ETV Bharat / bharat

మహారాష్ట్రపై కరోనా పంజా.. ఒక్క రోజులో ఆరుగురు బలి

author img

By

Published : Apr 3, 2020, 10:30 PM IST

మహారాష్ట్రలో శుక్రవారం 67 కొత్త కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మరణించారు. ఫలితంగా రాష్ట్రంలో కేసుల సంఖ్య 490కి చేరింది. మరణాలు 26కు చేరాయి.

Maha COVID-19 tally now 490; 67 new cases, 6 deaths in a day
కరోనా పంజా

మహారాష్ట్రపై కరోనా వైరస్​ పంజా విసురుతోంది. శుక్రవారం 67 కొత్త కేసులు నమోదవగా... మొత్తం కేసుల సంఖ్య 490కు చేరింది. తాజాగా మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం వల్ల మొత్తం మరణాలు 26కు చేరాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు.

ముంబయి(43), మంబయి మెట్రోపాలిటన్‌(10), పుణె(9), అహ్మద్​నగర్​ జిల్లా(3), వాషిమ్​(1), రత్నగిరి(1) ప్రాంతాల్లో ఈ తాజా కేసులు నమోదయ్యాయి. ముంబయి(2), వసాయి(1), విరార్​(1), బద్లాపూర్​(1), జాల్​గావ్​​(1), పుణె(1)లో మరణాలు సంభవించాయి.

భద్రతా బలగాలకూ...

ముంబయిలోని 11 మంది కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాల సిబ్బందికి కూడా కరోనా సోకింది. వీరంతా ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తుండగా వైరస్​ సోకినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

ఇదీ చూడండి : కరోనా పంజా: దేశంలో 24 గంటల్లోనే 478 కొత్త కేసులు

మహారాష్ట్రపై కరోనా వైరస్​ పంజా విసురుతోంది. శుక్రవారం 67 కొత్త కేసులు నమోదవగా... మొత్తం కేసుల సంఖ్య 490కు చేరింది. తాజాగా మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం వల్ల మొత్తం మరణాలు 26కు చేరాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు.

ముంబయి(43), మంబయి మెట్రోపాలిటన్‌(10), పుణె(9), అహ్మద్​నగర్​ జిల్లా(3), వాషిమ్​(1), రత్నగిరి(1) ప్రాంతాల్లో ఈ తాజా కేసులు నమోదయ్యాయి. ముంబయి(2), వసాయి(1), విరార్​(1), బద్లాపూర్​(1), జాల్​గావ్​​(1), పుణె(1)లో మరణాలు సంభవించాయి.

భద్రతా బలగాలకూ...

ముంబయిలోని 11 మంది కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాల సిబ్బందికి కూడా కరోనా సోకింది. వీరంతా ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తుండగా వైరస్​ సోకినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

ఇదీ చూడండి : కరోనా పంజా: దేశంలో 24 గంటల్లోనే 478 కొత్త కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.