ETV Bharat / bharat

రాష్ట్రంలో కరోనా రోగులకు పడకల కొరత!

author img

By

Published : May 28, 2020, 11:07 AM IST

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. ఇప్పటికే కేసుల సంఖ్య 56 వేలు దాటింది. రోజురోజుకు ఆస్పత్రుల్లో చేరుతున్న రోగులతో పడకల కొరత ఏర్పడింది. చికిత్స కోసం సుమారు 10 గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని సందర్భాల్లో బాధితుల్ని కూడా ఇంటి వద్దే ఉండాలని సూచిస్తున్నారు.

Maharashtra runs out of hospital beds
కరోనా రోగులకు పడకల కొరత

దేశంలోనే కరోనా కేసులతో తొలిస్థానంలో ఉంది మహారాష్ట్ర. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 56 వేలు దాటింది. రోజురోజుకూ బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో.. చికిత్స అందించేందుకు ముంబయి సహా ఇతర నగరాల్లోని ఆస్పత్రుల్లో పడకల కొరత ఏర్పడింది. కొవిడ్ బారిన పడిన వారు చికిత్స కోసం సుమారు 10 గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

72 వేలకుపైగా ఫిర్యాదులు..

గడిచిన 10 రోజుల్లో ముంబయిలో రోజుకు సుమారు 1500కుపైగా కేసులు నమోదయ్యాయి. పురపాలక సంఘం ఏర్పాటు చేసిన హెల్ప్​లైన్​ 1916కు సుమారు 72 వేలకుపైగా కాల్స్​ వచ్చాయంటే అక్కడి పరిస్థితి ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. అందులో 21 వేల కాల్స్​ పడకలు ఏర్పాటు చేయాలని, 11వేల కాల్స్​ అంబులెన్స్​ల కోసం వచ్చాయి. ఆస్పత్రుల్లో పడకలు​ అందుబాటులో లేక కొన్ని సందర్భాల్లో కరోనా రోగులను సైతం ఇంటి వద్దే ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.

కరోనా వైరస్​ వ్యాప్తి చెందుతున్న మొదట్లోనే.. కస్తూర్భా ఆస్పత్రి సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చాలా వాటిల్లో రోగుల కోసం పడకలు అందుబాటులోకి తెచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వం. దాదాపు 3,960 బెడ్లు కరోనా రోగులకు, 5,500 పడకలు ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారి కోసం కేటాయించారు. అయితే.. ముంబయిలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నాయర్​, జీటీ, సెయింట్​ జార్జ్​, సెవెన్​ హిల్స్​, ట్రూమా కేర్​ సహా ఇతర ఆస్పత్రులను కరోనా చికిత్స కోసం అందుబాటులోకి తెచ్చింది.

ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ..

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల్లోని సుమారు 80 శాతం పడకలను కరోనా రోగుల కోసం కేటాయించారు. బాధితులకు ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే చికిత్స అందించాలని ఆదేశించింది.

దేశంలోనే కరోనా కేసులతో తొలిస్థానంలో ఉంది మహారాష్ట్ర. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 56 వేలు దాటింది. రోజురోజుకూ బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో.. చికిత్స అందించేందుకు ముంబయి సహా ఇతర నగరాల్లోని ఆస్పత్రుల్లో పడకల కొరత ఏర్పడింది. కొవిడ్ బారిన పడిన వారు చికిత్స కోసం సుమారు 10 గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

72 వేలకుపైగా ఫిర్యాదులు..

గడిచిన 10 రోజుల్లో ముంబయిలో రోజుకు సుమారు 1500కుపైగా కేసులు నమోదయ్యాయి. పురపాలక సంఘం ఏర్పాటు చేసిన హెల్ప్​లైన్​ 1916కు సుమారు 72 వేలకుపైగా కాల్స్​ వచ్చాయంటే అక్కడి పరిస్థితి ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. అందులో 21 వేల కాల్స్​ పడకలు ఏర్పాటు చేయాలని, 11వేల కాల్స్​ అంబులెన్స్​ల కోసం వచ్చాయి. ఆస్పత్రుల్లో పడకలు​ అందుబాటులో లేక కొన్ని సందర్భాల్లో కరోనా రోగులను సైతం ఇంటి వద్దే ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.

కరోనా వైరస్​ వ్యాప్తి చెందుతున్న మొదట్లోనే.. కస్తూర్భా ఆస్పత్రి సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చాలా వాటిల్లో రోగుల కోసం పడకలు అందుబాటులోకి తెచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వం. దాదాపు 3,960 బెడ్లు కరోనా రోగులకు, 5,500 పడకలు ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారి కోసం కేటాయించారు. అయితే.. ముంబయిలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నాయర్​, జీటీ, సెయింట్​ జార్జ్​, సెవెన్​ హిల్స్​, ట్రూమా కేర్​ సహా ఇతర ఆస్పత్రులను కరోనా చికిత్స కోసం అందుబాటులోకి తెచ్చింది.

ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ..

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల్లోని సుమారు 80 శాతం పడకలను కరోనా రోగుల కోసం కేటాయించారు. బాధితులకు ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే చికిత్స అందించాలని ఆదేశించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.