ETV Bharat / bharat

పవర్​ ప్లే: కర్ణాటకలో అలా... మహారాష్ట్రలో ఇలా... - మహారాష్ట్రలో కర్ణాటకం

అదే నాటకీయత..! అదే ఉత్కంఠ..! రాష్ట్రాలు వేరైనా... దాదాపు అవే పరిణామాలు..! ఇప్పుడు మహారాష్ట్రలో జరుగుతున్నదంతా... గతంలో కర్ణాటకలో జరిగిందే..! కన్నడనాట కాంగ్రెస్‌, జేడీఎస్​ కూటమి కుప్పకూలి... భాజపా ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ మధ్యలో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలోనూ అదే కనిపిస్తోంది. శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన వెంటనే అజిత్‌ పవార్ కేంద్రంగా నడిచిన రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పూర్తి సారూప్యత కనిపించకపోయినా ఈ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీలు రచించిన వ్యూహాలు మాత్రం ఆసక్తి, ఉత్కంఠ రేపాయి అన్న మాట వాస్తవం.

maharashtra politics mirror image of karnataka happenings
మహారాష్ట్రలోనూ కర్'​నాటకమే'
author img

By

Published : Nov 26, 2019, 7:38 PM IST

Updated : Nov 26, 2019, 11:07 PM IST

మహారాష్ట్రలో కర్ణాటకం

ప్రస్తుతం మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలు 2018నాటి కర్ణాటక పరిణామాలను తలపిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ ఏర్పాటులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

2018లో కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజార్టీ దక్కని కారణంగా హంగ్ ఏర్పడింది. మొత్తం 222 అసెంబ్లీ స్థానాలుండగా భాజపా 104 సీట్లు సాధించింది. సాధారణ ఆధిక్యానికి 7 స్థానాలు తక్కువగా ఉండటం వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. కాంగ్రెస్‌కు 80 స్థానాలు, జేడీఎస్​కు 37 స్థానాలు దక్కాయి. ఫలితంగా... ఈ రెండు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. అదే సమయంలో భాజపా నేత బీఎస్‌ యడియూరప్ప ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా కర్ణాటక గవర్నర్ వాజుభాయ్‌వాలా ఆహ్వానించారు. బల నిరూపణకు ఆదేశించారు.


2018 మే 17వ తేదీన యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా కాంగ్రెస్, జేడీఎస్ పావులు కదిపాయి. ప్రభుత్వం ఏర్పాటుకు భాజపాను ఆహ్వానించటాన్ని సవాలు చేస్తూ మే 16న సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాయి. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం బల నిరూపణకు సిద్ధం కావాలని యడియూరప్పకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు 15 రోజుల గడువు ఇచ్చింది.

బలపరీక్షలో యడియూరప్ప విఫలం

ఎమ్మెల్యేల మద్దతు లేకపోవటం వల్ల బలపరీక్షలో యడియూరప్ప విఫలమయ్యారు. వెను వెంటనే కాంగ్రెస్, జేడీఎస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ 14 నెలల తరవాత కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు కుమారస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. ఫలితంగా సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలగా... యడియూరప్ప నాయకత్వంలో భాజపా ప్రభుత్వం కొలువుదీరింది.

ఇప్పుడు మహారాష్ట్ర...

ఇప్పుడు మహారాష్ట్రలోనూ దాదాపు ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొదట ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు భాజపాను ఆహ్వానించారు గవర్నర్ కోశ్యారీ. ఏడు రోజుల్లో బలనిరూపణ చేసుకోవాల్సిందిగా ఫడణవీస్‌ సర్కార్‌ను ఆదేశించారు. కర్ణాటకలో జరిగినట్లుగానే ప్రభుత్వ ఏర్పాటుకు భాజపాను ఆహ్వానించటాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. ఈ విషయమై తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు... ఫడణవీస్ సర్కార్‌ తమ బలం నిరూపించుకోవాలని ఆదేశించింది. ఈ లోగా ఫడణవీస్‌ రాజీనామా చేయటం సంచలనమైంది.

ఈ రెండు రాష్ట్రాల్లో జరిగిన ఈ పరిణామాల్లో కనిపిస్తున్న ఒకే ఒక తేడా ఏంటంటే... మహారాష్ట్రలో ఫడణవీస్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. కానీ కర్ణాటకలో మాత్రం అంతకుముందే కాంగ్రెస్, జేడీఎస్ పిటిషన్లు వేశాయి.

మొత్తంగా చూస్తే రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటులో జరిగిన కీలక పరిణామాల్లో పూర్తిగా సారూప్యం లేకపోయినా దాదాపు అవే పరిస్థితులైతే ప్రతిబింబించాయన్నది వాస్తవం. ఏ పార్టీకీ మెజార్టీ రాకపోవటం తెరవెనక ఎన్నో రాజకీయాలు నడవటం వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

మహారాష్ట్రలో కర్ణాటకం

ప్రస్తుతం మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలు 2018నాటి కర్ణాటక పరిణామాలను తలపిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ ఏర్పాటులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

2018లో కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజార్టీ దక్కని కారణంగా హంగ్ ఏర్పడింది. మొత్తం 222 అసెంబ్లీ స్థానాలుండగా భాజపా 104 సీట్లు సాధించింది. సాధారణ ఆధిక్యానికి 7 స్థానాలు తక్కువగా ఉండటం వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. కాంగ్రెస్‌కు 80 స్థానాలు, జేడీఎస్​కు 37 స్థానాలు దక్కాయి. ఫలితంగా... ఈ రెండు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. అదే సమయంలో భాజపా నేత బీఎస్‌ యడియూరప్ప ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా కర్ణాటక గవర్నర్ వాజుభాయ్‌వాలా ఆహ్వానించారు. బల నిరూపణకు ఆదేశించారు.


