దులకు చేరుకొని ఆందోళనల్లో పాల్గొన్నాడు. పంజాబ్​కు చెందిన సత్నాం సింగ్​. ఈ ఉద్యమంలో గెలిచే వరకు వెనుదిరిగేది లేదని చెబుతున్నాడు.

ఇదీ జరిగింది..

పంజాబ్​ జలందర్​ జిల్లాకు చెందిన సత్నాం సింగ్​ (29).. ఉపాధి నిమిత్తం రెండేళ్ల క్రితం యూఏఈకి వెళ్లాడు. ఇంటికి తిరిగి వచ్చి వివాహం చేసుకోవాలని నిశ్చయింకున్నాడు. అందుకోసం రెండు నెలల సెలవుపై నవంబర్​ 29న స్వగ్రామం చేసుకున్నాడు.

అప్పటికే తన సోదరుడు, గ్రామంలోని రైతులు.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా సింఘు సరిహద్దులో ఆందోళనలు చేస్తున్నట్లు తెలుసుకున్నాడు సింగ్​. తన తల్లిదండ్రులతో రెండు రోజులు గడిపి.. స్నేహితుడితో కలిసి దిల్లీ-హరియాణా సరిహద్దుకు చేరుకున్నాడు.

దిల్లీ సరిహద్దుల్లో ఎన్ని రోజులు ఉంటారని ప్రశ్నించగా.. ఈ ఉద్యమంలో గెలిచే వరకు ఇక్కడే ఉంటామని సమాధానమిచ్చారు సింగ్​. అబుదాబీలో ఉద్యోగం రాకముందు తానూ రైతునేనని, తన పొలాలను రక్షించుకోవటమే ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: 'జనవరి 26న దిల్లీ వీధుల్లో రైతుల పరేడ్'

కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో దాదాపు నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు రైతులు. వారికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలోనే పెళ్లి కోసం యూఏఈ నుంచి ఇంటికి వచ్చిన ఓ యువకుడు.. తన వివాహ సన్నాహాలను వాయిదా వేసుకున్నాడు. నేరుగా దిల్లీ సరిహద్దులకు చేరుకొని ఆందోళనల్లో పాల్గొన్నాడు. పంజాబ్​కు చెందిన సత్నాం సింగ్​. ఈ ఉద్యమంలో గెలిచే వరకు వెనుదిరిగేది లేదని చెబుతున్నాడు.

ఇదీ జరిగింది..

పంజాబ్​ జలందర్​ జిల్లాకు చెందిన సత్నాం సింగ్​ (29).. ఉపాధి నిమిత్తం రెండేళ్ల క్రితం యూఏఈకి వెళ్లాడు. ఇంటికి తిరిగి వచ్చి వివాహం చేసుకోవాలని నిశ్చయింకున్నాడు. అందుకోసం రెండు నెలల సెలవుపై నవంబర్​ 29న స్వగ్రామం చేసుకున్నాడు.

అప్పటికే తన సోదరుడు, గ్రామంలోని రైతులు.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా సింఘు సరిహద్దులో ఆందోళనలు చేస్తున్నట్లు తెలుసుకున్నాడు సింగ్​. తన తల్లిదండ్రులతో రెండు రోజులు గడిపి.. స్నేహితుడితో కలిసి దిల్లీ-హరియాణా సరిహద్దుకు చేరుకున్నాడు.

దిల్లీ సరిహద్దుల్లో ఎన్ని రోజులు ఉంటారని ప్రశ్నించగా.. ఈ ఉద్యమంలో గెలిచే వరకు ఇక్కడే ఉంటామని సమాధానమిచ్చారు సింగ్​. అబుదాబీలో ఉద్యోగం రాకముందు తానూ రైతునేనని, తన పొలాలను రక్షించుకోవటమే ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: 'జనవరి 26న దిల్లీ వీధుల్లో రైతుల పరేడ్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.