ETV Bharat / bharat

రైతులకు 'దీదీ' సంఘీభావం- కేంద్రానికి హెచ్చరిక

author img

By

Published : Dec 4, 2020, 7:28 PM IST

కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న ఆందోళనలకు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంఘీభావం తెలిపారు. పలువురు రైతులతో ఫోన్​లో సంభాషించారు. 2006లో వ్యవసాయ భూములను బలవంతంగా సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ కోల్​కతాలో.. తాను చేసిన 26 రోజుల నిరాహార దీక్షను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

Mamata Banerjee makes multiple calls to farmers protesting against farm act
రైతులతో మాట్లాడిన బంగాల్​ ముఖ్యమంత్రి

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటించారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. 2006లో ఇదే రోజున కోల్​కతాలో చేపట్టిన 26 రోజుల నిరాహార దీక్షను ఈ సందర్భంగా ఆమె గుర్తుచేసుకున్నారు. #standwithfarmers అనే హాష్​ట్యాగ్​తో ట్వీట్​ చేశారు.

Mamata Banerjee makes multiple calls to farmers protesting against farm act
మమత ట్వీట్​

'వ్యవసాయ భూములను బలవంతంగా సేకరించడానికి వ్యతిరేకంగా సరిగ్గా 14 ఏళ్ల క్రితం 2006 డిసెంబర్​ 4న కోల్​కతాలో నేను 26 రోజుల నిరాహార దీక్ష ప్రారంభించా. ఎలాంటి సంప్రదింపులు జరపకుండా కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు నేను సంఘీభావం తెలుపుతున్నా.''

- మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

కేంద్రం.. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోకుంటే దేశవ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభించనున్నట్లు హెచ్చరించారు మమత.

దిల్లీ-హరియాణాలోని సింఘూ సరిహద్దు వద్ద ఆందోళనలు చేస్తున్న రైతుల వద్దకు తృణమూల్​ కాంగ్రెస్​ తరఫున పార్టీ సీనియర్​ నేత డెరెక్​ ఓబ్రియాన్​ వెళ్లారు. ఆయన.. రైతు సంఘాల నేతలతో వేర్వేరుగా 4 గంటలకుపైగా మాట్లాడినట్లు సమాచారం. ఇదే సమయంలో.. పలువురు రైతులతో దీదీ ఫోన్​లో సంభాషించారు. సమస్యలపై ఆరా తీసి రైతులకు భరోసా కల్పించారు.

Mamata Banerjee makes multiple calls to farmers protesting against farm act
రైతులను కలిసిన డెరెక్​ ఓబ్రియాన్​

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటించారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. 2006లో ఇదే రోజున కోల్​కతాలో చేపట్టిన 26 రోజుల నిరాహార దీక్షను ఈ సందర్భంగా ఆమె గుర్తుచేసుకున్నారు. #standwithfarmers అనే హాష్​ట్యాగ్​తో ట్వీట్​ చేశారు.

Mamata Banerjee makes multiple calls to farmers protesting against farm act
మమత ట్వీట్​

'వ్యవసాయ భూములను బలవంతంగా సేకరించడానికి వ్యతిరేకంగా సరిగ్గా 14 ఏళ్ల క్రితం 2006 డిసెంబర్​ 4న కోల్​కతాలో నేను 26 రోజుల నిరాహార దీక్ష ప్రారంభించా. ఎలాంటి సంప్రదింపులు జరపకుండా కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు నేను సంఘీభావం తెలుపుతున్నా.''

- మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

కేంద్రం.. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోకుంటే దేశవ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభించనున్నట్లు హెచ్చరించారు మమత.

దిల్లీ-హరియాణాలోని సింఘూ సరిహద్దు వద్ద ఆందోళనలు చేస్తున్న రైతుల వద్దకు తృణమూల్​ కాంగ్రెస్​ తరఫున పార్టీ సీనియర్​ నేత డెరెక్​ ఓబ్రియాన్​ వెళ్లారు. ఆయన.. రైతు సంఘాల నేతలతో వేర్వేరుగా 4 గంటలకుపైగా మాట్లాడినట్లు సమాచారం. ఇదే సమయంలో.. పలువురు రైతులతో దీదీ ఫోన్​లో సంభాషించారు. సమస్యలపై ఆరా తీసి రైతులకు భరోసా కల్పించారు.

Mamata Banerjee makes multiple calls to farmers protesting against farm act
రైతులను కలిసిన డెరెక్​ ఓబ్రియాన్​
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.