2018 మే 17వ తేదీన యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా కాంగ్రెస్, జేడీఎస్ పావులు కదిపాయి. ప్రభుత్వం ఏర్పాటుకు భాజపాను ఆహ్వానించటాన్ని సవాలు చేస్తూ మే 16న సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాయి. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం బల నిరూపణకు సిద్ధం కావాలని యడియూరప్పకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు 15 రోజుల గడువు ఇచ్చింది.

బలపరీక్షలో యడియూరప్ప విఫలం

ఎమ్మెల్యేల మద్దతు లేకపోవటం వల్ల బలపరీక్షలో యడియూరప్ప విఫలమయ్యారు. వెను వెంటనే కాంగ్రెస్, జేడీఎస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ 14 నెలల తరవాత కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు కుమారస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. ఫలితంగా సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలగా... యడియూరప్ప నాయకత్వంలో భాజపా ప్రభుత్వం కొలువుదీరింది.

ఇప్పుడు మహారాష్ట్ర...

ఇప్పుడు మహారాష్ట్రలోనూ దాదాపు ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొదట ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు భాజపాను ఆహ్వానించారు గవర్నర్ కోశ్యారీ. ఏడు రోజుల్లో బలనిరూపణ చేసుకోవాల్సిందిగా ఫడణవీస్‌ సర్కార్‌ను ఆదేశించారు. కర్ణాటకలో జరిగినట్లుగానే ప్రభుత్వ ఏర్పాటుకు భాజపాను ఆహ్వానించటాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. ఈ విషయమై తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు... ఫడణవీస్ సర్కార్‌ తమ బలం నిరూపించుకోవాలని ఆదేశించింది. ఈ లోగా ఫడణవీస్‌ రాజీనామా చేయటం సంచలనమైంది.

ఈ రెండు రాష్ట్రాల్లో జరిగిన ఈ పరిణామాల్లో కనిపిస్తున్న ఒకే ఒక తేడా ఏంటంటే... మహారాష్ట్రలో ఫడణవీస్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. కానీ కర్ణాటకలో మాత్రం అంతకుముందే కాంగ్రెస్, జేడీఎస్ పిటిషన్లు వేశాయి.

మొత్తంగా చూస్తే రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటులో జరిగిన కీలక పరిణామాల్లో పూర్తిగా సారూప్యం లేకపోయినా దాదాపు అవే పరిస్థితులైతే ప్రతిబింబించాయన్నది వాస్తవం. ఏ పార్టీకీ మెజార్టీ రాకపోవటం తెరవెనక ఎన్నో రాజకీయాలు నడవటం వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

RESTRICTION SUMMARY: MANDATORY ON SCREEN CREDIT TO REAL-NEWS.TV
SHOTLIST:
VALIDATED UGC - MANDATORY ON SCREEN CREDIT TO REAL-NEWS.TV
++USER GENERATED CONTENT: THIS VIDEO HAS BEEN AUTHENTICATED BY AP BASED ON THE FOLLOWING VALIDATION CHECKS:
++VIDEO AND AUDIO CONTENT CHECKED AGAINST KNOWN LOCATIONS AND EVENTS BY REGIONAL EXPERTS
++VIDEO IS CONSISTENT WITH INDEPENDENT AP REPORTING
++VIDEO CLEARED FOR USE BY ALL AP CLIENTS BY REAL-NEWS.TV
++MOBILE PHONE FOOTAGE/QUALITY AS INCOMING++
++NIGHT SHOT++
Durres - 26 November 2019
1. Damaged building with rubble in front
++DAY SHOTS++
Durres - 26 November 2019
2. Onlookers in front of damaged building, rescuers working to remove rubble
3. Tracking shot of area with onlookers and rescuers
4. Rescuer cutting through a concrete slab on top of rubble
5. Wide of excavator
STORYLINE:
Rescue crews used excavators to search for survivors trapped in toppled apartment buildings on Tuesday after a powerful pre-dawn earthquake in Albania killed at least 14 people and injured more than 600.
The 6.4 magnitude quake was felt across the southern Balkans and was followed by multiple aftershocks.
The quake in Albania collapsed at least three apartment buildings while people slept, and rescue crews were working to free people believed trapped.
There was no indication as to how many people might still be buried in the rubble.
The U.S. Geological Survey said the magnitude-6.4 quake, which struck just before 4 a.m. local time, had an epicenter 30 kilometers (19 miles) northwest of the capital, Tirana, at a depth of 20 kilometers (12 miles).
Scores of aftershocks included three with preliminary magnitudes of between 5.1 and 5.4.
The Defense Ministry said seven bodies were pulled from rubble in the coastal city of Durres, 33 kilometers (20 miles) west of the capital Tirana and five people were found dead in a collapsed apartment building in the northern town of Thumane.
One person died after jumping from his home to escape in Kurbin, 50 kilometers (30 miles) north of the capital, while another person was killed on a road that collapsed in the northern town of Lezha.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 26, 2019, 11:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.