జూనియర్ డాక్టర్ల సమ్మెపై బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తంచేశారు. నాలుగు గంటల్లో సమ్మె విరమించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్లపై పేషెంట్ బంధువుల దాడికి నిరసనగా సమ్మెను ప్రారంభించారు వైద్యులు. మూడు రోజులుగా కళాశాల ప్రాంగణంలో ఆందోళన చేపడుతున్నారు.
జూడాల డిమాండ్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన మమత తక్షణం ఆందోళన విరమించాలని ఆదేశించారు.
"నాలుగు గంటల్లో వైద్యులందరూ విధుల్లో చేరాలి. లేదా చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ఆసుపత్రులు, వైద్యకళాశాలల్లో బయటివారు వచ్చి గందరగోళం సృష్టిస్తున్నారు. ఈ ప్రదేశాల్లో రోగులు, వైద్యులే ఉండేలా పోలీసులు చూడాలి. వైద్యుల సమ్మె భాజపా, సీపీఎంల ఉమ్మడి కుట్ర."
-మమతా బెనర్జీ, బంగాల్ సీఎం
ఇదీ చూడండి: బార్ కౌన్సిల్ అధ్యక్షురాలిని హత్య చేసిన న్యాయవాది